Sri Chaitanya School Ragging: శ్రీచైతన్య స్కూల్లో ర్యాగింగ్.. ఐరన్ బాక్స్తో పొట్ట, చేతులపై విచక్షణారహితంగా వాతలు!
- కార్పోరేట్ స్కూలులోనే ర్యాగింగ్
- రాజమండ్రిలోని శ్రీచైతన్య స్కూలులో ర్యాగింగ్
- ఇద్దరు స్టూడెంట్స్ స్కూల్ హాస్టల్లో వెకిలి పనులు
- ప్రిన్సిపాల్ సారుకు పేర్లు చెప్పాడని చితకబాదారు
కాలేజీల్లో ర్యాగింగ్ భూతం ఎంత దారుణంగా ఉంటుందో మనం చూశాం. ఐతే ప్రభుత్వాలు ర్యాగింగ్ మీద దృష్టి పెట్టడంతో దాదాపు ఇప్పుడు కంట్రోల్లోనే ఉంది. కానీ విచిత్రంగా ఓ కార్పోరేట్ స్కూలులోనే ర్యాగింగ్ మళ్లీ చిగురించడం కలకలం రేపుతోంది. నిజానికి స్కూల్లో ర్యాగింగ్ చాలా తక్కువ. కానీ రాజమండ్రిలోని శ్రీచైతన్య స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దారుణంగా హింసించారు. ఈ ఘటనతో విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్క పడ్డారు.
ఇక్కడ చూడండి.. బెడ్పై దీనంగా పడుకుని ఉన్న ఈ బాలుడి పేరు గుర్రం విన్సెంట్ ప్రసాద్. కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం స్వస్థలం. ఈ బాలుడ్ని మంచిగా చదివించేందుకు తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం రాజమండ్రిలోని శ్రీచైతన్య స్కూలులోని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పిల్లాడు మాత్రం.. హస్టల్లో జరిగిన ర్యాగింగ్ భూతం కారణంగా ఇలా రాజోలులోని ఆస్పత్రి బెడ్పై చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
విన్సెంట్ ప్రసాద్.. ఇప్పుడు పదో తరగతి చదువుతున్నాడు. అందరు విద్యార్థులతో బాగానే ఉంటాడు. కానీ అందులో ఇద్దరు స్టూడెంట్స్ స్కూల్ హాస్టల్లో వెకిలి పనులు చేస్తున్నారు. హాస్టల్లో ఉన్న సీసీ కెమెరాను తీసేశారు. దీనిపై ప్రిన్సిపాల్ అందరినీ నిలదీశారు. ఆ సమయంలో విన్సెంట్ ప్రసాద్.. సీసీ కెమెరా తొలగించిన విద్యార్థుల పేర్లు చెప్పాడు. దీంతో కక్ష కట్టిన ఆ ఇద్దరు స్టూడెంట్స్… పైశాచికంగా ప్రవర్తించారు. తమ మీదే ప్రిన్సిపల్కు చెబుతావా అంటూ ఐరన్ బాక్స్తో పొట్ట, చేతులపై విచక్షణారహితంగా వాతలు పెట్టారు. దీంతో విన్సెంట్ ప్రసాద్కు తీవ్ర గాయాలయ్యాయి.
ఆ కాలిన గాయాలను విన్సెంట్ ప్రసాద్ ఓర్చుకున్నాడు. తనను మళ్లీ ఏదైనా చేస్తారేమోనన్న భయంతో ఎవరికీ చెప్పలేదు. చివరకు మెల్లగా తల్లిదండ్రులకు విషయం తెలిసింది. దీంతో అతన్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం విన్సెంట్ ప్రసాద్ కోలుకుంటున్నాడని పేరెంట్స్ చెప్పారు. ఐతే లక్షల రూపాయలు ఖర్చు చేసి చదివిస్తుంటే.. శ్రీచైతన్య యాజమాన్యం ఏ మాత్రం పిల్లల బాగోగులు పట్టించుకోవడం లేదని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?