మేడ్చల్లోని రేవంత్ వర్గాల మధ్య ఆధిపత్యపోరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పీసీసీకి కొత్త నాయకత్వం వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నాయి శ్రేణులు. కానీ.. ఆ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఇంఛార్జ్ పదవిపై ఉన్న శ్రద్ధ పార్టీపై లేదు. కిందస్థాయి ప్రజాప్రతినిధులు చేజారిపోతున్నా పట్టించుకోవడం లేదట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? పార్టీ పెద్దలు ఎందుకు పట్టించుకోవడం లేదు?
మేడ్చల్ కాంగ్రెస్లో గ్రూపులదే రాజ్యం!
Also Read
- Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
- OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
- Off The Record: ముద్రగడ సంస్మరణ సభకు టీడీపీ నేతలు వెళ్తారా..? తెలుగు తమ్ముళ్లలో కొత్త టెన్షన్
- OTR : తెలంగాణ కాంగ్రెస్ కోర్ కమిటీకి ఢిల్లీ పిలుపు..రేవంత్ టీమ్లో హైటెన్షన్ ఎందుకు?
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేడ్చల్ జిల్లా కాంగ్రెస్లో గ్రూపులు ఎక్కువయ్యాయి. ఏ ఎన్నిక జరిగిన తమ వారికి టిక్కెట్ ఇవ్వాలని అధిష్ఠానం మీద ఒత్తిడి తేవడం.. టిక్కెట్ రాని వారు వచ్చిన వారికి సహకరించకపోవడం పరిపాటిగా మారింది. పీసీసీ అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగినంత కాలం మేడ్చల్లో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని నియమించడంతో.. నిరసనగా కేఎల్ఆర్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఉన్న కొద్దిమంది పార్టీ నేతల మధ్య గ్రూపులు పెరిగిపోయాయి.
read also : టీఆర్ఎస్ ఎంపీ సురేష్రెడ్డి ఏమయ్యారు?
మేడ్చల్లో కాంగ్రెస్ను లీడ్ చేసేది ఎవరో?
ప్రస్తుతం మేడ్చల్ జిల్లాకు నందికంటి శ్రీధర్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి తోటకూర జంగయ్య యాదవ్, సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డిలు ఉన్నారు. నియోజకవర్గంలో మూడు గ్రూపులు కొనసాగుతున్నాయి. అయితే స్థానికంగా పార్టీని ఎవరు లీడ్ చేస్తారో.. ఎవరి దగ్గరకు వెళ్లలో తెలియక గందరగోళంలో ఉంది కేడర్.
కాంగ్రెస్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు టీఆర్ఎస్ గాలం!
మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్నగర్ కార్పొరేషన్ ఏర్పడి ఏడాదిన్నర గడిచింది. కార్పొరేషన్ ఎన్నికల్లో కేఎల్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ నుంచి నలుగురు కార్పొరేటర్లు గెలిచారు. ఇప్పుడు అదే KLR రాజీనామా చేయడంతో కార్పొరేటర్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇదే అదనుగా భావించిన అధికార పార్టీ నేతలు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులను మచ్చిక చేసుకునే పనిలో బిజీ అయ్యారు. పిలిచి కండువా కప్పేస్తున్నారు. రేవంత్ అనుచరులుగా చెప్పుకొంటున్న నాయకులు గ్రూపులు కట్టడంతో.. అధికారపార్టీ కాంగ్రెస్ కేడర్ను కారెక్కించే పనిలో పడింది.
మేడ్చల్లో కాంగ్రెస్ను ఖాళీ చేసే పనిలో టీఆర్ఎస్ నేతలు!
ఈ ప్రాంతానికి చెందిన మంత్రి మల్లారెడ్డి పక్కాప్రణాళిక ప్రకారం వర్కవుట్ చేస్తున్నారు. ఒక్క జవహర్ నగర్ కార్పొరేషన్లోనే కాకుండా సమీపంలోని ఘట్కేసర్ మున్సిపాలిటీలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కూడా పిలిచి టీఆర్ఎస్ కండువా కప్పేస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో కొత్త పీసీసీ సారథి యాత్రలు చేస్తుంటే.. మేడ్చల్ల్లో మాత్రం అధికారపార్టీ చల్లగా పనికానిచ్చేస్తోంది. కాంగ్రెస్ను ఖాళీ చేయిస్తోంది. కళ్లముందే కేడర్ జారిపోతుంటే పట్టించుకునే వారు కరువయ్యారు. నేతలకు పదవులపై ఉన్న ఆశ.. కేడర్ను కాపాడుకోవడంలో లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
-
Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
-
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
-
Sonu Sood: విద్యార్థుల నిరసనపై కంగనా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. సోనూ సూద్ ఘాటు స్పందన
-
Chanakya Niti: బంధువులైనా సరే.. ఈ విషయాలు మాత్రం చెప్పొద్దంటున్న చాణక్యుడు! ఇంతకీ ఏ విషయాలో తెలుసా?
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!