YCP : పాలకొల్లులో వైసీపీ అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పేయాలట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ రాజకీయం రసవత్తరంగా ఉంది. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ అభ్యర్థి ఎవరన్నదానిపై అప్పుడే చర్చ మొదలైంది. ఇక్కడ గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచింది. దీంతో పాలకొల్లులో వైసీపీ వ్యూహం మారిపోయింది. గత మూడేళ్లుగా ఆ వ్యూహ రచనలో భాగంగా అనేక ఎత్తుగడలు వేసింది అధికారపార్టీ. అయితే పార్టీ కేడర్ ఆలోచన మరోలా ఉందట. వ్యూహాలు చాలు.. అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పేస్తే ఆ మేరకు పని మొదలుపెడతామని చెబుతున్నారట. ఇప్పటి నుంచి కసరత్తు చేస్తే కానీ.. ఫలితం సానుకూలంగా రాదని లోకల్ పార్టీ నేతలూ అభిప్రాయపడుతున్నారట.
పాలకొల్లు వైసీపీ ఇంఛార్జ్గా జడ్పీ ఛైర్మన్ కవురు శ్రీనివాస్ ఉన్నారు. అలాగే అధికారపార్టీలో గ్రూపులూ ఎక్కువే. కలిసి సాగే పరిస్థితి లేదు. ఎవరి కుంపటి వారిదే. కవురు సారథ్యాన్ని వ్యతిరేకించేవాళ్లూ బలంగానే వాయిస్ వినిపిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా కవురు ఇంటింటికీ వెళ్తున్నా.. పార్టీ నేతల నుంచి ఆయనకు సహకారం శూన్యం. దీంతో వైసీపీలో మరో చర్చ తెరపైకి తెస్తున్నారట.
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
- Off The Record: పాలకొల్లు వైసీపీకి ఎందుకు కలిసిరావడం లేదు?
- Off The Record: ఆ 24 మంది ఎవరు? తాడిపత్రిలో జేసీ సంచలన హెచ్చరిక
పాలకొల్లులో పట్టు సాధించాలంటే జనంలోకి దూసుకెళ్లే నాయకుడు కావాలని.. బలమైన అభ్యర్థిని తెరపైకి తీసుకురావాలని చెబుతున్నారట. దీంతో ఇంఛార్జ్గా ఉన్న కవురు శ్రీనివాస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోరా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. గతంలో కవురు ఆచంట అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. చివరి నిమిషంలో ఆ సీటును చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు ఇచ్చారు. ఇప్పుడు పాలకొల్లు విషయంలోనూ కవురుకు అదే రిపీట్ అవుతుందని చెవులు కొరుక్కుంటున్నారట.
నియోజకవర్గంలో టిడ్కో గృహాలకు సంబంధించి 7వేల కుటుంబాలు సందిగ్ధంలో ఉన్నాయి. ఈ సమస్య అధికారపార్టీ నేతలకు పాలకొల్లులో తలనొప్పిగా మారింది. గడపగడపలో వీటిపైనే స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అలాగే క్షత్రియ సామాజికవర్గానికి ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్కు మధ్య గ్యాప్ వచ్చిందట. ఆ విషయం తెలిసినప్పటి నుంచి టికెట్ ఆశించేవాళ్లు పెరిగిపోయారు. ఇతర పార్టీల నుంచి వైసీపీ కండువా కప్పుకొన్న కొందరు తమదే టికెట్ అని అనుచరులకు చెబుతున్నారట. దీంతో పాలకొల్లు వైసీపీలో అభ్యర్థిపై కేడర్లో బీపీ పెరిగిపోతోందట. ఇప్పటికిప్పుడు పార్టీ అధిష్ఠానం క్యాండిడేట్ ఎవరన్నది క్లారిటీ ఇచ్చే పరిస్థితి లేకున్నా.. వైసీపీ శ్రేణుల ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. మరి.. కవురు శ్రీనివాస్కే కాలం కలిసి వస్తుందో లేక మరో నాయకుడు తెరపైకి వస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
-
Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
-
TVS Raider Doctor Doom Edition: మార్వెల్ డాక్టర్ డూమ్ స్ఫూర్తితో టీవీఎస్ కొత్త బైక్.. ధర, ఇంజిన్, ఫీచర్లు ఇవే!
-
Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
-
TTD Employees: టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవీ విరమణ.. కీలక విభాగాల్లో సిబ్బంది కొరత!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!