Pakistan Helicopter Crash: పాక్లో ఘోరం.. వరద సహాయక చర్యల్లో కూలిన హెలికాప్టర్
Pakistan Helicopter Crash: పాకిస్థాన్ ఉత్తర ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో పాటు, కొండచరియలు విరిగిపడటంతో 164 మంది మరణించారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్న MI-17 హెలికాప్టర్ కూలిపోయి ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు మరణించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. దేశంలో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్థాన్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
READ MORE: Off The Record: కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ఆలస్యం వెనుక మర్మం?
Also Read
విధ్వంసం సృష్టించిన వరదలు..
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారీ వర్షాలు సంభవించి వరదలు విధ్వంసం సృష్టించాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో వరదల సమయంలో శుక్రవారం సహాయ చర్యలలో నిమగ్నమై ఉన్న MI-17 హెలికాప్టర్ కూలిపోయింది. మహ్మద్ జిల్లాలోని పాండియాలి ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రమాదం జరిగిందని సీఎం అలీ అమీన్ గందాపూర్ తెలిపారు. “బజౌర్లోని వర్ష ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రిని తీసుకెళ్తున్న ప్రాంతీయ ప్రభుత్వానికి చెందిన MI-17 హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా మహ్మద్ జిల్లాలోని పాండియాలి ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు సిబ్బంది మరణించారు” అని గందాపూర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వానికి చెందిన MI-17 హెలికాప్టర్ పెషావర్ నుంచి బజౌర్కు వెళ్తుండగా, మొహమ్మద్ గిరిజన జిల్లాపై సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదం వాతావరణం వల్లే జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని పలువురు అధికారులు వెల్లడించారు.
వరదల్లో 164 మంది మృతి..
భారీ వర్షాల కారణంగా ఉత్తర పాక్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించాయి. గత 24 గంటల్లో ఈ ప్రాంతంలో సుమారుగా 164 మంది మరణించారని అక్కడి అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పర్వత ప్రాంతాలైన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో సుమారు 150 మంది మరణించారని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. పాకిస్థాన్ వాతావరణ శాఖ కూడా వాయువ్య ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. 2022 లో కూడా భారీ వరదలు సంభవించి పాక్లోని మూడో వంతు ప్రాంతాన్ని ముంచెత్తుతాయి, ఆ సమయంలో 1,700 మంది మృతి చెందారు.
READ MORE: Off The Record: దశాబ్దం తర్వాత ఆ బడా నేతలను ప్రోటోకాలే కలిపిందా?
తాజావార్తలు
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో