Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Special Focus On Prakasam District Tdp Leaders Delhi Tour

ఢిల్లీ టూర్‌ను గోప్యంగా ఉంచిన ప్రకాశంజిల్లా టీడీపీ నేతలు…!

Published Date :September 2, 2021 , 5:57 pm
By Manohar
ఢిల్లీ టూర్‌ను గోప్యంగా ఉంచిన ప్రకాశంజిల్లా టీడీపీ నేతలు…!
  • Follow Us :
  • google news
  • dailyhunt

వెలిగొండ ప్రాజెక్టును కేంద్ర గెజిట్‌లో చేర్చాలన్నది ప్రకాశం టీడీపీ నేతల డిమాండ్‌. ఇదే అంశంపై రెండు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో సడెన్‌గా ఢిల్లీ వెళ్లారు. కాకపోతే హస్తిన పర్యటనను రహస్యంగా ఉంచడమే చర్చగా మారింది. ఎందుకు గోప్యత పాటించారు? ప్రకాశం టీడీపీ నేతలకు వచ్చిన ఇబ్బందేంటి?

ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి షెకావత్‌ను కలిసిన ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు!

ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టుపై ఆ జిల్లా టీడీపీ నేతలు కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను కేంద్రం గెజిట్‌లో చేర్చాలన్నది వారి డిమాండ్‌. ఇటీవల కేంద్రం వెల్లడించిన గెజిట్‌లో వెలిగొండను అనుమతి ఉన్న ప్రాజెక్టుగా గుర్తించలేదు. దీంతో ఆందోళన చేపట్టారు టీడీపీ నేతలు. తీవ్ర కరువు పీడిత ప్రాంతంగా మారుతున్న ప్రకాశం జిల్లాకు వెలిగొండ ప్రాజెక్టు ఆశాదీపమని చెబుతూ.. జరిగిన తప్పును సరిదిద్దాలని కోరుతూ KRMBతోపాటు తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్‌, కేసీఆర్‌లకు, కేంద్ర జలశక్తి మంత్రికి లేఖలు రాశారు. ఇదే అంశంపై ఢిల్లీ వెళ్లారు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు. స్వయంగా జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. టీడీపీ నేతల ఢిల్లీ టూర్‌పైనే ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

హడావిడి లేకుండా సాగిపోయిన టీడీపీ ఢిల్లీ టూర్‌!

ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు వెలిగొండపై మొదటి నుంచి వేగంగానే పావులు కదుపుతున్నారు. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. కాకపోతే వెలిగొండ విషయంలో ప్రకాశం జిల్లా టీడీపీ నేతల ఢిల్లీ టూర్‌ చాలా సైలెంట్‌గా జరిగిపోయింది. మీడియాకు గానీ.. టీడీపీలోని ఇతర నాయకులకుగానీ ఎక్కడా సమాచారం ఇవ్వలేదు.

ముందుగా లీకైతే అవాంతరాలు వస్తాయని భయపడ్డారా?

సాధారణంగా ఇలాంటి పర్యటనలు ఉన్నప్పుడు ముందుగా మీడియాకు, పార్టీ వర్గాలకు తెలియజేస్తారు. మీడియాను వాడటంలో టీడీపీ రూటే సెపరేట్‌. అంచలంచెలుగా లీక్‌లు ఇస్తూ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకోవడంలో టీడీపీ స్టయిలే వేరు. అలాంటిది ఇంత ప్రాధాన్యం ఉన్న అంశంలో రెండో కంటికి తెలియకుండా కథ నడపడానికి కారణం వ్యూహం బెడిసికొట్టకుండా ఉండేందుకేనట. అందుకే టీడీపీ నేతలు కేంద్రమంత్రిని కలిసిన తర్వాతే దీనిపై బయటకు తెలిసింది. ఈ విధంగా పార్టీ నేతలు సైలెంట్‌గా ఢిల్లీ వెళ్లడంపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. హస్తిన పర్యటనపై ముందుగానే తెలిస్తే మధ్యలోనే అవాంతరాలు వచ్చే అవకాశం ఉందని నేతలు భావించారట. వైసీపీ, బీజేపీ నాయకులు అడ్డుపడతారని అనుమానించారట. లీకైతే కేంద్రమంత్రి అపాయింట్‌మెంట్‌ రద్దయ్యే ప్రమాదం ఉందని లెక్కలు వేసుకున్నారట టీడీపీ నేతలు. టీడీపీలోని ముఖ్యులకు తప్ప ఢిల్లీ పర్యటన గురించి ఇంకెవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారట ప్రకాశం నేతలు.

కేంద్రమంత్రిని కలవలేకపోతే విమర్శలొస్తాయని ఆందోళన?

2019 ఎన్నికల తరువాత ఇలా ఒక జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల బృందం డిల్లీ వెళ్లడం ఇదే మొదటిసారి. పైగా బేటీ కూడా కేంద్రమంత్రితో కావడంతో గోప్యంగా ఉంచారు. ఒకవేళ డిల్లీ బయలుదేరాక ఏదైనా కారణంతో కేంద్రమంత్రిని కలవలేకపోతే విమర్శలు వస్తాయని ఆందోళన చెందారట. మరి.. వెలిగొండపై టీడీపీ నేతలు చేపట్టిన ఈ రహస్య ఢిల్లీ టూర్‌ వారికి ఎంత వరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Prakasam District
  • TDP Leaders
  • union minister
  • union minister shekhawat

తాజావార్తలు

  • Iran: ఖమేనీ భార్య కూడా మృతి.. ఇరాన్ ప్రకటన

  • Pete Hegseth: అమెరికాను బెదిరిస్తే.. ఎక్కడున్నా అంతుచూస్తాం.. ఇరాన్‌కు అమెరికా రక్షణమంత్రి వార్నింగ్

  • AP Helpline: యుద్ధం కారణంగా విదేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

  • Hyderabad: కాలేజీలో దారుణం.. బీటెక్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు అఘాయిత్యం

  • Holi Official Holiday 2026: హోలీ సెలవుపై గందరగోళం.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions