Online Betting: బెట్టింగ్ భూతానికి మరో ప్రాణం బలి.. ప్రాణం కోల్పోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
- బెట్టింగ్ భూతానికి సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణం బలి.
- ఆన్లైన్ బెట్టింగ్లో 80 లక్షలకుపైగా కోల్పోయిన సంజయ్
- అప్పుడు తీర్చాలని తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్న సంజయ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Betting: కామారెడ్డిలో బెట్టింగ్ మోజు ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఆన్లైన్ బెట్టింగ్లో 80 లక్షలకుపైగా కోల్పోయి అప్పుల బాధలో మునిగిపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సంజయ్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. భార్య శ్రీలత కన్నీరుమున్నీరవుతూ.. అప్పుల బాధల వల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, బెట్టింగ్ యాప్లను తక్షణమే నిషేధించాలని కోరింది. అలాగే, ఎవరైనా అప్పు ఇచ్చే ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలి అంటూ వాపోయింది.
Read Also: Medak: దారుణం.. ప్రియురాలని పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియుడు
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న సంజయ్ ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై రోజు రోజుకు మరింత డబ్బు పోగొట్టుకున్నాడు. చివరకు రూ.80 లక్షల వరకు నష్టపోయి తీవ్రంగా అప్పులపాలయ్యాడు. అప్పులు తిరిగి చెల్లించాలని అప్పుకు డబ్బులు ఇచ్చినవారు అతనిపై తీవ్రంగా ఒత్తిడి చేయడంతో ఇక జీవితం కొనసాగించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సంజయ్ మరణంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చిన్న వయస్సులోనే ఇద్దరు పిల్లలు తండ్రి ప్రేమను కోల్పోయి అనాథలుగా మారిపోయారు.
Read Also: Israel: లెబనాన్లో ఐడీఎఫ్ దాడి.. హమాస్ ఆపరేషన్స్ అధిపతి షాహీన్ హతం
సంజయ్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతనిపై అప్పుల వసూళ్లకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బెట్టింగ్ ద్వారా అతను ఎంత మేరకు నష్టపోయాడు? ఎవరి వద్ద ఎంత అప్పులు చేశాడు? ఎవరు అతనిపై ఒత్తిడి తెచ్చారు? అనే కోణాల్లో విచారణ చేపట్టే పనిలో పడ్డారు. ఈ ఘటన మరోసారి బెట్టింగ్ యాప్ల వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. ప్రజలు ఆన్లైన్ బెట్టింగ్కు లోనవ్వకుండా, ఆర్థికంగా బాధ్యతగా వ్యవహరించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!