టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆ నలుగురి రాజకీయ భవిష్యత్తేంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు చేరికలు టిఆర్ఎస్ కు ఎంత వరకు కలసి వచ్చాయి ? ఆ నలుగురు నేతల చేరికతో ప్లస్ అవుతుంది అనుకుంటే…అలాంటిదేమీ జరగలేదా? గులాబి పార్టీలో హుజూరాబాద్ ఫలితం తర్వాత జరుగుతున్న చర్చలేంటి?
హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది.టిఆర్ఎస్ పార్టీ ఆశించిన ఫలితం రాబట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దీంతో హుజురాబాద్ ఫలితంపై టిఆర్ఎస్ లో అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. ఓటమికి కారణాలపై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. ఉపఎన్నికలో గెలుపు కోసం చేసిన ప్రయత్నాలపైనా చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన చేరికలు ఎంత వరకు కలసి వచ్చాయి అన్న కోణంలో చర్చ జరుగుతోంది.
Also Read
ఉపఎన్నిక కంటే ముందు గులాబి పార్టీలో చేరికలు జరిగాయి. వరుసగా వివిధ పార్టీలకు చెందిన నేతలు అధికార పార్టీలోకి వచ్చారు. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కౌశిక్ రెడ్డి, ఎల్.రమణ, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు గులాబి కండువా కప్పుకున్నారు. భారీగా అనుచరగణం, అభిమానులతో కలసి టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు.
టియ్యారెస్ లో చేరిన కౌశిక్ రెడ్డి, పెద్ది రెడ్డి ఇద్దరూ హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన వారు. ఇటు ఎల్.రమణ బీసీ సామాజిక వర్గం, మోత్కుపల్లి నరసింహులు దళిత సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు. వీరి చేరికతో ఉప ఎన్నికలో టిఆర్ఎస్ కు ఎంతో కొంత కలసి వస్తుందన్న విశ్లేషణలు జరిగాయి. అయితే హుజురాబాద్ ఫలితం వచ్చిన తర్వాత ఈ నేతల చేరికతో ఎంత లాభం జరిగింది …ఎన్ని ఓట్లు పడ్డాయన్న ప్రశ్నలు ఇపుడు వినిపిస్తున్నాయి.
ఈ నలుగురు నేతల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు టిఆర్ఎస్ ఆయా నేతల సామాజిక సమీకరణాలు… నేతలకున్న ఇమేజ్ ను పరిగణనలోకి తీసుకుంది. ఉప ఎన్నికలో ఎంతో కొంత కలసి వస్తుందని భావించింది. కానీ ఫలితాలు చూస్తే, ఇప్పడు అనేక ప్రశ్నలు లేవనెత్తే పరిస్థితి వచ్చింది. మరి హుజురాబాద్ ఫలితాలు ఈ నేతల రాజకీయ భవిష్యత్తుపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అనే వాదనలు వినిపిస్తున్నాయి?
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!