T20 World Cup: బంగ్లాదేశ్ క్రికెటర్లు మారరా ? .. కోహ్లీ “ఫేక్ ఫీల్డింగ్” చేశాడంటూ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Player Accuses Virat Kohli Of “Fake” Fielding: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ రేసులో ముందుంది. బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. విజయం వైపు దూసుకెళ్తున్న బంగ్లాదేశ్ ను ఐదు పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ పరాజయాన్ని బంగ్లా ఫ్యాన్స్, క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ను ఓడించేందుకు వచ్చామని బీరాలు పలికిన బంగ్లా టీమ్ కు ఏడుపు ఒకటే తక్కువ. దీంతో ఓటమికి సాకులు వెతుకుతోంది బంగ్లాదేశ్.
Read Also: By-elections: మునుగోడుతో పాటు దేశంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. బీజేపీకి కీలకం
Also Read
- Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
- Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక... బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
- Mohammed Shami: ‘నాలో ఇంకా సత్తా తగ్గలేదు’.. సెలక్టర్ల కళ్లు తెరిపించేలా షమీ మాస్ వార్నింగ్..
- Babar Azam: ఫామ్లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
భారత్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ‘‘ఫేక్ ఫీల్డింగ్’’ చేశాడని ఆరోపించాడు బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాటర్ నూరుల్ హనన్. ఇది ఆన్ ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేదని ఆరోపిస్తున్నాడు. అంపైర్లు క్రిస్ బ్రౌన్, మరైస్ ఎరాస్మస్ ఘటనను పట్టించుకోలేదని ఆరోపించారు. ఇది తమ జట్టుకు ఐదు పరుగులను దూరం చేసిందని చెబుతున్నాడు. వర్షం కారణంగా 16 ఓవర్లలో 151 పరుగుల టార్గెట్ ను చేధించాల్సిన బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 146 పరుగుల చేసి ఓడిపోయింది. వర్షానికి ముందు వరకు లిట్టన్ దాస్ హిట్టింగ్ లో గెలుపుబాటలో ఉన్న బంగ్లా టీమ్, వర్షం తరువాత వరసగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్ లో అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఒక సిక్స్, ఓ ఫోర్ బాదిన నూరుల్ హసన్ బంగ్లాదేశ్ ను చివరి వరకు గేమ్ లో ఉంచాడు. అయితే మ్యాచ్ గెలిపించలేకపోయాడు. దీంతో తన అక్కసును వెళ్లగక్కుతున్నాడు.
నూరుల్ చెప్పిన విరాట్ కోహ్లీ ‘‘ ఫేక్ ఫీల్డింగ్’’ ఘటన ఏడో ఓవర్ లో జరిగింది. లిట్టన్ దాస్-నజ్ముల్ హెస్సెన్ శాంటో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతిని అర్ష్దీప్ సింగ్ డీప్ నుంచి వికెట్ కీపర్ కు బాల్ విసురుతాడు. మధ్యలో విరాట్ కోహ్లీ బంతిని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కు విసురుతున్నట్లు వీడియోలో కనిపించింది. అయితే ఈ విషయాన్ని ఇద్దరు బ్యాటర్లు చూడలేదని.. ఫేక్ ఫీల్డింగ్ అంటూ నూరుల్ విమర్శిస్తున్నాడు. ఐసీసీ రూల్ 41.5 ప్రకారం ఉద్దేశపూర్వకంగా మోసగించడం, బ్యాటర్ ను అడ్డుకోవడాన్ని నిషేధిస్తుంది. దీనిని అంపైర్లు గుర్తిస్తే డెడ్ బాల్ గా ప్రకటించి ఐదు పెనాల్టీ పరుగులను ఇవ్వవచ్చు. అయితే మ్యాచ్ అధికారులపై విమర్శలు చేసిన నూరుల్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
#INDvsBAN is this considered fake fielding? pic.twitter.com/rwLaPwv3xs
— Siddharth (@siddyhere1) November 3, 2022
తాజావార్తలు
-
The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
Shubhman Gill: మైదానంలో విలవిలలాడిన గిల్.. నెట్స్లో ఊహించని ప్రమాదం.. అభిమానుల్లో పెరిగిన ఆందోళన..
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!