Off The Record : ఆ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి నాయకుడు కావలెను..!
- చుక్కాని లేని నావలా వైరా బీఆర్ఎస్
- కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు
- బీఆర్ఎస్ హయాంలో చాలా పదవులు నిర్వహించిన కొండబాల
- కేడర్ క్యూ కట్టకుండా బీఆర్ఎస్ తంటాలు
- ఇన్నాళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే మదన్లాల్
- మదన్లాల్ చనిపోయాక ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ నియోజకవర్గంలో గులాబీ కేడర్ బలంగానే ఉన్నా…. నడిపే నాయకుడు మాత్రం లేకుండా పోయారా? నాయకత్వం ఇస్తే తీసుకోవడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నా… పార్టీ అధిష్టానం మీన మేషాలు లెక్కిస్తోందా? సందట్లో సడేమియా అంటూ… కింది స్థాయి బీఆర్ఎస్ లీడర్స్ మీదికి కాంగ్రెస్ వల విసురుతోందా? ఎక్కడుందా పరిస్థితి? ఎందుకలా? ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ కారు నడిపే డ్రైవర్ కరవయ్యారట. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో…లోకల్గా పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారవడం చూసి కేడర్లో కంగారు పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. వైరాలో ప్రభావం చూపగలరని పేరున్న మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు సైతం… తాజాగా కాంగ్రెస్లో చేరిపోవడం గులాబీ దళాన్ని మరింత కంగారు పెడుతోందట.
మధిర ఎమ్మెల్యేగా, భద్రాచలం దేవస్థానం ఛైర్మన్గా పని చేయడంతోపాటు…. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎనిమిదేళ్ళకు పైగా వివిధ కార్పొరేషన్స్ ఛైర్మన్ హోదాలో ఉన్నారు కొండబాల. అలాంటి నాయకుడు పార్టీని వదిలిపోవడం వైరా బీఆర్ఎస్కు గట్టి దెబ్బేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైరాలో కొండబాల కోటేశ్వరరరావు సామాజికవర్గం ప్రభావం చాలా ఎక్కువ. అందుకే ఆయన పార్టీ మారిపోకుండా… బీఆర్ఎస్ నాయకత్వం చాలా ప్రయత్నాలు చేసినా… వర్కౌట్ కాలేదట. అయితే… కేడర్ కూడా ఆయన వెనక క్యూ కట్టకుండా ఆపేందుకు ఆపసోపాలు పడుతున్నారు గులాబీ నాయకులు.
Also Read
కానీ… ఇవాళ కాకుంటే రేపు అయినా… ఎక్కువ మంది అటువైపు వెళ్ళడం ఖాయమన్న మాటలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. ఇక్కడ బీఆర్ఎస్కు సరైన నాయకత్వం లేదన్న ఉద్దేశ్యంతోనే అంతా పక్క చూపులు చూస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. 2014లో వైసీపీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన మదన్లాల్ ఆ తరువాత 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొనసాగుతూ… గత మేలో చనిపోయారాయన. ఇక అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్ట్ ఖాళీగానే ఉండిపోయింది. మదన్లాల్ చనిపోయి కొద్ది కాలమే అయినా… ఇది స్థానిక ఎన్నికల పోరు సమమయం కావడంతో.. నడిపే నాయకుడు లేకుండా కష్టమని అంటున్నారు ద్వితీయ శ్రేణి నాయకులు. మరోవైపు 2009లో సిపిఐ ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రావతి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2014లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారామె. ఇక ఆ తర్వాత చంద్రావతికి సీటు ఇవ్వలేదు బీఆర్ఎస్. ఇప్పుడు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే… నిర్వహించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నా… పార్టీ అధిష్టానం మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదట. అటు మదన్లాల్ భార్య మంజుల కూడా రేస్లో ఉన్నారట.
దీంతో.. ఇప్పుడు మదన్లాల్ కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తారా? లేక సీనియర్గా చంద్రావతిని గౌరవిస్తారా అన్నది సస్పెన్స్గా మారింది. పార్టీ అధిష్టానం తమ నాయకురాలిని అవసరమైనప్పుడల్లా వెంట తిప్పుకుంటూ తీరా పదవుల దగ్గరికి వచ్చేసరికి హ్యాండ్ ఇస్తోందన్న అసహనం ఇప్పటికే చంద్రావతి వర్గంలో ఉంది. ఈ పరిస్థితుల్లో… అధినాయకత్వం ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదని, ఆలస్యం అయ్యేకొద్దీ నష్టం జరుగుతుందని అంటోంది కేడర్. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గ్రామ , మండల స్థాయి నాయకులకు గాలం వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వైరా పరిణామాలు ఎలా మారతాయో చూడాలి మరి.
తాజావార్తలు
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!