KCR : జాతీయపార్టీగా మారాలన్న గులాబీ పార్టీతో కలిసి నడిచేదెవరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బీజేపీ ఒకవైపు.. ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయపక్షాలు మరోవైపు పావులు కదుపుతున్నాయి. మమతా బెనర్జీ సమావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న గులాబీ పార్టీ.. హస్తినలో విపక్షాల సమావేశానికి దూరంగా ఉండటం వెనక ఉన్న మతలబుపై చర్చ జరుగుతోంది. ఇందుకు తమ కారణాలు తమకు ఉన్నాయన్నది టీఆర్ఎస్ నేతలు చెప్పేమాట. తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్నామన్న సంకేతాలు పంపడంలో భాగంగానే టీఆర్ఎస్ ఆ నిర్ణయం తీసుకుందనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో కాంగ్రెస్తో కలిసి వేదిక పంచుకోవడం సరికాదన్న అభిప్రాయంలో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం జాతీయస్థాయిలో చక్రం తిప్పేందుకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. నేషనల్ పార్టీ ఏర్పాటు చేసి దేశ రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచనలో ఆయన ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటే భవిష్యత్లో దేశంలో జాతీయపార్టీగా మారే టీఆర్ఎస్కు కలసి వచ్చేది ఎవరు అనే చర్చ జరుగుతోంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వల్లో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉంది. దాంతో ఆ పార్టీలు కాంగ్రెస్ను వీడి టీఆర్ఎస్తో జాతీయస్థాయిలో ఎంత వరకు కలిసి వస్తాయన్నది విశ్లేషకుల ప్రశ్న. మహారాష్ట్ర, తమిళనాడు, జార్ఖండ్ రాష్ట్రల్లో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాలు ఉన్నాయి.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
అయితే రాజకీయల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు అంటూ ఉండబోరన్న వాదన ఉంది. ఆ సూత్రం టీఆర్ఎస్ విషయంలోనూ వర్తిస్తుందన్నది కొందరి మాట. ఒకసారి జాతీయ పార్టీగా మారి.. విధానాలు ప్రకటించాక.. ఇప్పుడు ఊగిసలాటలోఉన్న ఇతర పార్టీలు వైఖరి మార్చుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్కు సమాన దూరం అనే లైన్ను ఎస్టాబ్లిష్ చేసే పనిలో గులాబీ నేతలు ఉన్నారట. ఇప్పటికే వివిధ పార్టీల నేతలు.. సీఎంలతో సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహించి ఉన్నారు. తమ అభిప్రాయం ఏంటో వారితో స్పష్టంగా చర్చించి ఉండటంతో.. తమకు క్లారిటీ ఉందని చెబుతున్నారు గులాబీ నేతలు. మరి..ఈ వ్యూహం టీఆర్ఎస్కు ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!