T20 World Cup: బంగ్లాదేశ్ క్రికెటర్లు మారరా ? .. కోహ్లీ “ఫేక్ ఫీల్డింగ్” చేశాడంటూ ఆరోపణలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Player Accuses Virat Kohli Of “Fake” Fielding: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ రేసులో ముందుంది. బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా ఘన విజయం సాధించింది. విజయం వైపు దూసుకెళ్తున్న బంగ్లాదేశ్ ను ఐదు పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఈ పరాజయాన్ని బంగ్లా ఫ్యాన్స్, క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్ ను ఓడించేందుకు వచ్చామని బీరాలు పలికిన బంగ్లా టీమ్ కు ఏడుపు ఒకటే తక్కువ. దీంతో ఓటమికి సాకులు వెతుకుతోంది బంగ్లాదేశ్.
Read Also: By-elections: మునుగోడుతో పాటు దేశంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. బీజేపీకి కీలకం
Also Read
- SL A vs Ind A: 100వ మ్యాచ్లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
- Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్ను అందుకోలేకపోయిన వైభవ్!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
- Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
భారత్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ‘‘ఫేక్ ఫీల్డింగ్’’ చేశాడని ఆరోపించాడు బంగ్లాదేశ్ వికెట్ కీపర్-బ్యాటర్ నూరుల్ హనన్. ఇది ఆన్ ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేదని ఆరోపిస్తున్నాడు. అంపైర్లు క్రిస్ బ్రౌన్, మరైస్ ఎరాస్మస్ ఘటనను పట్టించుకోలేదని ఆరోపించారు. ఇది తమ జట్టుకు ఐదు పరుగులను దూరం చేసిందని చెబుతున్నాడు. వర్షం కారణంగా 16 ఓవర్లలో 151 పరుగుల టార్గెట్ ను చేధించాల్సిన బంగ్లాదేశ్ 6 వికెట్ల నష్టానికి 146 పరుగుల చేసి ఓడిపోయింది. వర్షానికి ముందు వరకు లిట్టన్ దాస్ హిట్టింగ్ లో గెలుపుబాటలో ఉన్న బంగ్లా టీమ్, వర్షం తరువాత వరసగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్ లో అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో ఒక సిక్స్, ఓ ఫోర్ బాదిన నూరుల్ హసన్ బంగ్లాదేశ్ ను చివరి వరకు గేమ్ లో ఉంచాడు. అయితే మ్యాచ్ గెలిపించలేకపోయాడు. దీంతో తన అక్కసును వెళ్లగక్కుతున్నాడు.
నూరుల్ చెప్పిన విరాట్ కోహ్లీ ‘‘ ఫేక్ ఫీల్డింగ్’’ ఘటన ఏడో ఓవర్ లో జరిగింది. లిట్టన్ దాస్-నజ్ముల్ హెస్సెన్ శాంటో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బంతిని అర్ష్దీప్ సింగ్ డీప్ నుంచి వికెట్ కీపర్ కు బాల్ విసురుతాడు. మధ్యలో విరాట్ కోహ్లీ బంతిని నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కు విసురుతున్నట్లు వీడియోలో కనిపించింది. అయితే ఈ విషయాన్ని ఇద్దరు బ్యాటర్లు చూడలేదని.. ఫేక్ ఫీల్డింగ్ అంటూ నూరుల్ విమర్శిస్తున్నాడు. ఐసీసీ రూల్ 41.5 ప్రకారం ఉద్దేశపూర్వకంగా మోసగించడం, బ్యాటర్ ను అడ్డుకోవడాన్ని నిషేధిస్తుంది. దీనిని అంపైర్లు గుర్తిస్తే డెడ్ బాల్ గా ప్రకటించి ఐదు పెనాల్టీ పరుగులను ఇవ్వవచ్చు. అయితే మ్యాచ్ అధికారులపై విమర్శలు చేసిన నూరుల్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
#INDvsBAN is this considered fake fielding? pic.twitter.com/rwLaPwv3xs
— Siddharth (@siddyhere1) November 3, 2022
తాజావార్తలు
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
-
Peddi South Vs North: “దీపికా బికినీలు, మృణాల్ స్కిన్ షోలు మీకు ఓకేనా?”
-
Sunny Leone: అడ్డంగా బుక్కైన సన్నీలియోన్.. రంగంలోకి దిగిన సీఐడీ! అసలేం జరిగిందంటే..
-
POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
-
Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!