T20 World Cup: పాకిస్థాన్ పిలుస్తోంది.. 1992 సెంటిమెంటా? 2007 సెంటిమెంటా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 ప్రపంచకప్ 1992 వన్డే ప్రపంచకప్ జరిగినట్లే జరుగుతోంది. అప్పుడు, ఇప్పుడు మెగా టోర్నీకి వేదిక ఆస్ట్రేలియానే కావడం గమనించాల్సిన విషయం. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా దయతో సెమీస్ బెర్త్ కొట్టేసిన పాకిస్థాన్ ఏకంగా ఫైనల్కు దూసుకెళ్లింది. ఇప్పుడు రెండో సెమీస్ నుంచి ఫైనల్కు ఎవరు వస్తారు అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ క్రికెట్ అభిమానులు దాయాదుల పోరును చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాకిస్థాన్ కూడా ఫైనల్కు భారత్ రావాలని కోరుకుంటోంది. అయితే కొందరు పాకిస్థాన్ అభిమానులు మాత్రం 1992 సెంటిమెంట్ రిపీట్ అవ్వాలంటే టీమిండియా కాకుండా ఇంగ్లండ్ ఫైనల్కు రావాలని ఆరాటపడుతున్నారు. ఎందుకంటే 1992 వన్డే ప్రపంచకప్లోనూ తొలి సెమీస్ న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరగ్గా పాకిస్థాన్ విజయం సాధించింది. మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్పై పాకిస్తాన్ గెలిచి విశ్వవిజేతగా అవతరించింది.
Read Also: T20 World Cup: ఫైనల్కు దూసుకెళ్లిన పాకిస్థాన్.. తొలి సెమీస్లో న్యూజిలాండ్ చిత్తు
Also Read
- Tim David: నీకు ఫైన్ వేయడంలో ఏమాత్రం తప్పు లేదయ్యా.. గ్రౌండ్ లోనే సిగార్ తాగుతూ రచ్చ రచ్చ.!
- Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
- Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
అటు టీమిండియా అభిమానులు కూడా 2007 ప్రపంచకప్ సెంటిమెంట్ రిపీట్ కావాలని కోరుకుంటున్నారు. గురువారం నాడు రెండో సెమీస్లో ఇంగ్లండ్పై గెలిస్తే టీమిండియా కూడా ఫైనల్ చేరుతుంది. 2007లో గ్రూప్ స్టేజీలో భారత్ నంబర్వన్గా నిలవగా.. ఇప్పుడు కూడా గ్రూప్ స్టేజీలో టీమిండియా నంబర్వన్గా నిలిచిందని పలువురు గుర్తుచేస్తున్నారు. అప్పుడు గ్రూప్ స్టేజీలో పాకిస్థాన్పై భారత్ గెలవగా.. ఇప్పుడు కూడా పాకిస్థాన్పై రోహిత్ సేన విజయం సాధించింది. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్పై పాకిస్తాన్ గెలిచింది. ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడగా టీమిండియా విజేతగా అవతరించింది. ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుందని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు. మరి గురువారం రెండో సెమీస్ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అన్న విషయంపై ఈ టోర్నీ ఫలితం ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
-
Tamballapalle MLA: చావడానికైనా, చంపడానికైనా సిద్ధం.. తంబళ్లపల్లె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!