TDP :ఆ పార్టీలో ఎవరు సిఫార్సు చేసిన అధిష్టానం తలాడిస్తుందా.? ఇంతకీ ఏంటా పార్టీ.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గం ఒకటి. ఇక్కడ రెండుసార్లు వైసీపీ జెండా రెపరెపలాంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలన్నది కేడర్ ఆలోచనగా ఉంటే.. నాయకుల వర్గపోరు ప్రమాద సంకేతాలు ఇస్తోందట. కురుపాం నియోజకవర్గ ఇంఛార్జ్గా తోయక జగదీశ్వరిని నియమించినప్పటి నుంచీ పరిస్థితి మారిపోయిందనేది తమ్ముళ్ల మాట. ఇంఛార్జ్ నియామకాన్ని లోకల్ పార్టీ నేతలు లక్ష్మణరావు, సత్యనారాయణ వ్యతిరేకిస్తున్నారు. కలిసి పనిచేయడానికి అస్సలు ముందుకు రావడం లేదట.
ఇంఛార్జ్ జగదీశ్వరికి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అండదండలు ఉండడంతో ఇన్నాళ్లూ అసమ్మతి బయట పడలేదు. అలా అని కలిసి సాగే పరిస్థితి లేదు. ఇటీవల అసమ్మతి వర్గం వేరేగా కార్యక్రమాలు చేపట్టడం చర్చగా మారింది. ప్రస్తుతం కురుపాంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. మినీ మహానాడు, బాదుడే బాదుడు కార్యక్రమాల్లోనూ ఎవరి కుంపటి వాళ్లదే. మినీ మహానాడును వేర్వేరుగా చేపట్టడం వర్గపోరు తీవ్రతను తెలియజేస్తోంది. పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతున్నా.. శత్రుచర్ల కానీ.. కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్కానీ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదట.
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
కురుపాం వైసీపీ ఎమ్మెల్యేగా మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఉన్నారు. ఆమెను వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే టీడీపీ ఐక్యంగా కదలాలన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. ఆ విషయం తెలిసినా.. శత్రుచర్ల.. కిశోర్ చంద్రదేవ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నదే టీడీపీ కేడర్ ప్రశ్న. ఇంఛార్జ్కు మద్దతు ప్రకటించిన శత్రుచర్ల అంతరంగం అర్థం కావడం లేదట. టీడీపీలోని వైరివర్గం మాత్రం ఇంఛార్జ్ను తప్పించేలా ఎత్తుగడలు వేస్తోందట. కురుపాంలో తమ పట్టు పోకుండా కార్యక్రమాలు చేపడుతున్నారట.
టీడీపీ మహానాడు తర్వాత పార్టీ కేడర్ ఉత్సాహంగా కనిపిస్తున్నా.. కురుపాంలో తెలుగుదేశం పరిస్థితి రివర్స్లో ఉందన్నది స్థానికంగా వినిపిస్తున్న వాదన. ఇక్కడి విషయాలను ఎప్పటికప్పుడు టీడీపీ అధిష్ఠానం తెలుసుకుంటున్నా.. అమరావతి నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో పార్టీ శ్రేణులు విస్తుపోతున్నాయట. మరి.. కురుపాం టీడీపీలో గ్రూపుల గోలకు ఎలా చెక్ పెడతారో చూడాలి.
తాజావార్తలు
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
-
Pakistan Minister: “చేతులు నరికేస్తాం”.. సింధు జలాల విషయంలో భారత్కు పాక్ మంత్రి వార్నింగ్!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!