T20 World Cup: పాకిస్థాన్ పిలుస్తోంది.. 1992 సెంటిమెంటా? 2007 సెంటిమెంటా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: టీ20 ప్రపంచకప్ 1992 వన్డే ప్రపంచకప్ జరిగినట్లే జరుగుతోంది. అప్పుడు, ఇప్పుడు మెగా టోర్నీకి వేదిక ఆస్ట్రేలియానే కావడం గమనించాల్సిన విషయం. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా దయతో సెమీస్ బెర్త్ కొట్టేసిన పాకిస్థాన్ ఏకంగా ఫైనల్కు దూసుకెళ్లింది. ఇప్పుడు రెండో సెమీస్ నుంచి ఫైనల్కు ఎవరు వస్తారు అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మెజారిటీ క్రికెట్ అభిమానులు దాయాదుల పోరును చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాకిస్థాన్ కూడా ఫైనల్కు భారత్ రావాలని కోరుకుంటోంది. అయితే కొందరు పాకిస్థాన్ అభిమానులు మాత్రం 1992 సెంటిమెంట్ రిపీట్ అవ్వాలంటే టీమిండియా కాకుండా ఇంగ్లండ్ ఫైనల్కు రావాలని ఆరాటపడుతున్నారు. ఎందుకంటే 1992 వన్డే ప్రపంచకప్లోనూ తొలి సెమీస్ న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరగ్గా పాకిస్థాన్ విజయం సాధించింది. మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్పై పాకిస్తాన్ గెలిచి విశ్వవిజేతగా అవతరించింది.
Read Also: T20 World Cup: ఫైనల్కు దూసుకెళ్లిన పాకిస్థాన్.. తొలి సెమీస్లో న్యూజిలాండ్ చిత్తు
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. 300 బంతులు ఆడగలనని ప్రపంచానికి చూపించాలి!
- Shubman Gill Record: శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
- Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
- Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
అటు టీమిండియా అభిమానులు కూడా 2007 ప్రపంచకప్ సెంటిమెంట్ రిపీట్ కావాలని కోరుకుంటున్నారు. గురువారం నాడు రెండో సెమీస్లో ఇంగ్లండ్పై గెలిస్తే టీమిండియా కూడా ఫైనల్ చేరుతుంది. 2007లో గ్రూప్ స్టేజీలో భారత్ నంబర్వన్గా నిలవగా.. ఇప్పుడు కూడా గ్రూప్ స్టేజీలో టీమిండియా నంబర్వన్గా నిలిచిందని పలువురు గుర్తుచేస్తున్నారు. అప్పుడు గ్రూప్ స్టేజీలో పాకిస్థాన్పై భారత్ గెలవగా.. ఇప్పుడు కూడా పాకిస్థాన్పై రోహిత్ సేన విజయం సాధించింది. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్పై పాకిస్తాన్ గెలిచింది. ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడగా టీమిండియా విజేతగా అవతరించింది. ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుందని భారత్ అభిమానులు ఆశిస్తున్నారు. మరి గురువారం రెండో సెమీస్ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అన్న విషయంపై ఈ టోర్నీ ఫలితం ఆధారపడి ఉంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!