Pakistan Helicopter Crash: పాక్లో ఘోరం.. వరద సహాయక చర్యల్లో కూలిన హెలికాప్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Helicopter Crash: పాకిస్థాన్ ఉత్తర ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో పాటు, కొండచరియలు విరిగిపడటంతో 164 మంది మరణించారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్న MI-17 హెలికాప్టర్ కూలిపోయి ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు మరణించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. దేశంలో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్థాన్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
READ MORE: Off The Record: కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ఆలస్యం వెనుక మర్మం?
Also Read
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
- China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
- Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
- Night Bus Services: హైదరాబాద్లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
విధ్వంసం సృష్టించిన వరదలు..
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారీ వర్షాలు సంభవించి వరదలు విధ్వంసం సృష్టించాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో వరదల సమయంలో శుక్రవారం సహాయ చర్యలలో నిమగ్నమై ఉన్న MI-17 హెలికాప్టర్ కూలిపోయింది. మహ్మద్ జిల్లాలోని పాండియాలి ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రమాదం జరిగిందని సీఎం అలీ అమీన్ గందాపూర్ తెలిపారు. “బజౌర్లోని వర్ష ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రిని తీసుకెళ్తున్న ప్రాంతీయ ప్రభుత్వానికి చెందిన MI-17 హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా మహ్మద్ జిల్లాలోని పాండియాలి ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు సిబ్బంది మరణించారు” అని గందాపూర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వానికి చెందిన MI-17 హెలికాప్టర్ పెషావర్ నుంచి బజౌర్కు వెళ్తుండగా, మొహమ్మద్ గిరిజన జిల్లాపై సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదం వాతావరణం వల్లే జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని పలువురు అధికారులు వెల్లడించారు.
వరదల్లో 164 మంది మృతి..
భారీ వర్షాల కారణంగా ఉత్తర పాక్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించాయి. గత 24 గంటల్లో ఈ ప్రాంతంలో సుమారుగా 164 మంది మరణించారని అక్కడి అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పర్వత ప్రాంతాలైన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో సుమారు 150 మంది మరణించారని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. పాకిస్థాన్ వాతావరణ శాఖ కూడా వాయువ్య ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. 2022 లో కూడా భారీ వరదలు సంభవించి పాక్లోని మూడో వంతు ప్రాంతాన్ని ముంచెత్తుతాయి, ఆ సమయంలో 1,700 మంది మృతి చెందారు.
READ MORE: Off The Record: దశాబ్దం తర్వాత ఆ బడా నేతలను ప్రోటోకాలే కలిపిందా?
తాజావార్తలు
-
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
-
China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
-
Nagarjuna: నాగార్జునకు బర్త్డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
-
Vijay Sai Reddy: నేను వైసీపీని వీడటానికి అసలు కారణం ఇదే.. విజయసాయిరెడ్డి లేఖలో కీలక విషయాలు..
-
Night Bus Services: హైదరాబాద్లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!