Off The Record: వీధికెక్కిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల పంచాయితీ
- అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీలో వార్ టూ..
- ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి..
- ప్రసాద్కు అర్బన్ టిక్కెట్ ఇచ్చాక మారిన పరిస్థితులు..
- గెలిచాక మొదలైన అసలు సినిమా..
- ప్రతి అంశంలోనూ బయటికి వస్తున్న ఎమ్మెల్యే అనుచరుల పేర్లు..
- ఎమ్మెల్యే అనుచరుల మీద అడ్డగోలు దందాల ఆరోపణలు..
- అంతా దుష్ప్రచారం అంటూ ఖండిస్తున్న దగ్గుపాటి ప్రసాద్..
- అస్రా ఆప్టికల్ భూ వివాదంతో పీక్స్కు చేరిన వార్..
- ఓపెనైపోయి సవాళ్ళు విసురుకున్న ఇద్దరు నేతలు..
- ఏం జరిగినా నాకు ముడి పెడుతున్నారని ఎమ్మెల్యే ఆవేదన..
- సొసైటీ భూములు కాజేశారు, పార్టీ ఆఫీసులు తగలబెట్టారని ఆరోపణ..
- ఎమ్మెల్యే తాగి అసభ్యంగా మాట్లాడతారన్న ప్రభాకర్ చౌదరి..
- తాళిబొట్లు తెంచింది ఎవరో చెబుతానన్న మాజీ ఎమ్మెల్యే..
- నువ్వో నేనో తేల్చుకుందాం రా అంటూ చౌదరి సవాల్..
- ఇద్దరు నేతల సవాళ్ళతో టీడీపీ కేడర్లో టెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: సై… తేల్చుకుందాం రా…! ఆడో… ఈడో.. కాదు. ఊరి నడిబొడ్డున మీటింగ్ పెడదాం. నువ్వేంటో నేనేంటో మాట్లాడదామంటూ తొడ గొడుతున్నారు ఆ ఇద్దరు నేతలు. ఇద్దరూ వేర్వేరు పార్టీల వాళ్ళయితే అది వేరే సంగతి. కానీ…. అధికార టీడీపీకి చెందిన నాయకులే అవడం, ఒకకరు సిట్టింగ్, మరొకరు మాజీ ఎమ్మెల్యే కావడంతో కేడర్లో కంగారు పెంచుతోందట. ఎవరా ఇద్దరు? ఎందుకలా వీధికెక్కారు?
Read Also: Deputy cm pawan kalyan : గెలిస్తే ఒక న్యాయం ఓడిపోతే ఇంకో న్యాయమా !
Also Read
- Off The Record: ఆ 24 మంది ఎవరు? తాడిపత్రిలో జేసీ సంచలన హెచ్చరిక
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
- OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
- Off The Record: ముద్రగడ సంస్మరణ సభకు టీడీపీ నేతలు వెళ్తారా..? తెలుగు తమ్ముళ్లలో కొత్త టెన్షన్
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో… ఎక్కడైనా రాజకీయపరమైన గొడవలు జరిగాయంటే….. అది కచ్చితంగా టీడీపీ, వైసీపీ మధ్యనే అనుకోవడం కామన్. కానీ… అనంతపురం అర్బన్లో మాత్రం వ్యవహారం బాగా తేడాగా ఉందట. ఇక్కడ టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్టుగా వార్ జరుగుతోంది. అదీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే … మాజీ ఎమ్మెల్యే మధ్య కావడంతో… మేటర్ మాంచి రంజుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. రాప్తాడు మండలం బండమీదపల్లికి చెందిన దగ్గుపాటి ప్రసాద్ 2024 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ టికెట్ సాధించి గెలిచారు. ప్రసాద్కు టిక్కెట్ వచ్చినప్పటి నుంచే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, దగ్గుపాటి వర్గీయుల మధ్య పైకి కనిపించని ఒక యుద్ధం జరుగుతోంది. అయితే గెలిచాక అంతా సర్దుకుంటుందని అనుకున్నా… అసలు సినిమా ఆ తర్వాతే మొదలైంది. నగరంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచరుల పేర్లు బయటికి వస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. భూ ఆక్రణలు, రిజిస్ట్రేషన్లు, మద్యం షాపులు,వ్యాపారుల నుంచి వసూళ్ళు… ఇలా అన్నిటిలో ఎమ్మెల్యే వర్గీయులు ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది.
Read Also: Swiggy: వినియోగదారులకు షాక్ ఇచ్చిన స్విగ్గీ.. భారీగా ప్లాట్ఫారమ్ ఫీజు పెంపు!
అయితే, ఇదంతా పక్క పార్టీ వాళ్ళ పని కాదని, సొంత పార్టీలో ఉన్న ప్రత్యర్థులేనన్నది ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారన్నది ఎమ్మెల్యే దగ్గుపాటి వాదన. 14 నెలలుగా ఇలా ఎమ్మెల్యే మీద ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. కానీ గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు మాత్రం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్ను పీక్స్కు తీసుకువెళ్ళాయి. ఎమ్మెల్యేపై ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలు ఒక ఎత్తైతే.. సాయినగర్ లోని అస్రా ఆప్టికల్స్ స్థల వివాదం ఇంకో ఎత్తు అన్నట్టుగా మారింది. అక్కడ మైనార్టీ కుటుంబం తాముంటున్న క్లినిక్ స్థలాన్ని ఓనర్ నుంచి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఇదే స్థలానికి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగింది. కొత్తగా కొన్న వారు, అసలు ఓనర్ దగ్గర నుంచి వారికి ప్రెజర్ వచ్చిందట. అయితే… దీని వెనక ఉండి కథ నడిపిస్తున్నది.. ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గీయులంటూ ప్రచారం మొదలైంది. దీన్ని ఎమ్మెల్యే వర్గీయులు ఖండించారు. వారం నుంచి ఈ తంతు జరుగుతూనే ఉంది. ఎమ్మెల్యే దగ్గుపాటి వర్గీయులుగా చెబుతున్న వారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మీద పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య యుద్ధం క్లైమాక్స్కు చేరింది. నిన్నటిదాకా పరోక్షంగా విమర్శించుకున్న వారు ఇక ఓపెనైపోయి సవాళ్ళు విసురుకున్నారు.
Read Also: Pakistan Helicopter Crash: పాక్లో ఘోరం.. వరద సహాయక చర్యల్లో కూలిన హెలికాప్టర్
ఓ సీనియర్ నాయకుడి కుట్రలు అంటూ ముందు ఓపెనైపోయారు ఎమ్మెల్యే ప్రసాద్. ఏ చిన్న సంఘటన జరిగినా తనతోపాటు తన కుటుంబ సభ్యులను బయటకు లాగుతున్నారని, ఈ 14 నెలల్లో నా కుటుంబ సభ్యుల పేర్ల మీద, నా పేరు మీద ఒక్క సెంటు భూమి కొనలేదన్నారు ఎమ్మెల్యే. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఛైర్మన్ గా ఉన్నప్పుడు సొసైటీ భూములు కాజేశారని, పార్టీ ఆఫీసులు తగలపెట్టిన వారు కూడా నా గురించి మాట్లాడుతారా అంటూ ఫైర్ అయ్యారాయన. తనను ఉద్దేశించి పరోక్షంగా అన్న మాటలకు డైరెక్ట్గా ఓపెనైపోయారు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. నువ్వు తాగి ఎంతమంది సొంత పార్టీ నాయకులతో అసభ్యంగా మాట్లాడావో.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ ఫైర్ అయ్యారాయన. ఎవరు తాళిబొట్లు తెంచారో… ఎవరు నాయకుల మధ్య గొడవలు పెట్టారో.. ఉదాహరణలతో సహా చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు చౌదరి. రాప్తాడులో ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ఎవరు ముద్దాయిగా ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Off The Record: 95 నాటి సీఎం దిశగా చంద్రబాబు యాక్షన్ మొదలైందా?
ఇక, రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వైసీపీ నాయకులందరినీ చేరదీసి ఇక్కడ దౌర్జన్యాలు, అక్రమాలు చేస్తున్నది ఎవరికి తెలియని సంగతులంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే. ఇక నువ్వో, నేనో తేల్చుకుందాం రా.. చర్చకు సిద్ధంగా ఉన్నా” అంటూ సవాల్ విసరడంతో కాక రేగింది. దీంతో అనంతపురం తెలుగుదేశం కేడర్లో కూడా ఒక్కసారిగా ఏదో తెలియని ఆందోళన పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్ళు విభేదాలున్నా…. ఏదో, లోలోప నడిచేవని, ఇప్పుడు ఇద్దరూ ఇలా ఓపెనైపోవడంతో… ఈ వార్ ఎట్నుంచి ఎటు పోతుందో, పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్నది టీడీపీ కార్యకర్తల ఆందోళన.
తాజావార్తలు
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
-
Vaibhav Sooryavanshi: అప్పుడే వైభవ్ సూర్యవంశీకి ప్రమోషన్.. వైస్ కెప్టెన్గా ఎంపిక..
-
Story Board: దేశ రాజకీయం యువత చుట్టూ తిరగబోతోందా? అందుకే పార్టీలన్నీ Gen-Z జపం చేస్తున్నాయా?
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!