Pakistan Helicopter Crash: పాక్లో ఘోరం.. వరద సహాయక చర్యల్లో కూలిన హెలికాప్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Helicopter Crash: పాకిస్థాన్ ఉత్తర ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో పాటు, కొండచరియలు విరిగిపడటంతో 164 మంది మరణించారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్న MI-17 హెలికాప్టర్ కూలిపోయి ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు మరణించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. దేశంలో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్థాన్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
READ MORE: Off The Record: కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ఆలస్యం వెనుక మర్మం?
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
విధ్వంసం సృష్టించిన వరదలు..
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారీ వర్షాలు సంభవించి వరదలు విధ్వంసం సృష్టించాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో వరదల సమయంలో శుక్రవారం సహాయ చర్యలలో నిమగ్నమై ఉన్న MI-17 హెలికాప్టర్ కూలిపోయింది. మహ్మద్ జిల్లాలోని పాండియాలి ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రమాదం జరిగిందని సీఎం అలీ అమీన్ గందాపూర్ తెలిపారు. “బజౌర్లోని వర్ష ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రిని తీసుకెళ్తున్న ప్రాంతీయ ప్రభుత్వానికి చెందిన MI-17 హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా మహ్మద్ జిల్లాలోని పాండియాలి ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు సిబ్బంది మరణించారు” అని గందాపూర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వానికి చెందిన MI-17 హెలికాప్టర్ పెషావర్ నుంచి బజౌర్కు వెళ్తుండగా, మొహమ్మద్ గిరిజన జిల్లాపై సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదం వాతావరణం వల్లే జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని పలువురు అధికారులు వెల్లడించారు.
వరదల్లో 164 మంది మృతి..
భారీ వర్షాల కారణంగా ఉత్తర పాక్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించాయి. గత 24 గంటల్లో ఈ ప్రాంతంలో సుమారుగా 164 మంది మరణించారని అక్కడి అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పర్వత ప్రాంతాలైన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో సుమారు 150 మంది మరణించారని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. పాకిస్థాన్ వాతావరణ శాఖ కూడా వాయువ్య ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. 2022 లో కూడా భారీ వరదలు సంభవించి పాక్లోని మూడో వంతు ప్రాంతాన్ని ముంచెత్తుతాయి, ఆ సమయంలో 1,700 మంది మృతి చెందారు.
READ MORE: Off The Record: దశాబ్దం తర్వాత ఆ బడా నేతలను ప్రోటోకాలే కలిపిందా?
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!