Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Story On Ramesh Rathod

అప్పట్లో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌.. ఆపై కాంగ్రెస్‌లోకి జంప్‌!

Published Date :June 23, 2021 , 12:18 pm
By Lakshmi Narayana
అప్పట్లో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌.. ఆపై కాంగ్రెస్‌లోకి జంప్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఇప్పుడు పార్టీలను పట్టుకొని తిరుగుతున్నారు. పొలిటికల్‌ ఫ్లాట్‌ఫాం కోసం కండువాలు మార్చేస్తున్నారు. అయినప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. పైగా ఏ పార్టీలో చేరినా గ్రూప్‌వార్‌ ఆయన్ని వెంటాడుతోంది. ఇంతకీ ఎవరా జంప్‌ జిలానీ?

గ్రూప్‌వార్‌ కారణంగా టీఆర్‌ఎస్‌లో టికెట్‌ రాలేదా?

రమేష్‌ రాథోడ్‌. మాజీ ఎంపీ. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు. 2014లో టీడీపీ ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు. తర్వాత టీడీపీ బలహీన పడటంతో సైకిల్‌ దిగి కారెక్కేశారు రమేష్‌. వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లడం ఆయనకు అలవాటు. ఖానాపూర్, ఆసిఫాబాద్‌ అసెంబ్లీ లేదా ఆదిలాబాద్‌ లోక్‌సభ టికెట్‌ ఇస్తారని ఆశించారు. కానీ..స్థానికంగా గులాబీపార్టీలో ఉన్న గ్రూప్‌వార్‌ కారణంగా టికెట్‌ రాలేదు.

రమేష్‌ పేరు చెబితే ఆదివాసీలు గరంగరం!

2018 ఎన్నికలకు వచ్చేసరికి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు రమేష్‌ రాథోడ్‌. ఖానాపూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫాం తెచ్చుకుని పోటీ చేశారు కూడా. కానీ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ చేతిలో ఓడిపోయారు. ఆ సమయంలో ఆదివాసీలు, లంబాడాలాకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది. రమేష్‌ రాథోడ్‌ వల్లే ఆదివాసీలకు నష్టం జరిగిందనే వాదన తెరపైకి వచ్చింది. తుడుందెబ్బ నాయకుడిగా ఉన్న సట్ల అశోక్‌ బీజేపీ నుంచి పోటీ చేయడంతో 24 వేల ఓట్లు వచ్చాయి. ఆ విధంగా ఓట్లు చీలి అధికారపార్టీకి కలిసొచ్చింది. తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు రమేష్ రాథోడ్‌. మళ్లీ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్‌ బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు.

read also : పీసీసీ చీఫ్ పేరు ప్రకటిస్తే.. టీ కాంగ్రెస్‌లో ప్రకంపనలేనా?

ఈటలతో కలిసి బీజేపీలో చేరిన రమేష్‌ రాథోడ్‌

ఈ విధంగా రమేష్‌ రాథోడ్‌ ఏ పార్టీలో అడుగుపెట్టినా.. అక్కడ గ్రూప్‌ పాలిటిక్స్‌ తారాస్థాయికి చేరుకుంటాయనే ముద్ర పడిపోయింది. టీఆర్‌ఎస్‌లో రేఖానాయక్‌, కాంగ్రెస్‌లో భరత్‌ చౌహాన్‌ ఇలా చాలా మంది రమేష్‌కు వ్యతిరేకంగా గ్రూపు కట్టారు. దీంతో రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీ కండువా కప్పేసుకున్నారు రమేష్‌. ఆయనైతే ఉత్సాహంగా కాషాయ కండువా కప్పుకొన్నారు కానీ.. స్థానికంగా బీజేపీలో ఉన్నవారికి ఆయన రాక రుచించడం లేదట.

ఆదివాసీల స్పందనపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!

రమేష్‌ భార్య సుమన్‌ ఎస్టీకాదు.. బీసీ అని కోర్టు తేల్చినప్పటి నుంచి ఆదివాసీలతో ఆయనకు గ్యాప్‌ వచ్చినట్టు చెబుతున్నారు. మహారాష్ట్రలో బీసీలుగా ఉన్న లంబాడాలు ఇక్కడికొచ్చి ఎస్టీలుగా చెలామణి అవుతున్నారని.. తమ హక్కులు, అవకాశాలు కొల్లగొడుతున్నారని లోకల్‌ ఆదివాసీల ఆవేదన. బయటి నుంచి వచ్చే వారికి రమేష్‌ వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలతో ఆదివాసీలు ఐక్య ఉద్యమం చేపట్టారనే టాక్‌ ఉంది. ఒకానొక సమయంలో ఈ ఉద్యమం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు రమేష్‌ బీజేపీలో చేరడం.. సోయం బాపూరావ్‌ బీజేపీ ఎంపీగా ఉండటంతో.. ఆదివాసీల స్పందన ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది.

రమేష్‌ వ్యతిరేకవర్గం అవకాశం కోసం ఎదురు చూస్తోందా?

ఎస్టీ రిజర్వ్‌ నియోజకవర్గాల్లో ఆదివాసీలకే టికెట్లు ఇవ్వాలనే డిమాండ్‌ మెల్లగా తెరపైకి తెస్తున్నారు. పైగా రమేష్‌ వ్యతిరేకవర్గం అవకాశం కోసం వేచిచూస్తున్నట్టు టాక్‌. ఖానాపూర్‌ టికెట్‌ తనకే అని రమేష్ చెప్పుకొంటున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇది లోకల్‌ బీజేపీ కేడర్‌కు రుచించడం లేదట. అది ఏ విధంగా బరస్ట్‌ అవుతుందో చెప్పలేమన్నది కొందరు పార్టీ నేతల వాదన. మొత్తానికి రమేష్‌ ఎక్కడ కాలు పెడితే అక్కడ గ్రూప్‌వార్‌ కామన్‌ అనే ప్రచారం పొలిటికల్‌ సర్కిల్స్‌లో వైరల్‌ అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • adhilabad
  • bjp
  • congress
  • off the record
  • Ramesh rathod

తాజావార్తలు

  • Jasprit Bumrah: ‘యార్కర్ కింగ్’ బుమ్రా సక్సెస్ వెనుక ఉన్న గురువు ఇతనే!

  • Social Media Ban : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి సోషల్ మీడియా బ్యాన్

  • T20 WC 2026 Final: భారత్ నుంచి ఏకైక ఆటగాడిగా సంజూ రికార్డ్! ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌కు నామినేట్..

  • UPSC CSE 2025 Final Result: UPSC ఫలితాలు విడుదల.. అనుజ్ అగ్రిహోత్రికి ఫస్ట్ ర్యాంక్..

  • RK Roja: రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి.. రోజా ఫైర్‌

ట్రెండింగ్‌

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions