Off The Record : మున్సిపల్ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు!
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో దారుణంగా కాంగ్రెస్ పరిస్థితి
- మున్సిపల్ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు
- దారుణమైన ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా
- ఉమ్మడి జిల్లాలో ఎక్కడా మ్యాజిక్ ఫిగర్ దాటని కాంగ్రెస్
అత్యంత కీలకమైన ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు కిందా మీదా పడుతోంది? మున్సిపల్ ఎన్నికల్లో కూడా రాష్ట్రం మొత్తం ఒక ఎత్తయితే… ఆ ఒక్క చోట మరో ఎత్తు అన్నట్టుగా ఎందుకు మారిపోయింది? ఒక్కచోట కూడా మ్యాజిక్ ఫిగర్ దాటకుండా…. చివరికి చచ్చీచెడీ ఛైర్మన్ పీఠాలను దక్కించుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? అక్కడే ఎందుకలా జరుగుతోంది? తెలంగాణ రాజకీయాలకు గుండెకాయ లాంటిది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా అదే రేంజ్లో ఉంటుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా ఉందని అంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర రాజధానితో కలిసి ఉండే రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఫలితాలు అటు కాంగ్రెస్ నాయకులకు కూడా మింగుడు పడ్డం లేదట. అసలు ఎందుకు ఇలాంటి దారుణమైన రిజల్ట్స్ వచ్చాయంటూ అటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో జిల్లా నాయకుల పని తీరు గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మొదట్నుంచి పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి కాకుండా… నాయకులకు నచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంవల్లే ఫలితాలు అలా వచ్చాయన్న వాదన బలంగా ఉంది. అటు కేడర్ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 10 మున్సిపాలిటీల్లో ఎక్కడా కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్ దాటి సీట్లు రాలేదు.
మ్యాజిక్ ఫిగర్కు కాస్త దగ్గరగా వచ్చినచోట చచ్చీ చెడీ మున్సిపల్ ఛైర్మన్ పోస్ట్లను దక్కించుకోవాల్సి వచ్చింది. అందుకోసం రకరకాల అడ్డదారులు తొక్కాల్సి వచ్చిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే జరుగుతోంది. కొన్నిచోట్ల స్వతంత్ర అభ్యర్ధులను, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి కౌన్సిలర్స్ అయినవారిని, ఇంకొన్ని చోట్ల అయితే…. చివరికి సిద్ధాంత వైరుధ్యాలున్న బీజేపీతో కూడా జత కట్టి చైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను దక్కించుకుని పరువు కాపాడుకోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులు. అయితే… కొత్త, పాత నేతల మధ్య సఖ్యత లేని కారణంగానే జిల్లాలో పార్టీకి గట్టి దెబ్బతగిలినట్టు తెలుస్తోంది. హస్తంలోని ఐదు వేళ్ళు ఒక్కటిగా ఉంటే… ఆ లెక్క వేరుగా ఉంటుందని, దానికి బదులు నాయకులు ఎవరికివారే యమునాతీరే అన్నట్టుగా ఉండటం వల్లే దెబ్బలు తగులుతున్నాయన్నది నాయకుల మాట.
Also Read
ఎన్నిక ఏ రూపంలో జరిగినా మెజార్టీ మున్సిపాలిటీల్లో మహిళలకు పీఠాలు దక్కాయి. చేవెళ్ళ, మొయినాబాద్, అలియాబాద్, వికారాబాద్, తాండూరు, పరిగిలో మహిళలు ఛైర్ పర్సన్స్ అయ్యారు. ఈ అన్ని మున్సిపాలిటీల్లో సీనియర్స్, కీలక నాయకులు ఉన్నా…. ఎవరికి వారు పార్టీ తరపున కాకుండా, తమ వర్గం కోసం పాకులాడటంతో…. మనస్పర్థలు తలెత్తినట్టు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా పెద్దల మధ్య సఖ్యత లేకపోవడమే పార్టీకి శాపం అంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. మున్సిపల్ ఎన్నికల్లోనే ఇలాంటి ఫలితాలు వస్తే… రేపు పరిషత్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది పార్టీ శ్రేణుల్లో.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!