AP IPL Team: ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదు.. చిన్నతనంగా లేదా?! ఎమ్మెస్కే ప్రసాద్ ఏం చెప్పాడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MSK Prasad React on Why Andhra Do Not Have IPL Team: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే మరో రెండు జట్లను తీసుకొచ్చారు. దాంతో భారతదేశంలోని ప్రధాన రాష్ట్రాల నుంచి ఐపీఎల్ జట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ ఉన్నా.. అది హైదరాబాద్ ఫ్రాంచైజీగా ముద్రపడింది. ప్రస్తుతం ఆంధ్రకు ఐపీఎల్ టీమ్ లేదు. ఆంధ్రకు కూడా ఓ ప్రాంచైజీ ఉంటే బాగుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఆంధ్రకు ఐపీఎల్ ప్రాంచైజీ ఎందుకు లేదో మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.
ఎమ్మెస్కే ప్రసాద్ తాజాగా ఓ తెలుగు న్యూస్ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఎమ్మెస్కే పలు విషయాలు పంచుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఐపీఎల్ జట్లు ఉన్నా ఆంధ్రకు మాత్రం ఎందుకు లేదు?, బీసీసీఐలో కీలక రోల్ ప్లే చేసిన మీకు చిన్నతనంగా లేదా?, బీసీసీఐలో ఎవరైనా అడ్డుపడ్డారా? అని యాంకర్ అడగ్గా… ‘ఐపీఎల్, బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదు. సౌత్ ఇండియా నుంచి తమిళనాడుకు చెన్నై సూపర్ కింగ్స్, కర్నాటకకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్కు సన్రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో 6-7 రాష్ట్రాలు ఉండగా.. ఒక కోల్కతా నైట్ రైడర్స్ మాత్రమే ఉంది. ఐపీఎల్ టీమ్ ఓ ఫ్రాంచైజీ నుంచి వస్తుంది కానీ.. ప్రాంతం తరఫున రాదు’ అని ఎమ్మెస్కే బదులిచ్చాడు.
Also Read
- LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
- WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
- Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
- Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
‘ఐపీఎల్ ప్రాంచైజీ బిడ్డింగ్ బట్టి ఉంటుంది. రెండేళ్ల కింద రెండు జట్లు అమ్మారు. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీలను అమ్మారు. అపుడు ఆంధ్రాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త శరత్చంద్రా రెడ్డి 3,500 కోట్లకు బిడ్ వేశారు. 5500 కోట్లకు ఓ టీమ్, 7200 కోట్లకు మ్ముడుపోయింది. ప్రాంచైజీ కొన్నదాన్ని బట్టి ఉంటుంది కానీ.. ప్రాంతాన్ని బట్టి ఉండదు. ఓ సమయంలో వైజాగ్ లేదా అమరావతి నుంచి టీమ్ వస్తుందని అనుకున్నా.. అది జరగలేదు. టీమ్స్ ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇన్ని మ్యాచులు ఉండడం వల్లనే అంతర్జాతీయ మ్యాచులలో భారత్ ఓడిపోతుందని అంటున్నారు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు.
- Tags
- ap
- AP IPL Team
- bcci
- IPL team
- MSK Prasad
తాజావార్తలు
-
National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
-
LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!