తాండూరు టీఆర్ఎస్లో ఆగని తన్నులాటలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాండూరు టీఆర్ఎస్లో తన్నులాటలకు ఫుల్స్టాప్ పడదా..? తెగేవరకు లాగడమే అక్కడి నేతల లక్ష్యమా..? గతంలో జరిగిందేంటి..? ఇప్పుడూ అలాగే జరగాలేమోనని కేడర్ ఎందుకు అనుకుంటోంది? నేతలను నియంత్రించడం సాధ్యం కావడం లేదా?
తాండూరు టీఆర్ఎస్లో తగ్గేదే లే..!
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ టీఆర్ఎస్ వర్గపోరు..రోజుకో రకంగా రచ్చ లేపుతోంది. సద్దుమణిగింది అనుకుంటున్న సమస్య.. మళ్లీ మొదటికి వస్తున్న పరిస్థితి. ఆధిప్యతపోరులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి తగ్గేదే లే అంటున్నారు.
ఓ రేంజ్లో గొడవలు..!
పట్నం మహేందర్రెడ్డి గతంలో ఇక్కడ ఎమ్మెల్యే. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రి. 2018 ఎన్నికల్లో పట్నం ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి గెలిచిన పైలెట్ రోహిత్రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చేశారు. అప్పటి నుంచి తాండూరు టీఆర్ఎస్లో గొడవలు ఓ రేంజ్లో నడుస్తున్నాయి. పట్నం మహేందర్రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగాఉన్నారు. తాజా ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా గెలిచారు కూడా.
అప్పట్లో కొండా విశ్వేశ్వర్రెడ్డి వర్సెస్ పట్నం..!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్లో వర్గపోరు అలజడి కొత్త కాదు. అప్పట్లో చేవెళ్ల ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్రెడ్డికి.. మంత్రిగా ఉన్న పట్నం మహేందర్రెడ్డికి అస్సలు పడేది కాదు. తీవ్రస్థాయిలో కోల్డ్వార్ నడిచేది. సందర్భాన్ని బట్టి టీఆర్ఎస్ సర్దుబాటు చేసినా గొడవలు ముదురు పాకాన పడ్డాయే తప్ప తగ్గలేదు. చివరకు ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి టీఆర్ఎస్ను వీడి వెళ్లిపోవడంతో ఆ ఎపిసోడ్కు తెరపడింది. ఇప్పుడు పైలెట్ రోహిత్రెడ్డి వర్సెస్ పట్నం మహేందర్రెడ్డి మొదలైంది.
తీరు మార్చుకోవాలని చెప్పినా మార్పు లేదా..?
పట్నం.. పైలెట్లకు ఎప్పటికప్పుడు సర్ది చెబుతున్నా.. ఇద్దరూ కొద్దిరోజులే సైలెంట్గా ఉంటున్నారు. అవకాశం చిక్కితే కుస్తీ పడుతున్నారు. తాజా గొడవ ఆ కోవలోకే వస్తుంది. రచ్చ రచ్చ అవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు పట్నం. కానీ.. ఆయన్ని రెండోసారి ఎమ్మెల్సీని చేసింది పార్టీ. తీరు మార్చుకోవాలని ఇద్దరికీ పార్టీ నచ్చజెబుతున్నా.. వారి వైఖరిలో మార్పు లేదు. టీఆర్ఎస్ పెద్దలు ఇద్దరికీ సయోధ్య చేస్తారా? లేక గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎవరో ఒకరు బయటకి పోతేనే పరిస్థితిలో మార్పు వస్తుందా? అని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయట. మరి.. తాండూరు టీఆర్ఎస్లో రాజకీయ సెగలు ఎప్పుడు చల్లారతాయో చూడాలి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!