Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Officials Took Balineni Light

Balineni Srinivasa Reddy : బాలినేనిని లైట్ తీసుకున్న అధికారులు..!

Published Date :September 2, 2022 , 12:00 pm
By Premchand Chowdary
Balineni Srinivasa Reddy : బాలినేనిని లైట్ తీసుకున్న అధికారులు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Balineni Srinivasa Reddy : పదవితోపాటు మాజీ మంత్రి పరపతి కూడా పోయిందా? తన మెడకు చుట్టుకున్న సిండికేట్‌ ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదా? జిల్లాకు పెద్ద దిక్కు అనుకున్న మాజీ మంత్రి మాటకు విలువ లేకుండా పోయిందట. ఆయన చేసిన సూచనలను అధికారులు లైట్‌ తీసుకున్నారట.

ప్రకాశంజిల్లా వ్యాప్తంగా 25 బార్లకు లైసెన్సులు మంజూరుకు టెండర్లు పిలిచారు ఎక్సైజ్‌ అధికారులు. ఒంగోలు నగరంలోని 15 బార్లతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో మరో పదిచోట్ల లైసెన్సులు పొందేందుకు వ్యాపారులు టెండర్లు వేశారు. ఇక్కడే తిరకాసు జరిగింది. జిల్లాలోని పదిచోట్ల బార్ల లైసెన్సుల కోసం పోటీ నెలకొని.. ఎక్సైజ్‌ శాఖకు గతంలో కన్నా రెట్టింపు ఆదాయం వచ్చింది. ఒంగోలు నగరంలో మాత్రం పరిస్థితి తారుమారైంది. 15 బార్లు ఉన్న ఒంగోలు టౌన్‌లో మినిమం ప్రైస్‌కు అటూ ఇటూగా సింగిల్‌ టెండర్‌ పడ్డాయి. ఆన్‌లైన్‌లో అంతా పారదర్శకంగా జరుగుతోందని అధికారులు చెప్పినా ఒంగోలులో ఏం జరిగిందన్నది మిస్టరీగా ఉండిపోయింది.

టెండర్లు మొత్తం ఆన్‌లైన్‌లో నడిచినా ఎక్సైజ్‌ అధికారులకు ఎవరెవరు ఎంతకి టెండర్‌ వేశారో ముందే తెలుస్తుందట. ఆ సమాచారాన్ని లీక్‌ చేసి అందరూ సిండికేట్‌ అయ్యేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆశావహులు పోటీకి రాకుండా సిండికేట్‌లో ఓ వైసీపీ కీలక నేత చక్రం తిప్పారట. మిగతావాళ్లు టెండర్‌ వేయకుండా ఆపేశారనే ఆరోపణలు వినిపించాయి. పైగా గతంలో బార్లు నిర్వహించిన వారిలో 90 శాతం మంది తిరిగి లైసెన్సులు పొందడం చర్చగా మారింది. ఇలా దక్కించుకున్న 15 బార్లలో రెండు భాగాలు వైసీపీ.. ఒక భాగం విపక్ష నేతకు దక్కేలా ముందే ఒప్పందాలు చేసుకుని లైసెన్సులు పొందారని జనసేన నేతలు ఆరోపించారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి మాజీ మంత్రి బాలినేని మెడకు చుట్టుకుంది.

నగరంలో బార్లను బేసిక్‌ ప్రైస్‌కే పొందిన వ్యాపారులు కొంత మొత్తం వసూలు చేసి బాలినేని తనయుడు ప్రణీత్‌రెడ్డికి ఇచ్చారనేది జనసేన ఆరోపణ. ఈ ఆరోపణలపై బాలినేని తీవ్రంగా స్పందించారు. రాజకీయంగా తనను ఎదుర్కొనే దమ్ము లేకనే తన కుమారుడు ప్రణీత్‌రెడ్డిని లాగుతున్నారని ఫైర్‌ అయ్యారు. సిండికేట్‌పై గతంలోనే ఫిర్యాదు చేసి తిరిగి టెండర్లు పిలవాలని కలెక్టర్‌ను కోరానన్నారు బాలినేని. ఒంగోలులో కొత్తగా మంజూరైన బార్ల లైసెన్సులను రద్దు చేయించే వరకు తగ్గేదే లేదని తెగేసి చెప్పారు. ప్రతీదానికీ ప్రణీత్‌రెడ్డిని లాగడం సరికాదన్న బాలినేని.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగి విచారణ చేసుకోవచ్చని సవాల్‌ చేశారు.

తన మీద.. తన కొడుకు మీద కూడా ఆరోపణలు రావడం.. బాలినేని సీరియస్‌గా తీసుకోవడం.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో టెండర్లు రద్దు అవుతాయని అంతా అనుకున్నారు. కానీ.. బాలినేని మాట చెల్లలేదు. టెండర్లలో ఎవరైతే లైసెన్సులు దక్కించుకున్నారో వాళ్లే సెప్టెంబరు ఒకటినే బార్లు తెరిచారు. బాలినేని చాలా సీరియస్‌గా ఈ వ్యవహారంపై స్పందించినా కలెక్టర్‌ నుంచి రియాక్షన్‌ లేకపోవడం చర్చగా మారింది. బాలినేని స్థానిక ఒంగోలు ఎమ్మెల్యే. జిల్లా వైసీపీలో కీలక నేత. మాజీ మంత్రి. సిండికేట్‌ విషయంలో ఆయన సీరియస్‌గా ఉన్నా అధికారులు ఎందుకు లైట్‌ తీసుకున్నారు? మీడియాతో మాట్లాడేందుకు ఎక్సైజ్‌ అధికారులు ఎందుకు జంకుతున్నారు? గతంలో సైలెంట్‌గా పనిచేసుకుని వెళ్లిపోయిన అధికారులు ఇప్పుడు రుసరుసలాడుతున్నారు. దీంతో దాల్‌మే కుచ్‌ కలా హై అనే చర్చ సాగుతోంది. అలాగే జిల్లాలో బాలినేని మాటకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై వైసీపీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట. మరి.. ఈ అంశంపై మాజీ మంత్రి బాలినేని ఏం చేస్తారో.. స్పందిస్తారో లేదో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • balineni srinivasa reddy
  • Bar licence
  • janasena
  • Ongole
  • pawan kalyan

తాజావార్తలు

  • Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. వాహనదారులకు ఇక్కట్లు

  • Megastar Chiru : నంది అవార్డులపై AP ప్రభుత్వంపై చిరు కామెంట్స్.. నెటిజన్స్ ట్రోల్స్

  • Dhurandhar 2: ధురంధర్ 2 లో పాకిస్థాన్ మాజీ ప్రధాని..

  • Today Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి ధనయోగం పక్కా!

  • CM Revanth Reddy: ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామానాయుడు, కృష్ణ తెలుగు సినిమాకి నాలుగు మినార్లు..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions