Off The Record: కోల్డ్వార్ సోషల్ మీడియా సృష్టే.. విభేధాల్లేవని బండి, ఈటల ప్రకటన!
- తమ మధ్య విభేధాల్లేవని బండి, ఈటల ప్రకటన
- కోల్డ్వార్ సోషల్ మీడియా సృష్టేనని వెల్లడి
- నిప్పులేందే పొగరాదా?
- ఒకరిపై మరొకరి ఫిర్యాదులు నిజంకాదా?
- తెలంగాణలో కులం, మతం రాజకీయం పని చెయ్యదన్న ఈటల
- బీజేపీ మూల సిద్ధాంతమే హిందుత్వ అని బండి ఇన్డైరెక్ట్ కౌంటర్
- బండి వ్యాఖ్యలు ఈటల కామెంట్స్కు కౌంటర్ అని చర్చ
- కోల్డ్వార్ లేదంటూనే పరోక్ష యుద్ధం సాగుతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతా తూచ్ తమ మధ్య ఎలాంటి విభేదాల్లేవని ఆ ఇద్దరు నేతలు ప్రకటించారు. అంతా సోషల్ మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. పార్టీ కోసం పని చేస్తున్నామని అన్నారు. ఎందుకు ఆ ఇద్దరు నాయకులు ఇంతలా చెబుతున్నారు? నిప్పు లేందే పొగరాదా?.
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే తెలంగాణ భారతీయ జనతా పార్టీలోనూ నేతల ప్రచ్చన్నయుద్దాలు కొత్తేమీ కాదు. లుకలుకలు…లకలకలు అప్పుడప్పుడు కేక పెడుతుంటాయి. కొంతమంది ముఖ్య నేతల మధ్య అసలేమాత్రం పొసగడం లేదని పార్టీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న టాక్. నేతల మధ్య సమన్వయం లేదు, సమిష్టి తత్వం లేదని పార్టీ వర్గాలే అంటుంటాయి. పైకి బాగా మాట్లాడినా..లోపల మాత్రం అంతా ఓకే కాదని గుసగుసలాడుతుంటాయి. ఎంపీ ఈటెల రాజేందర్కు, కేంద్రమంత్రి బండి సంజయ్ కు మధ్య గ్యాప్ ఉందని… ఇద్దరికీ అస్సలు పడటం లేదన్నది బహిరంగ రహస్యమే. గతంలో డైరెక్టుగానో, ఇండైరెక్ట్ గానో ఒకరిపై ఒకరు కామెంట్స్ కూడా చేసుకున్నారు. రీసెంట్ గా తెలంగాణలో మతం, కులం పరంగా విభజన రాజకీయాలు నడవవు అని ఈటెల రాజేందర్ అంటే… హిందువుల కోసం నా చివరి శ్వాస వరకు పోరాటం చేస్తానని…బీజేపీ మూల సిద్ధాంతమే హిందుత్వ అని బండి సంజయ్ అన్నారు. ఒకరిపై మరొకరు కౌంటర్ ఇచ్చుకున్నారని అందరూ అనుకున్నారు. మరోసారి ఇరువురి విభేదాలు రచ్చకెక్కాయని కూడా మాట్లాడుకున్నారు.
Also Read
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- OTR : సంగారెడ్డి బీజేపీలో పెరుగుతున్న గ్రూప్ వార్.. చినికి చినికి గాలి వానలా మారుతున్నా వివాదాలు
- OTR : అక్కడ టిడిపి గట్టిగా మైండ్ గేమ్ ఆడిందా.. వైసీపీ లీడర్స్ కూడా ఆ ట్రాప్ లో పడిపోయారా?
- Off The Record : కామారెడ్డి మున్సిపాలిటీలో రచ్చ రంబోలా.. ఎమ్మెల్యే vs చైర్ పర్సన్ వివాదం
ఈటల రాజేందర్, బండి కామెంట్ల యాక్షన్, రియాక్షన్ పరిణామాలపై స్వయంగా వారినే అడిగితే..తూచ్ తమ మధ్య విభేదాలేం లేవని ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పని చేసి ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని ఈటెల రాజేందర్ చెప్పారు. హుజూరాబాద్ సమావేశానికి తనకు సమాచారం వుందని…వ్యక్తిగత కారణాలతో రాలేకపోయానని వివరణ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య విభేధాలు సోషల్ మీడియా సృష్టేనని బదులిచ్చారు ఈటల రాజేందర్.
బండి సంజయ్ కూడా ఇదే మాట అన్నారు. తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాల్లేవని ప్రకటించారు. అవ్వన్నీ ఒట్టి పుకార్లని కొట్టివేశారు. పార్టీ బలోపేతం కోసం పని చేస్తామని చెప్పారు. తన మీద అలాంటి అభిప్రాయం ఉంటే మార్చుకోవాలన్నారు. వినడానికి ఇద్దరి వివరణలు, ప్రకటనలు బాగానే వున్నాయి. మరి అప్పుడప్పుడు కామెంట్లు, కౌంటర్లు ఎందుకని కార్యకర్తలు అంటున్నారు. ఒకవేళ వీరు చెప్పేదే నిజమనుకున్నా…ఈ సఖ్యత మాటలకే పరిమితం అవుతుందా…చేతల్లో కూడా కనిపిస్తుందా అన్నది చూడాలంటున్నారు పార్టీ నేతలు.
తాజావార్తలు
-
RR Vs GT: రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్.. ఆ రికార్డుపై గురిపెట్టిన వైభవ్..
-
Bank Holidays in June 2026: జూన్ నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం 13 రోజులు బ్యాంకులు బంద్!
-
Congress: భారత్పై నెతన్యాహూ ప్రశంసలు.. మోడీపై కాంగ్రెస్ విమర్శలు..
-
Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
-
Moizuddin Murder : రూ.25 లక్షల సుపారీ.. హిట్ అండ్ రన్గా న్యాయవాది హత్య స్కెచ్.!
ట్రెండింగ్
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!