Today Stock Market Roundup 10-03-23: ఆర్థిక సంస్థల షేర్లు లబోదిబో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Stock Market Roundup 10-03-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో వరుసగా రెండో రోజు.. అంటే.. ఇవాళ శుక్రవారం కూడా నష్టాలు కొనసాగాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో కీలక సూచీలు రోజంతా కోలుకోలేదు. ఉదయం నష్టాలతో ప్రారంభమై సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. ఫలితంగా.. సెన్సెక్స్, నిఫ్టీ.. రెండూ కూడా బెంచ్మార్క్ విలువలకు దిగువనే నమోదయ్యాయి.
సెన్సెక్స్ 671 పాయింట్లు కోల్పోయి 59 వేల 135 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 176 పాయింట్లు తగ్గి 17 వేల 412 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోని మొత్తం 30 కంపెనీల్లో 9 కంపెనీలు మాత్రమే రాణించగా మిగతా 21 కంపెనీలు వెనకబడ్డాయి.
Also Read
read more: Singapore Airlines: సింగపూర్ ఎయిర్లైన్స్ విలీనంతో భారీగా ‘విస్తారం’
బీఎస్ఈలో అదానీ పవర్, బాల్కృష్ణ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు మంచి పనితీరు కనబరిచాయి. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఇండస్ ఇండ్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్, ఐసీఐసీఐ, కొటక్, బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీల షేర్ల విలువ భారీగా పడిపోయింది.
నిఫ్టీలో టాటా మోటార్స్, ఎన్టీపీసీ లాభపడగా అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ, అపోలో హాస్పిటల్స్ 3 శాతం వరకు దిగొచ్చాయి. రంగాల వారీగా చూస్తే.. ఫైనాన్షియల్ సంస్థల స్టాక్స్ ఘోరంగా దెబ్బతిన్నాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎల్ అండ్ టీ, మహింద్రా అండ్ మహింద్రా, ఏసియన్ పెయింట్స్ ఒకటిన్నర శాతం వరకు డౌన్ అయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర 81 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 55 వేల 382 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 160 రూపాయలు తగ్గింది. అత్యధికంగా 61 వేల 824 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 99 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 178 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూలో పెద్దగా మార్పులేదు. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 2 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!