YCP : వైసీపీ మంత్రుల బస్సుయాత్ర..అనంత టీడీపీలో గలాటా
ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్లో సాగుతోంది. ఓపెన్గానే విమర్శలు చేసుకుంటున్నారు నాయకులు. ఇప్పుడు మంత్రుల బస్సుయాత్ర సైతం జేసీ, పల్లెల మధ్య మాటల మంటలు రాజేస్తున్నాయి. వాటి చుట్టూనే ప్రస్తుతం రాజకీయ చర్చలు జరుగుతున్నాయి.
బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు జిల్లాకు వచ్చారు. ఆ సమయంలో వేదికపై జేసీ దివాకర్రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి ఒకరినొకరు పలకరించుకున్నారు. ఆ దృశ్యం చూసిన పార్టీ శ్రేణులు ఆశ్చర్యపోయాయి. ఇకపై ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉండబోవని అనుకున్నారట. కానీ.. సీన్ కట్ చేస్తే వారం తిరగకుండానే మళ్లీ పాత పగలు కొత్తగా బుస కొడుతున్నాయి. అనంతపురం జిల్లాకు మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర వచ్చింది. అట్టహాసంగా యాత్ర ముగింపు సభ నిర్వహించారు వైసీపీ నేతలు. ఈ సభే జేసీ, పల్లె మధ్య మళ్లీ చిచ్చు రాజేసింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. వైసీపీ సభకు జనాల్ని తరలించేందుకు పల్లె రఘునాథరెడ్డికి సంబంధించిన కాలేజీ బస్సులు ఇచ్చారట. ఆ అంశంపైనే ప్రశ్నలు సంధిస్తోంది జేసీ శిబిరం.
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
వైసీపీ నేతలతో మాజీ మంత్రి పల్లెకు సంబంధాలు ఉన్నాయని కొంతకాలంగా జేసీ వర్గం ఆరోపిస్తోంది. ఇప్పుడు వైసీపీ సభకు పల్లె కాలేజీకి చెందిన బస్సులు ఎలా పెడతారని.. జేసీ వర్గీయులు సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. రాజకీయ కక్షతో దివాకర్ ట్రావెల్స్ బస్సులపై వైసీపీ ప్రభుత్వం కేసులు పెడుతోందని.. అదే సమయంలో టీడీపీ మాజీ మంత్రి కాలేజీ బస్సులు వైసీపీ సభలకు జనాల్ని తరలిస్తున్నాయని జేసీ వర్గం మాటల తూటాలు పేలుస్తోంది. అయితే పార్టీ సభలకు బస్సులు ఇవ్వకపోతే భవిష్యత్లో ఇబ్బందులు వస్తాయని బెదిరించడం వల్లే వాటిని సమకూర్చామని వివరణ ఇస్తున్నారు పల్లె వర్గీయులు.
ఈ సమస్య చినికి చినికి గాలి వానగా మారుతుండటంతో పల్లె విద్యా సంస్థల వెహికల్స్ ఇంఛార్జ్ తమ ప్రమేయం లేకుండానే బస్సులను తీసుకెళ్లారని వివరణ ఇచ్చారు. కానీ.. జేసీ వర్గం శాంతించడం లేదు. పల్లెపై అంతెత్తున లేస్తూనే ఉంది. మొత్తానికి పార్టీ కేడర్లోనూ కొత్త చర్చ మొదలైందట. వైసీపీ మంత్రులు బస్సు యాత్రలు చేయడం ఏంటో.. ఆ యాత్రకు టీడీపీ నేత కాలేజీ బస్సులు పంపడం ఏంటో అని చెవులు కొరుక్కునేవారు ఎక్కువయ్యారట. మరి.. ఈ ఎపిసోడ్ రానున్న రోజుల్లో అనంత టీడీపీలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ
-
Raka: అల్లు అర్జున్ ‘రాకా’లో అక్షయ్ కుమార్.. అట్లీ మాస్టర్ ప్లాన్ అదిరిపోయిందిగా!
-
Assam Assembly Election Results: హిమంత బిస్వా శర్మ 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా.. ఈసారి జలుక్బరి స్థానంలో ఎవరు గెలుస్తారు?
-
Mamata Banerjee: ‘‘కరెంట్ తీసేస్తున్నారు’’.. ఓట్ల లెక్కింపునకు ముందు మమతా సంచలన ఆరోపణ..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!