తెలంగాణ సర్కార్ కేంద్రంతో ఘర్షణ కోరుకోవట్లేదా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సర్కార్.. కేంద్రంతో ఘర్షణ కోరుకోవడం లేదా? జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేసిన తర్వాత తలెత్తిన సమస్యను.. ఏ విధంగా అధిగమించనుంది? పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీల వైఖరి ఎలా ఉండబోతుంది?
తెలంగాణ నీటివాటా కోసం పార్లమెంట్లో ఫైట్
Also Read
- Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
- Off The Record : మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయంగా ఎందుకు యాక్టివ్ అవ్వలేదు ?
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
కృష్ణా.. గోదావరి రివర్బోర్డు మేనేజ్మెంట్ పరిధిని నిర్ధారిస్తూ కేంద్రం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ గెజిట్ పై తెలంగాణ ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది. అక్టోబర్ నుంచి గెజిట్ అమలులోకి వస్తున్నందున.. ఈలోపే న్యాయపోరాటం చేయాలన్న ఆలోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు గులాబీ దళపతి కేసీఆర్. లోకసభ, రాజ్యసభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాట కోసం మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని.. గట్టిగా కొట్లాడాలని ఎంపీలకు సూచించారు.
read also : గెజిట్తో ఇరకాటంలో తెలంగాణ బీజేపీ నేతలు ?
గెజిట్పై కేంద్రంతో ఘర్షణ వైఖరి వద్దనే ఆలోచన!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య కీలంగా మారిన గెజిట్ విషయంలో మాత్రం.. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభించకూడదనే అభిప్రాయం ఎంపీలతో జరిగిన సమావేశంలో వ్యక్తమైందట. సమస్య పరిష్కారానికి అనువైన మార్గాన్ని అన్వేషించాలని.. ఆ దిశగా అడుగులు వేయాలనే ఆలోచన టీఆర్ఎస్లో ఉందట. ప్రతి విషయంలో కేంద్రంతో ఘర్షణకు దిగబోమని సీఎం కేసీఆర్ గతంలోనే అసెంబ్లీలో స్పష్టం చేసారు. అయితే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా కేంద్రం నిర్ణయాలు ఉంటే మాత్రం.. వ్యతిరేకిస్తామని నాడు కుండబద్దలు కొట్టారు. అందుకే ఇప్పుడు ఎంపీల సమావేశంలో ఆయన వెల్లడించిన అంశాలు ఆసక్తిగా మారాయట.
చర్చలు.. సమాలోచనలతోనే పరిష్కరించుకునే యోచన
పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలోనే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను టీఆర్ఎస్ ఎంపీలు కలిసే అవకాశం ఉంది. గెజిట్పై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలను కేంద్రమంత్రి దృష్టికి వారు తీసుకెళ్తారు. ముందు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలన్న వాదనను కేంద్రం ముందు ఉంచే వీలుంది. సాధ్యమైనంత వరకు చర్చలు.. సమాలోచనలతోనే సమస్యలను పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారట.
గతంలోనూ కేంద్రంతో ఘర్షణ వైఖరి లేదు!
మొత్తంగా కేంద్రంతో సఖ్యంగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాలన్నది గులాబీ శిబిరం యోచన. పార్లమెంట్ సమావేశాల్లో ఇదే వైఖరితో టీఆర్ఎస్ ఎంపీలు నడుచుకుంటారని చెబుతున్నారు. గతంలో కూడా వివిధ అంశాలలో కేంద్రంతో తెగేవరకు టీఆర్ఎస్ సర్కార్ లాగలేదు. ఇకపై కూడా అదే వైఖరితో ముందుకెళ్తూ.. పనులు సాధించుకోవాలని ఎంపీలకు స్పష్టం చేశారట కేసీఆర్. కాకపోతే సున్నితమైన జల వివాదాల అంశంలో కర్ర విరగకుండా పాము చావకుండా టీఆర్ఎస్ నడిపే రాజకీయం ఎంత వరకు నెగ్గుకొస్తుందన్నదే ఉత్కంఠ రేపుతోంది.
తాజావార్తలు
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
-
Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ” వెనుక మాస్టర్మైండ్!
-
KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
-
Xiaomi 17T Pro, 17T: షియోమీ 17T ప్రో, 17T రిలీజ్ డేట్ ఫిక్స్!.. 7000mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!