Cricket : డొమెస్టిక్ లీగ్స్ తో.. ఐసీసీ గ్లోబల్ క్రికెట్ కు ప్రమాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం క్రికెట్ లో అంతర్జాతీయ మ్యాచ్ ల కంటే తీగ్ ల పేరుతో ఆయా దేశాలు నిర్వహిస్తున్న టోర్నీ మ్యాచ్ లు ఎక్కవైపోయాయి. విరివిగా పుట్టుకొస్తున్న డొమెస్టిక్ లీగ్ ల వల్ల అంతర్జాతీయ క్రికెట్ కు ప్రమాదం పొంచి ఉందని.. దానిని కాపాడుకోవాని క్రికెట్ లో చట్టాలు చేసే మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్( ఎంసీసీ) వెల్లడించింది. ఇప్పటికే ఐపీఎల్,బీబీఎల్, పీఎస్ఎల్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ అంటూ చాలా డొమెస్టిక్స్ లీగ్స్ ఉండగా.. కొత్తగా సౌతాఫ్రికా టీ20, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 పుట్టుకొచ్చాయని.. వీటివల్ల క్రికెట్ లో సంప్రదాయ ఫార్మాట్ టెస్టు క్రికెట్ సహా అంతర్జాతీయ క్రికెట్ కు ప్రమాదం ఉందని వెల్లడించింది.
Also Read :Sumalatha: ప్రధాని మోదీకే నా ఫుల్ సపోర్ట్.. బీజేపీకి సినీనటి, ఎంపీ సుమలత మద్దతు
Also Read
- Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
- How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
అంతేకాదు ఈ లీగ్ ల వల్ల ఐసీసీ నిర్వహిస్తున్న ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ పై ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. ఈ లీగ్ ల్లో అగ్రభాగం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లకే చెందినవే ఉన్నాయని ఆయా దేశాల్లో ఇది పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.. కానీ డొమెస్టిక్ లీగ్స్ వల్ల ఐసీసీలో భాగమైన అసోసియేట్ దేశాలు సహా అఫ్గానిస్థాన్, ఐర్లాండ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లు నష్టపోతున్నాయని తెలిపింది. దుబాయ్ వేదికగా వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC)తో ఎంసీసీ భేటీ అయింది. చర్చలో భాగంగానే డొమెస్టిక్ లీగ్ లను కట్టడి చేస్తే మంచిదని అభిప్రాయపడింది.
Also Read : Dangerous Virus: భారత్లో ఇన్ఫ్లూయెంజా పంజా.. H3N2 వైరస్తో ఇద్దరు మృతి
2023 నుంచి 2027 వరకు ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ పేరుతో షెడ్యూల్ ను రూపొందించింది. అంతర్జాతీయ క్రికెట్ తోనే బిజీగా గడిపే క్రికెటర్లు.. ఆయా లీగ్స్ ఆడుతూ గాయాల పాలయ్యి కీలక సమయాల్లో జట్టుకు దూరమవుతున్నారని తెలిపింది. అందుకు ఉదహరణగా పాకిస్తాన్ ప్లేయర్ షాహిన్ అఫ్రిది, ఇండియా బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా లాంటి క్రికెటర్లే అంటూ ఎంసీసీ పేర్కొంది. ఈ ట్రెండ్ ఇలానే కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అంతర్జాతీయ క్రికెట్ కు, డొమిస్టిక్ లీగ్ క్రికెట్ మధ్య ఓవర్ లాప్ ఏర్పాడి సమస్య మొదలవుతుందని వివరించింది.
ఈ ఏడాదిలో ఒక్క అక్టోబర్-నవంబర్ నెలలు మాత్రమే గ్యాప్ ఏర్పడిందని.. ఆ గ్యాప్ కు కారణం కూడా ఐసీసీ వన్డే ప్రపంపకప్ నిర్వహించనుండడమే.ఈ సమయంలో అన్ని దేశాలు తమ అత్యున్నత జట్లతో బరిలోకి దిగుతాయి కాబట్టి ఎలాంటి డొమెస్టిక్ లీగ్స్ కు ఆస్కారం ఉండదని తెలిపింది. మెన్స్ క్రికెట్ లో మాత్రమే ఇలా ఉందని మహిళల క్రికెట్ లో ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ ను రూపొందించింది. అయితే ఇప్పడిప్పుడే మహిళల క్రికెట్ లో విరివిగా డొమెస్టిక్ లీగ్ లు పుట్టుకొస్తున్నాయి. అందుకే ముందస్తు జాగ్రత్తగా డొమెస్టిక్ లీగ్ లతో ఐసీసీ గ్లోబల్ క్రికెట్ కు ముప్పు వాటిల్లకుండా బ్యాలెన్సింగ్ చేసుకోవాలని ఎంసీసీ.. వరల్డ్ క్రికెట్ కమిటీ(WCC)ని అర్జించింది.
తాజావార్తలు
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్గా సింగపూర్ ఎలా మారింది?
-
Fake Currency: ఎంఎన్ సీ కంపెనీలో జాబ్.. ఏడాదికి రూ.42 లక్షల శాలరీ.. హోటల్ లో ఫేక్ కరెన్సీ ప్రింట్ చేస్తున్న టెకీ..
-
IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
-
Online House Hunting Scams: ఆన్లైన్లో ఇల్లు వెతుకుతున్నారా..? ఆకర్షణీయమైన ఫొటోల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించండి..!
-
Ducati 2026 Multistrada V4 Rally: భారత్లో విడుదలైన డుకాటి 2026 మల్టీస్ట్రాడా V4 ర్యాలీ.. ధర రూ. 32 లక్షలు
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..