తెలంగాణ సర్కార్ కేంద్రంతో ఘర్షణ కోరుకోవట్లేదా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సర్కార్.. కేంద్రంతో ఘర్షణ కోరుకోవడం లేదా? జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేసిన తర్వాత తలెత్తిన సమస్యను.. ఏ విధంగా అధిగమించనుంది? పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీల వైఖరి ఎలా ఉండబోతుంది?
తెలంగాణ నీటివాటా కోసం పార్లమెంట్లో ఫైట్
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
కృష్ణా.. గోదావరి రివర్బోర్డు మేనేజ్మెంట్ పరిధిని నిర్ధారిస్తూ కేంద్రం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ గెజిట్ పై తెలంగాణ ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది. అక్టోబర్ నుంచి గెజిట్ అమలులోకి వస్తున్నందున.. ఈలోపే న్యాయపోరాటం చేయాలన్న ఆలోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు గులాబీ దళపతి కేసీఆర్. లోకసభ, రాజ్యసభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాట కోసం మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని.. గట్టిగా కొట్లాడాలని ఎంపీలకు సూచించారు.
read also : గెజిట్తో ఇరకాటంలో తెలంగాణ బీజేపీ నేతలు ?
గెజిట్పై కేంద్రంతో ఘర్షణ వైఖరి వద్దనే ఆలోచన!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య కీలంగా మారిన గెజిట్ విషయంలో మాత్రం.. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభించకూడదనే అభిప్రాయం ఎంపీలతో జరిగిన సమావేశంలో వ్యక్తమైందట. సమస్య పరిష్కారానికి అనువైన మార్గాన్ని అన్వేషించాలని.. ఆ దిశగా అడుగులు వేయాలనే ఆలోచన టీఆర్ఎస్లో ఉందట. ప్రతి విషయంలో కేంద్రంతో ఘర్షణకు దిగబోమని సీఎం కేసీఆర్ గతంలోనే అసెంబ్లీలో స్పష్టం చేసారు. అయితే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా కేంద్రం నిర్ణయాలు ఉంటే మాత్రం.. వ్యతిరేకిస్తామని నాడు కుండబద్దలు కొట్టారు. అందుకే ఇప్పుడు ఎంపీల సమావేశంలో ఆయన వెల్లడించిన అంశాలు ఆసక్తిగా మారాయట.
చర్చలు.. సమాలోచనలతోనే పరిష్కరించుకునే యోచన
పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలోనే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను టీఆర్ఎస్ ఎంపీలు కలిసే అవకాశం ఉంది. గెజిట్పై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలను కేంద్రమంత్రి దృష్టికి వారు తీసుకెళ్తారు. ముందు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలన్న వాదనను కేంద్రం ముందు ఉంచే వీలుంది. సాధ్యమైనంత వరకు చర్చలు.. సమాలోచనలతోనే సమస్యలను పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారట.
గతంలోనూ కేంద్రంతో ఘర్షణ వైఖరి లేదు!
మొత్తంగా కేంద్రంతో సఖ్యంగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాలన్నది గులాబీ శిబిరం యోచన. పార్లమెంట్ సమావేశాల్లో ఇదే వైఖరితో టీఆర్ఎస్ ఎంపీలు నడుచుకుంటారని చెబుతున్నారు. గతంలో కూడా వివిధ అంశాలలో కేంద్రంతో తెగేవరకు టీఆర్ఎస్ సర్కార్ లాగలేదు. ఇకపై కూడా అదే వైఖరితో ముందుకెళ్తూ.. పనులు సాధించుకోవాలని ఎంపీలకు స్పష్టం చేశారట కేసీఆర్. కాకపోతే సున్నితమైన జల వివాదాల అంశంలో కర్ర విరగకుండా పాము చావకుండా టీఆర్ఎస్ నడిపే రాజకీయం ఎంత వరకు నెగ్గుకొస్తుందన్నదే ఉత్కంఠ రేపుతోంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!