బీజేపీలో ఈటెలకు సముచిత స్థానం దక్కుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీలో ఈటెల స్థానం ఏంటి? సముచిత గౌరవం దక్కుతుందా? సీనియారిటీకి తగ్గ గుర్తింపు లభిస్తుందా? ఇప్పుడు ఇలాంటి చర్చే మొదలైంది. సీనియారిటీకి తగ్గట్టే ఈటలకు పదవీ దక్కుతుందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇంతకీ ఈటెలకోసం బీజేపీ సిద్ధం చేస్తున్న ఆ కుర్చీ ఏంటి? ఇప్పటికే ఆ కుర్చీలో కూర్చున్నవారి పరిస్థితి ఏంటి?
టీఆర్ఎస్ నుంచి ఎంత వేగంగా బయటకొచ్చారో.. అంతే వేగంగా బీజేపీలో చేరిపోయారు ఈటల రాజేందర్. అధికార పార్టీని ఢీ కొట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించి తీరారు. నిన్నటిదాకా నియోజక వర్గంపై దృష్టి సారించిన ఈటలకు ఇప్పుడు బీజేపీ అప్పజెప్పబోయే బాధ్యతలు ఏంటి అన్నది ఆసక్తికరంగా మారుతోంది. వదిలి వచ్చిన పార్టీలో ఈటల స్థానం చాలా పెద్దది, అదేస్థాయి గౌరవం ఇప్పుడు బీజేపీలో దక్కుతుందా? లేదా? అన్న ఉత్కంట ఆయన అనుచరుల్లో కనిపిస్తోంది.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
సాధారణంగా పార్టీల శాసన సభ పక్ష నేతలుగా సీనియర్ల కు, అనుభవజ్ఞులకు అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజాదరణ ఉన్న నేతలకు ఆ బాధ్యతలు అప్పగిస్తారు. బీజేపీ లో కూడా అంతే, గతం లో బీజేపీ పక్ష నేతలుగా పార్టీ సీనియర్ లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు లాంటి వాళ్ళు పని చేసారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజాసింగ్ ఒక్కడె ఎమ్మెల్యేగా ఉండటంతో అతనే ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. తర్వాత రఘునందన్ను ప్లోర్ లీడర్ను ప్రచారం జరిగింది. దీని ద్వారా రఘునందన్కు, రాజా సింగ్ మధ్య కాస్త గ్యాప్కూడా వచ్చింది. పార్టీ మాత్రం ఫ్లోర్ లీడర్ను మార్చే అవకాశంలేదని చెప్పడంతో అప్పుడా చర్చకు ఫుల్స్టాప్ పడింది. కానీ! ఇప్పుడు ఈటల ఎంట్రీతో సీన్ మారింది.
సీనియర్నే ఫ్లోర్ లీడర్ను చేస్తూ వచ్చిన బీజేపీలో ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో సీనియర్ కావడం, గతంలో ఫ్లోర్ లీడర్గా పనిచేసిన అనుభవం ఉండటం, అధికార పక్షం గురించి అన్ని తెలిసిన వ్యక్తి కావడంతో రాజాసింగ్ను తొలగించి ఆస్థానంలో ఈటలను కూర్చోబెడతారని పార్టీలో చర్చ నడుస్తోంది. మరో వైపు రాజా సింగ్ కూడా లాంగ్వేజ్ సమస్య ఉంది. ఆయన హిందు , గో రక్షణ తప్ప మిగతా అంశాల పై అంత పర్ఫెక్ట్ కాదనే అభిప్రాయం ఉంది. బీజేపీ నాయకత్వం కూడా ఈటల ను పార్టీ శాసన సభ పక్ష నేతగా చేసేందుకే మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
-
Pakistan Minister: “చేతులు నరికేస్తాం”.. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
-
Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!