AP IPL Team: ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ ఎందుకు లేదు.. చిన్నతనంగా లేదా?! ఎమ్మెస్కే ప్రసాద్ ఏం చెప్పాడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MSK Prasad React on Why Andhra Do Not Have IPL Team: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే మరో రెండు జట్లను తీసుకొచ్చారు. దాంతో భారతదేశంలోని ప్రధాన రాష్ట్రాల నుంచి ఐపీఎల్ జట్లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ ఉన్నా.. అది హైదరాబాద్ ఫ్రాంచైజీగా ముద్రపడింది. ప్రస్తుతం ఆంధ్రకు ఐపీఎల్ టీమ్ లేదు. ఆంధ్రకు కూడా ఓ ప్రాంచైజీ ఉంటే బాగుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అయితే ఆంధ్రకు ఐపీఎల్ ప్రాంచైజీ ఎందుకు లేదో మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపాడు.
ఎమ్మెస్కే ప్రసాద్ తాజాగా ఓ తెలుగు న్యూస్ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ఎమ్మెస్కే పలు విషయాలు పంచుకున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఐపీఎల్ జట్లు ఉన్నా ఆంధ్రకు మాత్రం ఎందుకు లేదు?, బీసీసీఐలో కీలక రోల్ ప్లే చేసిన మీకు చిన్నతనంగా లేదా?, బీసీసీఐలో ఎవరైనా అడ్డుపడ్డారా? అని యాంకర్ అడగ్గా… ‘ఐపీఎల్, బీసీసీఐకి ఎలాంటి సంబంధం లేదు. సౌత్ ఇండియా నుంచి తమిళనాడుకు చెన్నై సూపర్ కింగ్స్, కర్నాటకకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, హైదరాబాద్కు సన్రైజర్స్ హైదరాబాద్ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో 6-7 రాష్ట్రాలు ఉండగా.. ఒక కోల్కతా నైట్ రైడర్స్ మాత్రమే ఉంది. ఐపీఎల్ టీమ్ ఓ ఫ్రాంచైజీ నుంచి వస్తుంది కానీ.. ప్రాంతం తరఫున రాదు’ అని ఎమ్మెస్కే బదులిచ్చాడు.
Also Read
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
- IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
‘ఐపీఎల్ ప్రాంచైజీ బిడ్డింగ్ బట్టి ఉంటుంది. రెండేళ్ల కింద రెండు జట్లు అమ్మారు. లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ప్రాంచైజీలను అమ్మారు. అపుడు ఆంధ్రాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త శరత్చంద్రా రెడ్డి 3,500 కోట్లకు బిడ్ వేశారు. 5500 కోట్లకు ఓ టీమ్, 7200 కోట్లకు మ్ముడుపోయింది. ప్రాంచైజీ కొన్నదాన్ని బట్టి ఉంటుంది కానీ.. ప్రాంతాన్ని బట్టి ఉండదు. ఓ సమయంలో వైజాగ్ లేదా అమరావతి నుంచి టీమ్ వస్తుందని అనుకున్నా.. అది జరగలేదు. టీమ్స్ ఎక్కువగా ఉన్నాయని ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇన్ని మ్యాచులు ఉండడం వల్లనే అంతర్జాతీయ మ్యాచులలో భారత్ ఓడిపోతుందని అంటున్నారు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు.
- Tags
- ap
- AP IPL Team
- bcci
- IPL team
- MSK Prasad
తాజావార్తలు
-
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
-
Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
-
Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
-
Ghost SIM Scam: ‘ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
-
OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న ‘ఓలా ఎలక్ట్రిక్’..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!