Pakistan Helicopter Crash: పాక్లో ఘోరం.. వరద సహాయక చర్యల్లో కూలిన హెలికాప్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Helicopter Crash: పాకిస్థాన్ ఉత్తర ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో పాటు, కొండచరియలు విరిగిపడటంతో 164 మంది మరణించారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్న MI-17 హెలికాప్టర్ కూలిపోయి ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు మరణించారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. దేశంలో భారీ వర్షాలు కురుస్తాయని పాకిస్థాన్ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
READ MORE: Off The Record: కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం ఆలస్యం వెనుక మర్మం?
Also Read
- Rohit Sharma: "నన్ను క్షమించు.." మహిళా అభిమానికి 'హిట్ మ్యాన్' స్పెషల్ రిక్వెస్ట్..!
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
- Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
విధ్వంసం సృష్టించిన వరదలు..
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో భారీ వర్షాలు సంభవించి వరదలు విధ్వంసం సృష్టించాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో వరదల సమయంలో శుక్రవారం సహాయ చర్యలలో నిమగ్నమై ఉన్న MI-17 హెలికాప్టర్ కూలిపోయింది. మహ్మద్ జిల్లాలోని పాండియాలి ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రమాదం జరిగిందని సీఎం అలీ అమీన్ గందాపూర్ తెలిపారు. “బజౌర్లోని వర్ష ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామగ్రిని తీసుకెళ్తున్న ప్రాంతీయ ప్రభుత్వానికి చెందిన MI-17 హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా మహ్మద్ జిల్లాలోని పాండియాలి ప్రాంతంలో కూలిపోయింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు సహా ఐదుగురు సిబ్బంది మరణించారు” అని గందాపూర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వానికి చెందిన MI-17 హెలికాప్టర్ పెషావర్ నుంచి బజౌర్కు వెళ్తుండగా, మొహమ్మద్ గిరిజన జిల్లాపై సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదం వాతావరణం వల్లే జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదని పలువురు అధికారులు వెల్లడించారు.
వరదల్లో 164 మంది మృతి..
భారీ వర్షాల కారణంగా ఉత్తర పాక్లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించాయి. గత 24 గంటల్లో ఈ ప్రాంతంలో సుమారుగా 164 మంది మరణించారని అక్కడి అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పర్వత ప్రాంతాలైన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో సుమారు 150 మంది మరణించారని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. పాకిస్థాన్ వాతావరణ శాఖ కూడా వాయువ్య ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీ చేసింది. 2022 లో కూడా భారీ వరదలు సంభవించి పాక్లోని మూడో వంతు ప్రాంతాన్ని ముంచెత్తుతాయి, ఆ సమయంలో 1,700 మంది మృతి చెందారు.
READ MORE: Off The Record: దశాబ్దం తర్వాత ఆ బడా నేతలను ప్రోటోకాలే కలిపిందా?
తాజావార్తలు
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
-
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!