వైసీపీ లెక్కలేంటి..? టీడీపీ ఓటు బ్యాంకు కు గట్టిగానే గురిపెట్టారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య. తెలుగు రాష్ట్రాల్లోని వెనకబడిన తరగతులకు.. రాజకీయ పార్టీలకు ఆయన సుపరిచితం. అలాంటి నాయకుడు ఒక్కసారిగా ఏపీ, తెలంగాణలో చర్చగా మారారు. దానికి కారణం ఆయన్ను రాజ్యసభకు వైసీపీ ఎంపిక చేయడమే. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఆర్ కృష్ణయ్యకు ఇస్తారనే చర్చ జరుగుతున్న సమయంలోనే ఆయన తాడేపల్లిలో కనిపించారు. వైసీపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీసీల సంక్షేమం .. హక్కుల సాధన కోసం ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్యకు ఏపీ, తెలంగాణలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా బీసీ ఓట్ బ్యాంక్ను పోలరైజ్ చేస్తారనే లెక్కలతో వైసీపీ ఆయన వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
ఆర్ కృష్ణయ్య మొదటిసారి 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ నుంచి ఎల్బీనగర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి.. మిర్యాలగూడ నుంచి 2018లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అన్ని పార్టీలతో సమాన దూరం పాటిస్తూ వస్తున్నారు కృష్ణయ్య. అలాంటిది ఇప్పుడు సడెన్గా ఏపీలో తేలారు. ఆయన్ని వైసీపీ రాజ్యసభకు ఎంపిక చేయడం వెనక కారణాలపై రాజకీయ విశ్లేషణలు జోరందుకున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ, నామినేటెడ్తోపాటు వివిధ పదవుల్లో బీసీ సామాజికవర్గాలకు పెద్ద పీట వేస్తున్నారు. కేబినెట్లోనే పది మంది మంత్రులు బీసీలు ఉన్నారు. టీడీపీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను వైసీపీవైపు తిప్పుకొనే వ్యూహంలో భాగంగా చాలా మందికి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఆ కోణంలోనే కృష్ణయ్యకు పెద్ద పదవి ఆఫర్ చేసినట్టు భావిస్తున్నారు.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డితో కూడా కృష్ణయ్యకు సంబంధాలు ఉండేవి. అవి కూడా ప్రస్తుతం కృష్ణయ్య వైపు వైసీపీ మొగ్గు చూపడానికి కారణమైందని విశ్లేషిస్తున్నారు. ఏతావాతా చూస్తే.. వైసీపీ తాజా ఎత్తుగడ రాజకీయంగా పెద్ద అస్త్రంగానే అభిప్రాయ పడుతున్నారు. బీసీలకు పెద్దపీట వేయడం ద్వారా ఆ వర్గాలకు మరింత చేరువయ్యేందుకు వీలు కలుగుతుందని అధికారపార్టీ శిబిరంలోనూ లెక్కలతో కుస్తీ పడుతున్నారట. మరి.. ఈ ఎత్తుగడ వైసీపీకి ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!