Off The record: తెలంగాణ కాంగ్రెస్ ని ఇరకాటంలో పడేస్తున్న ఓట్ చోరీ ఆరోపణలు
- తెలంగాణలో ఓట్ చోరీ రాజకీయ రచ్చ..
- మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలిచారంటూ బీజేపీ రివర్స్ అటాక్..
- అసెంబ్లీకి, లోక్సభకు మధ్య పెద్దగా లిస్ట్లో మార్పులు లేవన్న బీజేపీ..
- అధికారం ఉన్న తెలంగాణలో అడ్డగోలు మాటలు కుదరవంటున్న బీజేపీ..
- దొంగ ఓట్లతోనే బీజేపీ 8ఎంపీ సీట్లు గెలిచిందన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్..
- అసెంబ్లీ ఎన్నికల్లో మీరూ అదే పని చేశారా అని బీజేపీ ప్రశ్న..
- కాంగ్రెస్ గెలిచిన ఓటర్ లిస్ట్తోనే లోక్సభ ఎన్నికలని వివరణ..
- మీ ఎమ్మెల్యేలంతా ఏం చేస్తున్నారని క్వశ్చన్..
- దొంగ ఓట్లు తీసేసి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమా అని సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The record: కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ ఆందోళన తెలంగాణలో తేడా కొడుతోందా? ఆ పార్టీ డిఫెన్స్లో పడే పరిస్థితి వస్తోందా? బీజేపీ రివర్స్ అటాక్ మొదలు పెట్టిందా? అందుకు సమాధానం చెప్పుకోవడం ఇక్కడి అధికార పార్టీ నేతలకు ఇబ్బందిగా మారిందా? ఇంతకీ ఏ రూపంలో రివర్స్ అటాకింగ్ మొదలు పెట్టింది కాషాయ దళం? హస్తం ఎలా ఉక్కిరి బిక్కిరి అవుతోంది?..
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ ఆందోళనతో ఓ రేంజ్లో జనంలోకి వెళ్ళే ప్లాన్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న బీహార్లో బైక్ ర్యాలీలు, ఇతర ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. మిగతా చోట్ల ఎలా ఉన్నా… తెలంగాణలో మాత్రం ఈ విషయంలో రచ్చ అయ్యేట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇక్కడ హస్తం మీదికి బాణాలు ఎక్కుపెడుతోంది కమలం.
Read Also: Manoj Tiwary: ఎంఎస్ ధోనీకి నేను నచ్చను.. తన కాంపౌండ్ ఆటగాళ్లకే ఛాన్సులు!
లోక్సభ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగి ఉంటే… అంతకు ఆరు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరెలా గెలిచారు? మీకు అధికారం ఎలా వచ్చింది? ఆ ఆరునెలల వ్యవధిలో స్వల్ప మార్పులే తప్ప ఓటర్స్ లిస్ట్లో భారీ మార్పులేవీ జరగలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు కమలం నాయకులు. దొంగ ఓట్లను తొలగించి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకి సిద్ధమా అని కూడా సవాల్ చేస్తున్నారు. దీంతో… తెలంగాణ వరకు ఒక రకంగా కాంగ్రెస్ డిఫెన్స్లో పడ్డట్టే కనిపిస్తోందని అంటున్నారు. ఈ వ్యవహారంలో ఆ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఏం మాట్లాడినా… నడుస్తుందేమోగానీ… ఇక్కడ, అధికారంలో ఉన్న రాష్ట్రంలో అలా నడవకపోవచ్చన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. ఆచితూచి మాట్లాడకుంటే ఎదురు దెబ్బలు తగులుతాయన్న సలహాలు సైతం వినిపిస్తున్నాయి. అయితే…పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓట్ చోరీ తుట్టెను కదిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ కి పాల్పడిందని… దొంగ ఓట్లతోనే 8 ఎంపీ సీట్లు గెలిచిందని ఆరోపించారాయన. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలకు బీజేపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సంగతి ఏంటని, రాష్ట్రంలో దొంగ ఓట్లతోనే గెలిచారా అని ప్రశ్నిస్తోంది.
Read Also: STOCK MARKET : భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ఇక, కాంగ్రెస్ కూడా 8 ఎంపీ సీట్లు గెలిచింది కదా.. మరి ఆ సంగతేంటని అడుగుతున్నారు కాషాయ నేతలు. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే కదా.. అధికార యంత్రాంగం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందికదా…. మరి బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడితే మీరెందుకు మౌనంగా ఉన్నారని గట్టిగా అడుగుతున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. 64 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ కి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 6 నెలల లోపే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఉన్న ఓటర్ జాబితా తోనే లోక్సభ ఎన్నికలు జరిగాయని చెబుతున్నారు బీజేపీ లీడర్స్. ఒక వేళ ఓటర్ జాబితా ఫేక్ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న 64 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారన్నది బీజేపీ క్వశ్చన్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పోలింగ్ ఏజెంట్స్ లేరా, వాళ్ళంతా బూత్ల దగ్గర ఏం చేశారంటూ నిలదీస్తోంది బీజేపీ. నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించినట్టు దొంగ ఓట్లు ఉంటే… వాటిని తొలగించి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకి వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమా అని సవాల్ చేస్తున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ చీఫ్ తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడారని అంటోంది బీజేపీ. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఓటర్ లిస్ట్ కుస్తీలు మొదలైనట్టయింది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!