Today Stock Market Roundup 10-03-23: ఆర్థిక సంస్థల షేర్లు లబోదిబో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Stock Market Roundup 10-03-23: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో వరుసగా రెండో రోజు.. అంటే.. ఇవాళ శుక్రవారం కూడా నష్టాలు కొనసాగాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో కీలక సూచీలు రోజంతా కోలుకోలేదు. ఉదయం నష్టాలతో ప్రారంభమై సాయంత్రం కూడా నష్టాలతోనే ముగిశాయి. ఫలితంగా.. సెన్సెక్స్, నిఫ్టీ.. రెండూ కూడా బెంచ్మార్క్ విలువలకు దిగువనే నమోదయ్యాయి.
సెన్సెక్స్ 671 పాయింట్లు కోల్పోయి 59 వేల 135 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 176 పాయింట్లు తగ్గి 17 వేల 412 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోని మొత్తం 30 కంపెనీల్లో 9 కంపెనీలు మాత్రమే రాణించగా మిగతా 21 కంపెనీలు వెనకబడ్డాయి.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
read more: Singapore Airlines: సింగపూర్ ఎయిర్లైన్స్ విలీనంతో భారీగా ‘విస్తారం’
బీఎస్ఈలో అదానీ పవర్, బాల్కృష్ణ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు మంచి పనితీరు కనబరిచాయి. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఇండస్ ఇండ్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్, ఐసీఐసీఐ, కొటక్, బజాజ్ ఫైనాన్స్ వంటి కంపెనీల షేర్ల విలువ భారీగా పడిపోయింది.
నిఫ్టీలో టాటా మోటార్స్, ఎన్టీపీసీ లాభపడగా అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ, అపోలో హాస్పిటల్స్ 3 శాతం వరకు దిగొచ్చాయి. రంగాల వారీగా చూస్తే.. ఫైనాన్షియల్ సంస్థల స్టాక్స్ ఘోరంగా దెబ్బతిన్నాయి.
వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎల్ అండ్ టీ, మహింద్రా అండ్ మహింద్రా, ఏసియన్ పెయింట్స్ ఒకటిన్నర శాతం వరకు డౌన్ అయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర 81 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 55 వేల 382 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.
కేజీ వెండి రేటు 160 రూపాయలు తగ్గింది. అత్యధికంగా 61 వేల 824 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర 99 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 178 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూలో పెద్దగా మార్పులేదు. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 2 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..