TDP :ఆ పార్టీలో ఎవరు సిఫార్సు చేసిన అధిష్టానం తలాడిస్తుందా.? ఇంతకీ ఏంటా పార్టీ.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గం ఒకటి. ఇక్కడ రెండుసార్లు వైసీపీ జెండా రెపరెపలాంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలన్నది కేడర్ ఆలోచనగా ఉంటే.. నాయకుల వర్గపోరు ప్రమాద సంకేతాలు ఇస్తోందట. కురుపాం నియోజకవర్గ ఇంఛార్జ్గా తోయక జగదీశ్వరిని నియమించినప్పటి నుంచీ పరిస్థితి మారిపోయిందనేది తమ్ముళ్ల మాట. ఇంఛార్జ్ నియామకాన్ని లోకల్ పార్టీ నేతలు లక్ష్మణరావు, సత్యనారాయణ వ్యతిరేకిస్తున్నారు. కలిసి పనిచేయడానికి అస్సలు ముందుకు రావడం లేదట.
ఇంఛార్జ్ జగదీశ్వరికి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అండదండలు ఉండడంతో ఇన్నాళ్లూ అసమ్మతి బయట పడలేదు. అలా అని కలిసి సాగే పరిస్థితి లేదు. ఇటీవల అసమ్మతి వర్గం వేరేగా కార్యక్రమాలు చేపట్టడం చర్చగా మారింది. ప్రస్తుతం కురుపాంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. మినీ మహానాడు, బాదుడే బాదుడు కార్యక్రమాల్లోనూ ఎవరి కుంపటి వాళ్లదే. మినీ మహానాడును వేర్వేరుగా చేపట్టడం వర్గపోరు తీవ్రతను తెలియజేస్తోంది. పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతున్నా.. శత్రుచర్ల కానీ.. కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్కానీ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదట.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
కురుపాం వైసీపీ ఎమ్మెల్యేగా మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఉన్నారు. ఆమెను వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే టీడీపీ ఐక్యంగా కదలాలన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. ఆ విషయం తెలిసినా.. శత్రుచర్ల.. కిశోర్ చంద్రదేవ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నదే టీడీపీ కేడర్ ప్రశ్న. ఇంఛార్జ్కు మద్దతు ప్రకటించిన శత్రుచర్ల అంతరంగం అర్థం కావడం లేదట. టీడీపీలోని వైరివర్గం మాత్రం ఇంఛార్జ్ను తప్పించేలా ఎత్తుగడలు వేస్తోందట. కురుపాంలో తమ పట్టు పోకుండా కార్యక్రమాలు చేపడుతున్నారట.
టీడీపీ మహానాడు తర్వాత పార్టీ కేడర్ ఉత్సాహంగా కనిపిస్తున్నా.. కురుపాంలో తెలుగుదేశం పరిస్థితి రివర్స్లో ఉందన్నది స్థానికంగా వినిపిస్తున్న వాదన. ఇక్కడి విషయాలను ఎప్పటికప్పుడు టీడీపీ అధిష్ఠానం తెలుసుకుంటున్నా.. అమరావతి నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో పార్టీ శ్రేణులు విస్తుపోతున్నాయట. మరి.. కురుపాం టీడీపీలో గ్రూపుల గోలకు ఎలా చెక్ పెడతారో చూడాలి.
తాజావార్తలు
-
NBK 111 : షూటింగ్ లో బాలయ్య కు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
-
Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్షీట్తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
CJP Protest: “4 గంటల సమయం దండగ”.. జేపీ నడ్డాతో భేటీపై సీజేపీ నేతల తీవ్ర ఆగ్రహం!
-
Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!