Off The Record: బీజేపీలో ముగ్గురు నేతల మూడుముక్కలాట
ఆ జిల్లా బీజేపీలో వర్గపోరు తారాస్థాయికి చేరిందా? అర్బన్ సీటుపై కన్నేసిన ముగ్గురు నేతలు పార్టీని గ్రూపులుగా చీల్చేశారా? ఇప్పుడు ఉనికికోసం ఆపసోపాలు పడుతున్నారా? అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : తిరుపతి కలెక్టర్ వైఖరితో రెవెన్యూ శాఖలో వణుకు.. స్పాట్ లోనే అధికారులు సస్పెండ్..
- Off The Record : పార్టీతో పాటు శెట్టిబలిజ సామాజికవర్గంలో మంత్రి సుభాష్ ఒంటరి అయ్యారా?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
మూడు ముక్కలాటలా బీజేపీ గొడవలు
ఇందూరు జిల్లాలో హాట్ సిట్గా ఉన్న నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో.. బీజేపీ నేతలకు అస్సలు పడటం లేదు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, నియోజకవర్గ ఇంఛార్జ్ ధన్పాల్ సూర్యనారాయణలు ముగ్గూరు అర్బన్ సీటుపై కన్నేశారు. గత ఎన్నికల్లోనే చివరి క్షణంలో సీటు చేజారిందనే కసితో ఉన్నారు ధన్పాల్. ఈసారి మాత్రం పోటీ చేసి తీరుతానని తన వర్గంతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మళ్లీ గెలిచి పట్టు నిలుపుకొంటానంటున్నారు యెండల. వీరిద్దరి మధ్యలో ఒక్కఛాన్స్ అంటున్నారు లక్ష్మీనర్సయ్య. దీంతో మూడు ముక్కలాటలా మారిపోయింది నిజామాబాద్ అర్బన్ బీజేపీ గొడవలు.
ఇప్పటికే ఎంపీ వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా పోరు
బీజేపీ ఎంపీ వర్గంలోని నేతగా ధనపాల్కు ముద్రపడింది. టికెట్ రాకపోతే రెంటికీ చెడ్డ రేవడి అవుతామన్న అనుమానంతో యెండల శిబిరంలో చేరారు లక్ష్మీనర్సయ్య. ప్రస్తుతం వీరి మధ్య కేడర్ చీలిపోయింది. వేర్వేరుగా ప్రజాపోరాటాలు చేస్తూ కేడర్ను గందరగోళంలో పడేస్తున్నారు నాయకులు. పాత ప్రభుత్వ కార్యాలయాల కూల్చివేతలపై పార్టీ చేపట్టిన నిరసనలో ఎవరికివారేగా ఉండటంతో బీజేపీ అభాసుపాలైందని కేడర్ చిన్నబుచ్చుకుందట. నియోజవర్గంలో బీజేపీ ఎంపీ వర్సెస్ యెండల అనేలా ఇప్పటికే కత్తులు దూసుకుంటున్నారు. ఈ వర్గపోరు ఎన్నికల్లో పార్టీని దెబ్బతీస్తుందని కేడర్ ఆందోళన చెందుతున్నా.. అధిష్ఠానం పట్టించుకోవడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
ఎవరికి వారు ఉనికి కోసం పోరాటం
బీజేపీకి నియోజకవర్గంలో రెండు కళ్లుగా ఉంటూ ముందుకు తీసుకెళ్లాల్సి నేతలు.. అంతర్గత విభేదాలతో ఉనికి కోసం పోరాడటం రాష్ట్ర నేతలకు కూడా మింగుడు పడటం లేదట. కమలం పార్టీ మళ్లీ పూర్వవైభవం సాధించాలంటే.. అగ్రనాయకత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారట. మరి.. కేడర్ ఆశిస్తున్నట్టు ఈ మూడు ముక్కలాటకు అధిష్ఠానం ఫుల్స్టాప్ పెడుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!