Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Ysrcp High Command And Ys Jagan

Off The Record: వరుస షాక్‌లతో వైసీపీ షేక్‌..! అధిష్టానం నుంచి నో రియాక్షన్.. కారణం ఏమిటి..?

Published Date :March 21, 2025 , 10:20 pm
By Sudhakar Ravula
  • నేతలు వెళ్ళిపోతున్నా అధిష్టానం నుంచి నో రియాక్షన్‌..
  • గుడ్‌బై కొట్టేసిన కీలక నేతలు, ఐదుగురు ఎమ్మెల్సీలు..
  • అప్పుడు, ఇప్పుడు సైలెంట్‌గానే ఉన్న జగన్‌..
  • పిలిచి బుజ్జగిస్తే బాగుండేదని పార్టీలో చర్చ..
  • ఆవిర్భావం నుంచి వైసీపీలోనే ఉన్న మర్రి రాజశేఖర్‌..
  • విడదలకు తిరిగి పేట ఇన్ఛార్జ్‌ ఇవ్వడంతో మర్రి నిర్ణయం మార్పు..
  • టీడీపీ నుంచి లైన్‌ క్లియరవడంతో వైసీపీకి రాజీనామా..
Off The Record: వరుస షాక్‌లతో వైసీపీ షేక్‌..! అధిష్టానం నుంచి నో రియాక్షన్.. కారణం ఏమిటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం కంటే ఎక్కువగా… వలసల మీదే ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోందట. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక వన్‌ బై వన్‌ కీలక నేతలు సైతం బైబై చెబుతుండటం, అందుకు అధిష్టానం నుంచి కనీస స్పందన లేకపోవడం గురించి నాయకులంతా తెగ చెవులు కొరికేసుకుంటున్నట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ళ నాని, మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావు లాంటి ముఖ్య నాయకులతోపాటు ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ రాజీనామా పదవులకు రాజీనామా చేసి మరీ గుడ్‌బై కొట్టేశారు. తాజాగా అదే లిస్ట్‌లో మర్రి రాజశేఖర్ చేరటంతో ఆ సంఖ్య ఐదుకు చేరింది. అటు ఛైర్మన్లు, వైస్‌ ఛైర్మన్లు, కౌన్సిలర్స్‌ జంప్‌అయిపోతూ మున్సిపాలిటీలు చేజారుతుండగా… ఇటు ఎమ్మెల్సీలు కూడా క్యూ కట్టడం పార్టీ వర్గాలను కలవర పెడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో విజయసాయిరెడ్డి, బాలినేని, మోపిదేవి, ఆళ్లనాని వంటి నేతలు బయటకు వెళ్లిన సందర్బంలో కూడా పార్టీ అధినేత జగన్ సైలెంట్‌గానే ఉన్నారు. అయితే… అప్పట్లోనే వాళ్లని పిలిచి బుజ్జగిస్తే బాగుండేదన్న చర్చ జరిగిందట పార్టీలో. బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వెళ్లినప్పుడైతే… వెళ్లేవాళ్లను వెళ్లనీయండబ్బా… ఉన్న వాళ్లతోనే రాజకీయం చేసుకుంటానని జగన్‌ అన్నట్టు ప్రచారం జరిగింది.

తాజాగా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామాపై కూడా ఇదే తరహా చర్చ జరుగుతోందంటున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పేట నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారాయన. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2010లో వైసీపీ జెండా పట్టుకుని 14లో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఓడిపోయారు మర్రి. ఆ తరువాత ఉమ్మడి గుంటూరు జిల్లా వైసిపి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత మారిపోయిన సమీకరణాలతో…2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు విడదల రజని. అప్పుడు రజనీకి టికెట్ ఇవ్వడాన్ని మర్రి రాజశేఖర్‌ తీవ్రంగా వ్యతిరేకించడంతో… ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు జగన్‌. ఆ ప్రకారమే అవకాశం దక్కింది. ఇక 2024 ఎన్నికల ప్రయోగాల్లో భాగంగా విడదల రజనీని గుంటూరు పంపడం, అక్కడ ఆమె, రాష్ట్రంలో పార్టీ ఓడిపోవడం, తర్వాత రజనీకి తిరిగి పేట ఇన్ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించడం వరుసగా జరిగిన పరిణామాలు. ఇక్కడే మర్రికి మండిపోయిందట. చిలకలూరిపేట వైసీపీలో తనకు ఇబ్బందికరంగా మారిన రజనీ వెళ్ళిపోయారని అనుకుంటున్న టైంలో… ఆమెను తిరిగి అక్కడికే తీసుకురావడంపై మర్రి తీవ్ర అసంతృప్తి చెందినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి పార్టీ మార్పు ప్రచారం మొదలైనా…. చివరికి ఇప్పుడు నిజమైంది. వైసీపీకి రాజీనామా చేసిన మరుసటి రోజే తాను టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు రాజశేఖర్‌.

