TRS :మక్తల్ టీఆర్ఎస్ లో ఇంటిపోరు..టికెట్ కోసం దూకుడు పెంచిన చిట్టెం భార్య |
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2018లో అధికారపార్టీ టికెట్పైనే పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి చిట్టెం రామ్మోహన్రెడ్డి పోటీ చేస్తారా లేక కొత్త వారు బరిలో ఉంటారా? అనే ప్రశ్న చుట్టూనే మక్తల్ గులాబీ శిబిరంలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రామ్మోహన్రెడ్డి భార్య సుచరితారెడ్డి పేరు రేస్లోకి రావడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికలకు ముందు కూడా సుచరిత ప్రగతి భవన్కు వెళ్లి టికెట్ అడిగినట్టుగా ప్రచారం జరిగింది.
భర్త రామ్మోహన్రెడ్డితో కలిసి సుచరిత కూడా పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కంటే ఆమె మాటే పవర్ఫుల్ అని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటాయి. ప్రభుత్వ యంత్రాంగం.. టీఆర్ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వం సైతం మేడమ్తోనే టచ్లో ఉంటాయట. సుచరిత చొరవ చూశాక.. వచ్చే ఎన్నికల్లో ఆమె బరిలో ఉంటారేమోనని కేడర్ భావిస్తోందట. ఇదే సమయంలో మక్తల్ రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు నియోజకవర్గానికి చెందిన మరికొందరు టీఆర్ఎస్ నేతలు పావులు కదుపుతున్నారు. చిట్టెం కుటుంబానికి టికెట్ నిరాకరిస్తే.. తన్నుకుపోవాలని చూస్తున్నారట నాయకులు. ఈక్వేషన్ మారితే అదృష్టం తలుపు తట్టక మానదు అనేట్టుగా ఆశావహులు ఎదురు చూపులు ఉన్నాయి.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
డీసీసీబీ ఛైర్మన్ నిజాంపాషా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఇస్తారని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారట. పార్టీ పెద్దలతోపాటు జిల్లా పార్టీ నాయకులతో ఎప్పటికిప్పుడు మంచిచెడ్డల గురించి మాట్లాడుతున్నారట. ఇక సేవా కార్యక్రమాల ద్వారా మరో నాయకుడు కూడా రేస్లో ఉన్నానని అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. టీఆర్ఎస్లో తమకు పరిచయం ఉన్న పార్టీ పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారట.
మక్తల్లో టీఆర్ఎస్ శిబిరంలో బీజేపీ గుబులు పట్టుకుందట. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు బాగానే వచ్చాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ మున్సిపాలిటీని కైవశం చేసుకుంది. గతంలో టీఆర్ఎస్ రెబల్గా బరిలో దిగిన జలందర్రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడంతో సమీకరణాలు మారుతున్నాయి. ఇది చిట్టెం క్యాంప్ను కలవరపెడుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా పుంజుకోవడానికి చూస్తోంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న దయాకర్రెడ్డి కాంగ్రెస్లో చేరతారని అనుకుంటున్నారట. దీంతో టీఆర్ఎస్లో ఇంటిపోరు.. సత్తా చాటేందుకు చూస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ దూకుడు వచ్చే ఎన్నికల్లో మక్తల్ పోరును రసవత్తరంగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి.. పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి ఏం చేస్తారో? పార్టీ దిశానిర్దేశాలేంటో చూడాలి.
తాజావార్తలు
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!