BCCI: టీమిండియా ప్లేయర్స్కు బీసీసీఐ గుడ్న్యూస్.. ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చని వెల్లడి
- టీమిండియా ప్లేయర్స్కు బీసీసీఐ గుడ్న్యూస్..
- నో ఫ్యామిలీ రూల్ నుంచి ప్లేయర్స్ కు రిలీఫ్ ఇచ్చిన బీసీసీఐ..
- కండీషన్స్ అప్లయ్ అంటూ ఆటగాళ్లకు బీసీసీఐ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఘోర ఓటమి తర్వాత ప్లేయర్స్, స్టాఫ్కు సంబంధించి బీసీసీఐ కఠిన నిబంధనలు విధించింది. ఇకపై క్రికెటర్లు తమ భాగస్వాములు, ఫ్యామిలిని వెంట తీసుకెళ్లడం సహా పలు సౌకర్యాల విషయంలో ఆంక్షలు పెట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఇప్పటికే బీసీసీఐ తేల్చి చెప్పింది. కానీ, తాజాగా ఈ ‘నో ఫ్యామిలీ రూల్’ నుంచి ప్లేయర్స్ కు కాస్త రిలీఫ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దుబాయ్కి ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులను తీసుకెళ్లచ్చని చెప్పిందని టాక్. అందుకు కొన్ని షరతు పెట్టినట్లు తెలుస్తుంది.
Read Also: Online Betting: బెట్టింగ్ భూతానికి మరో ప్రాణం బలి.. ప్రాణం కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
Also Read
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- Haryana: అంతర్జాతీయ కబడ్డీ ఆటగాడు మోహిత్ హఠాన్మరణం
- India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- India vs Sri Lanka 2nd Test: భారత్తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
ఇక, ఛాంపియన్స్ ట్రోఫీలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్కు మాత్రమే ప్లేయర్స్ వెంట ఫ్యామిలీని అనుమతిస్తామని బీసీసీఐ చెప్పినట్లు టాక్. ఈ విషయాన్ని జాతీయ మీడియాలో కథనాలు ప్రచురించింది. కుటంబాన్ని వెంట తెచ్చుకునే విషయం గురించి ప్లేయర్స్ అందరూ చర్చించుకొని ఆ తర్వాత అభ్యర్థన చేసుకోవాలని బీసీసీఐ చెప్పినట్లు తెలుస్తుంది. దానికి అనుగుణంగా బోర్డు ఏర్పాట్లు చేయనున్నట్లు సదరు కథనాల్లో పేర్కొన్నాయి.
Read Also: YS Jagan: అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతా.. వైఎస్ జగన్ ఫైర్!
అయితే, బీసీసీఐ తీసుకొచ్చిన 10 పాయింట్ల పాలసీ ప్రకారం.. నెల రోజుల పర్యటన ఉంటే.. ఒక వారం ఫ్యామిలీతో ఉండేందుకు అవకాశం ఉంది. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభమై.. మార్చి 9వ తేదీన ముగియనుంది. దీంతో ఈ టోర్నీకి క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు పర్మిషన్ లేదని అప్పుడే బీసీసీఐ చెప్పుకొచ్చింది. దీనిపై ఓ సీనియర్ క్రికెటర్ నుంచి వినతి వచ్చినా.. ఎవరికీ మినహాయింపు ఇవ్వలేమని బోర్డు తేల్చి చెప్పింది. అయితే, రేపటటి (బుధవారం) నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కాబోతుంది. భారత్ ఆడే మ్యాచ్లు దుబాయ్లో జరగనున్నాయి. ఇప్పటికే టీమిండియా అక్కడికి చేరుకుంది. ఈ టోర్నీలో రోహిత్ సేన ఫిబ్రవరి 20వ తేదీన తన తొలి మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడనుండగా.. 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో పోటీ పడబోతుంది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!