అయితే.. పార్టీలో మొదట్నుంచి ఉన్న నాయకుడు రాజీనామా చేసినా సరే… అధిష్టానం తరపున ఆయన ఇబ్బంది ఏంటని అడిగినవారే లేరంటూ అసెంబ్లీ ఆవరణలో కొందరు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్సీలు మాట్లాడుకున్నట్లు సమాచారం. రాజీనామా చేస్తున్న.. చేసినవారితో అధిష్ఠాన పెద్దలు మాట్లాడరు, కనీసం వాళ్ళకు పార్టీలో ఎవరితో సాన్నిహిత్యం ఉందో చూసి మాట్లాడించే ప్రయత్నమూ చేయరు, ఇంట్లో ఒకరు ఇబ్బంది పడుతుంటే… ఏమైందని మిగతా వాళ్ళం తెలుసుకుంటాం…. పరిష్కరిం చుకుంటాం. కానీ.. పార్టీని మన అని భావించే వాళ్ళకు కష్టం కలిగి వెళ్ళిపోతామంటే… కనీసం మాట్లాడించి ఎందుకని అడిగే దిక్కు లేకపోవడం దారుణమని చర్చించుకువన్నారట సదరు వైసీపీ ఎమ్మెల్సీలు. అయితే… మర్రి రాజశేఖర్‌ విషయంలో అధిష్టానంతో సంబంధం లేకుండా ఒకరిద్దరు నాయకులు మాట్లాడి చూసినా… ఇక ఉండబోనని ఆయన చెప్పినట్టు సమాచారం.

విడదల రజనీ రీఎంట్రీతో పార్టీపై అసంతృప్తిగా ఉన్న మర్రి తన వ్యూహం మార్చుకున్నారట. 2029 ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేయాలన్న టార్గెట్‌తో.. టీడీపీతో సంప్రదింపులు జరిపి అట్నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అమల్లో పెట్టినట్టు తెలిసింది. ఇక్కడే వైసీపీ అదిష్టానం కూడా తన వాదన వినిపిస్తోందట. మొత్తం క్లారిటీ తెచ్చుకున్నాకే వాళ్ళు పార్టీ వదిలి వెళ్తున్నారని, పూర్తిగా డిసైడైన వాళ్ళను ఆపితే మాత్రం ఆగుతారా అన్నది ఫ్యాన్‌ పెద్దల క్వశ్చన్‌ అట. అటు అధినేత జగన్ కూడా… పార్టీలో వారికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇచ్చామని.. అధికారం లేకపోవటంతో ఏరు దాటాక ఏవో మాటలు మాట్లాడి.. బయటకు వెళ్తున్నారే తప్ప ప్రాధాన్యత లేక కాదన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. మరి పార్టీ నుంచి బయటకు వెళ్లే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలోఅధినేత వైఖరిలో మార్పు వస్తుందా.. వైసీపీలో కూడా బుజ్జగింపులు చూడొచ్చా అన్నది తెలియాలంటే… ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • off the record
  • YCP High Command
  • ys jagan
  • YSRCP

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • PCB Fines Pakistan Players: అబ్బా ఏం ఫీల్ ఉంది.. పాక్ ప్లేయర్లకు PCB షాక్ ట్రీట్మెంట్.. ప్రతి ఆటగాడికి 50 లక్షల జరిమానా!

  • Sanju Samson: ఈ రోజు కోసమే ఎదురుచూశా.. నా జీవితంలో ఈ ఇన్నింగ్స్‌ను మర్చిపోలేను!

  • Rahul Gandhi: నేడు హైదరాబాద్కి రాహుల్ గాంధీ రాక..

  • Tirumala: తిరుమల వెళ్లే వారికి అలర్ట్.. రేపు చంద్రగ్రహణం కారణంగా ఆలయం మూసివేత

  • T20 WC 2026 Semi Final Schedule: సెమీస్‌ షెడ్యూల్‌.. భారత్‌ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!

ట్రెండింగ్‌

  • The IQ Era థీమ్‌తో MWC 2026 నేడే ప్రారంభం.. ఏ కొత్త ఫోన్ల లాంచ్‌ కానున్నాయంటే..!

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions