వైసీపీ లెక్కలేంటి..? టీడీపీ ఓటు బ్యాంకు కు గట్టిగానే గురిపెట్టారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య. తెలుగు రాష్ట్రాల్లోని వెనకబడిన తరగతులకు.. రాజకీయ పార్టీలకు ఆయన సుపరిచితం. అలాంటి నాయకుడు ఒక్కసారిగా ఏపీ, తెలంగాణలో చర్చగా మారారు. దానికి కారణం ఆయన్ను రాజ్యసభకు వైసీపీ ఎంపిక చేయడమే. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఆర్ కృష్ణయ్యకు ఇస్తారనే చర్చ జరుగుతున్న సమయంలోనే ఆయన తాడేపల్లిలో కనిపించారు. వైసీపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీసీల సంక్షేమం .. హక్కుల సాధన కోసం ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్యకు ఏపీ, తెలంగాణలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా బీసీ ఓట్ బ్యాంక్ను పోలరైజ్ చేస్తారనే లెక్కలతో వైసీపీ ఆయన వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
ఆర్ కృష్ణయ్య మొదటిసారి 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ నుంచి ఎల్బీనగర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి.. మిర్యాలగూడ నుంచి 2018లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అన్ని పార్టీలతో సమాన దూరం పాటిస్తూ వస్తున్నారు కృష్ణయ్య. అలాంటిది ఇప్పుడు సడెన్గా ఏపీలో తేలారు. ఆయన్ని వైసీపీ రాజ్యసభకు ఎంపిక చేయడం వెనక కారణాలపై రాజకీయ విశ్లేషణలు జోరందుకున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ, నామినేటెడ్తోపాటు వివిధ పదవుల్లో బీసీ సామాజికవర్గాలకు పెద్ద పీట వేస్తున్నారు. కేబినెట్లోనే పది మంది మంత్రులు బీసీలు ఉన్నారు. టీడీపీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను వైసీపీవైపు తిప్పుకొనే వ్యూహంలో భాగంగా చాలా మందికి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఆ కోణంలోనే కృష్ణయ్యకు పెద్ద పదవి ఆఫర్ చేసినట్టు భావిస్తున్నారు.
Also Read
- OTR : ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి తలనొప్పిగా మారారా?
- OTR : వైసీపీ అధిష్టానం కఠిన నిర్ణయాలకు సిద్ధం అయిందా? ఆ ముగ్గురు నేతల పరిస్థితి ఏంటి?
- OTR : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తీరుపై సీఎం రేవంత్ సీరియస్.. అసలు కారణం ఇదే
- OTR : సొంత వైఎస్సార్సీపీకి షాకిస్తున్న ఎమ్మెల్సీ.. పవన్ కళ్యాణ్ పై ప్రశంసల వెనుక ఆంతర్యమేంటి?
గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డితో కూడా కృష్ణయ్యకు సంబంధాలు ఉండేవి. అవి కూడా ప్రస్తుతం కృష్ణయ్య వైపు వైసీపీ మొగ్గు చూపడానికి కారణమైందని విశ్లేషిస్తున్నారు. ఏతావాతా చూస్తే.. వైసీపీ తాజా ఎత్తుగడ రాజకీయంగా పెద్ద అస్త్రంగానే అభిప్రాయ పడుతున్నారు. బీసీలకు పెద్దపీట వేయడం ద్వారా ఆ వర్గాలకు మరింత చేరువయ్యేందుకు వీలు కలుగుతుందని అధికారపార్టీ శిబిరంలోనూ లెక్కలతో కుస్తీ పడుతున్నారట. మరి.. ఈ ఎత్తుగడ వైసీపీకి ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..
-
Mumbai Indians Captain: ముగ్గురు దిగ్గజాల సపోర్ట్.. తెలుగు ఆటగాడికి ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ!
-
Agadha Trailer: రక్తం, రహస్యాలు, దైవిక శక్తుల పోరు.. వణుకు పుట్టిస్తున్న ఎంఎస్ రాజు ‘అగధ’ ట్రైలర్!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!