Off The Record : ఢిల్లీ వర్సెస్ గల్లీ.. బీజేపీ హైకమాండ్ నిర్ణయాలపై తెలంగాణ నేతల గుర్రు?
- పట్టుమని పది నామినేటెడ్ పోస్ట్లు లేవని అసహనం
- ప్రతిసారి పేర్లు అడగడం, ఫైనల్గా హ్యాండ్ ఇవ్వడం
- పార్టీయే జీవితంగా ఉన్నవాళ్ళకు పదవులెక్కడని నిలదీతలు
- 8మంది ఎంపీలను ఇచ్చినా మొండి చెయ్యేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ హైకమాండ్ తీరుపై తెలంగాణ నేతలు గుర్రుగా ఉన్నారా? ఎంత చేసినా ఇంతేనా అని నిష్టూరంగా మాట్లాడుతున్నారా? ఏం… మాకేం తక్కువ, ఎందుకిలా చిన్నచూపు చూస్తున్నారంటూ ఒకింత నిలదీత స్వరం వినిపిస్తున్నారా? ఇంతకీ… ఏ విషయంలో టీజీ బీజేపీ నాయకులకు ఢిల్లీ పెద్దల మీద కోపం వస్తోంది? 8మంది ఎంపీలను ఇచ్చిన రాష్ట్ర నాయకులు ఏం కోరుకుంటున్నారు? నామినేటెడ్ పదవుల కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి పుష్కర కాలం అవుతున్నా…. ఇప్పటిదాకా పట్టుమని ఓ పది మంచి నామినేటెడ్ పదవులు ఇచ్చింది లేదంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర స్థాయి నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ పలుమార్లు పేర్లు అడిగినా…. ఫైనల్ లిస్ట్లో మాత్రం… రాష్ట్రం నుంచి పంపిన పేర్లు ఉండటం లేదట. అధికారంతో సంబంధం లేకుండా సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ కోసం దశాబ్దాల తరబడి పని చేస్తున్న వారికి కాస్త మంచి నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది తెలంగాణ బీజేపీలో. ప్రోటోకాల్ , హోదా ఉండే పోస్ట్లు కావాలని అడుగుతున్నారు నాయకులు. ఏళ్ల నుండి ఆటుపోట్లను తట్టుకుని పార్టీయే జీవితంగా బ్రతికిన కార్యకర్తలను గుర్తించి పదవులు ఇవ్వాలని అభిప్రాయం నేతల్లో బలంగా ఉంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా పని చేసిన వారికి పెద్దపీట వేస్తూ…పదవులు ఇచ్చిందని, అదే పద్ధతి మన దగ్గర ఎందుకు లేదంటూ కమలం నాయకులు గుసగుసలాడుకుంటున్నారట. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను గెలిపించి ఇచ్చినా, కష్టకాలంలో పార్టీని ఆదుకున్నా… ఇక్కడి వారికి మాత్రం మొండి చెయ్యే మిగులుతోందన్నది రాష్ట్ర నాయకుల ఆవేదన. పార్టీ ఢిల్లీ నాయకత్వం ఎందుకింత చిన్న చూపు చూస్తోందంటూ వాళ్ళలో వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారట. అసలు పార్టీ ఎంపీలే లేని రాష్ట్రాల్లో పార్టీ కోసం పనిచేశారంటూ మంచి పోస్ట్లు ఇస్తున్న ఢిల్లీ పెద్దలు ఇటువైపు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? ఇక్కడ ఎందుకు బలోపేతం చేయడం లేదంటూ అడుగుతున్నారు. కనీసం మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అయినా… తెలంగాణ నేతలకు పదవులు ఇస్తారని అనుకున్నారట. కానీ… రెండేళ్ళు కావస్తున్నా అతీగతీ లేదంటూ అధిష్టానం మీద ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. ఈ ఫ్రస్ట్రేషన్లో నుంచే కొత్త ప్రతిపాదన వస్తోందట.
Also Read
పార్టీ ముఖ్యనేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి ఎక్కువ కాలంగా విధేయతతో పనిచేస్తున్న వారి పేర్ల లిస్ట్తో అధిష్ఠానం దగ్గరికి పోయి ఒత్తిడి చేయాలన్న వాదన బలపడుతోంది. పెద్ద తలకాయలు గట్టిగా పట్టు పడితే కొన్ని పదవులైనా వస్తాయన్న చర్చ జరుగుతోంది తెలంగాణ బీజేపీలో. ఇక ఈసారి రాజ్యసభ సీటు కూడా తెలంగాణ నుంచి ఎవరికీ లేదు. కానీ… గతంలో ఒకరిద్దరు నేతలకు రాజ్యసభ హామీ ఇచ్చారట. అందులో ప్రధానంగా గరికపాటి మోహన్ రావు పేరు వినిపిస్తోంది. ఆయన గతంలో రాజ్యసభ సభ్యునిగా ఉంటూనే టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. అప్పుడే హామీ ఇచ్చారని, ఇప్పటికీ అది హామీగానే మిగిలిపోయిందని అంటున్నారు. ఓవరాల్గా బీజేపీ హై కమాండ్ గాలి ఎప్పుడు తెలంగాణ వైపునకు మళ్ళుతుందో, ఇక్కడి నేతలకు పదవులు ఎప్పుడు వస్తాయోనన్న చర్చ గట్టిగానే జరుగుతోంది.
- Tags
- NTV Telugu
- OTR
- TG BJP
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!