PAT CUMMINS : ప్యాట్ కమిన్స్ కు మాతృవియోగం.. నల్లబ్యాడ్జీలతో ఆసీస్ ప్లేయర్స్ సంతాపం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియన్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తల్లి మారియా కమిన్స్ గురువారం రాత్రి తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్ లో తెలియజేశారు. దీంతో కమిన్స్ కుటుంబసభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతి పట్ల క్రికెట్ అభిమానులు ప్యాట్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగో టెస్టు రెండో రోజు ఆసీస్ ప్లేయర్స్ అందరు ప్యాట్ కమిన్స్ తల్లికి నివాళిగా తమ చేతికి నల్లటి ఆర్మ్ బ్యాడ్జ్ ధరించి మైదనాంలోకి దిగారు.
Read also : NTR: నటుడిగా కాదు ఒక భారతీయుడిగా రెడ్ కార్పెట్ పై నడుస్తా
Also Read
- Rohit Sharma New Look: హిట్మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్తో ట్రెండింగ్లో రోహిత్ శర్మ
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
- World Cup 2027: వరల్డ్ కప్లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
- Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ట్విట్టర్ వేదికగా ఆమె మృతిపట్ల సంతాపం ప్రకటించింది. మరియా కమిన్స్ మరణవార్త తెలిసి మేమంతా చాలా బాధపడుతన్నామంటు ట్విట్టర్ లో వెల్లడించారు. ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ తరపున ప్యాట్ కమిన్స్ తో పాటు అతని కుటుంబం, స్నేహితులకు మా ప్రగాధ సానుభూతిని తెలుపుతున్నాం.. ఆమె గౌరవార్థం ఆసీస్ టీమ్ మ్యాచ్ లో నల్లి ఆర్మ్ బ్యాడ్జ్ ధరిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు టీమిండియా క్రికెట్ బోర్డు సైతం కమిన్స్ తల్లి మరియా మరణంపై ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపింది.
Read also : Today Stock Market Roundup 10-03-23: ఆర్థిక సంస్థల షేర్లు లబోదిబో
భారత క్రికెట్ తరపున మరియా మరణంపై చాలా బాధపడుతున్నాం.. కష్టకాంలో ప్యాట్, అతని కుటుంబానికి మా సానుభూతి ఉంటుంది అని బీసీసీై తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొంది. అయితే ఆమె గత కొంత కాలంగా రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత తీవ్రంగా మారడం వల్ల ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. అప్పుడే భారత్ లో జరుగుతున్న బోర్డర్-గావస్కర్ ట్రోఫీ రెండో టెస్ట్ ముగిసిన తర్వాత ప్యాట్ కమిన్స్ తన తల్లి కోసం స్వదేశానికి వెళ్లిపోయాడు.
Read also : Cricket : డొమెస్టిక్ లీగ్స్ తో.. ఐసీసీ గ్లోబల్ క్రికెట్ కు ప్రమాదం!
ఇక, అప్పటి నుంచి దగ్గరుండి తల్లి బాగోగులు ప్యాట్ కమిన్స్ చూసుకుంటున్నాడు. మూడు టెస్టు ప్రారంభమయ్యే సమయానికి అతడు తిరిగి వస్తాడని భావించినప్పటికి తల్లీ ఆరోగ్యం మెరుగుపడకపోవడం వల్ల అతను అక్కడే ఉండిపోయాడు. అలా నాలుగో టెస్టుకు కూడా ప్యాట్ కమిన్స్ దూరమయ్యాడు. రెండు టెస్ట్ సమయంలో ప్యాట్ కమిన్స్ వెళ్లిపోయిన తర్వాత అతని స్థానంలో మరో జట్టు సభ్యుడైన స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే వన్డే టీమ్ కు కూడా కమిన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు అతని తల్లి మరణంతో ఆ సిరీస్ కు దూరమయ్యే అవకాశలున్నాయని అభిమానులు అంటున్నారు.
Read also : BRS Meeting: బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. పార్టీ కార్యాచరణపై దిశానిర్దేశం
తాజావార్తలు
-
SS Rajamouli: ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ప్లాన్ ఇదేనా..?
-
Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
-
Rohit Sharma New Look: హిట్మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్తో ట్రెండింగ్లో రోహిత్ శర్మ
-
CM Revanth Reddy : యువతకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్..!
-
Box Office Posters: టాలీవుడ్లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!