Off The Record: నామినేటెడ్ పదవుల భర్తీ పెండింగ్ లో పడటానికి కారకుడు ఎవరు..?
- కాంగ్రెస్లో జోరుగా నామినేటెడ్ పదవుల భర్తీ చర్చలు..
- ఇటీవలే ముగిసిన 37 కార్పొరేషన్ ఛైర్మన్స్ పదవీకాలం..
- భర్తీ పెండింగ్లో పడటానికి కారకులు ఎవరన్న చర్చ..
- పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ వైపు చూపిస్తున్న కొందరు నేతలు..
- పార్టీ వైపు నుంచి ఫాలోఅప్ లేకనే అంటూ కొత్త వాదన..
- అందరికీ రెన్యువల్స్ కుదరవని చెప్పడంవల్లేనంటూ పీసీసీ టీమ్ కౌంటర్..
- పదవి వచ్చాక కూడా పార్టీ కోసం పని చేసిన వాళ్ళకే రెన్యువల్స్?..
- ముందు కొత్త పదవులు, ఆ తర్వాతే రెన్యువల్స్ ఆలోచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన వ్యవహారంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. చాలా రోజులుగా పోస్ట్ల కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఈసారైనా దక్కుతాయా..? లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు ఇటీవలే 37 కార్పొరేషన్ ఛైర్మన్స్ పదవీకాలం ముగిసిపోయింది. వాళ్లను తిరిగి కంటిన్యూ చేస్తారా..? ఒకవేళ చేస్తే… ఎంతమందికి ఛాన్స్ దక్కుతుందన్న అంశం కూడా కీలకంగా మారింది. దాని చుట్టూ కూడా పార్టీ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అదంతా ఒక ఎత్తయితే… అసలు నామినేటెడ్ పోస్టుల భర్తీ పెండింగ్లో పడటానికి కారకులు ఎవరన్న కోణంలో కూడా హస్తంలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే…. మొత్తం మీరే చేశారు… అంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వైపు చూస్తున్నారట పార్టీ లీడర్స్ కొందరు. ఆలస్యం మొత్తం ఆయనవల్లనే అంటూ… కొత్త డిస్కషన్కు తెర లేపారు. పార్టీ వైపు నుంచి సరైన ఫాలోఅప్ లేకపోవడం వల్లే పదవుల భర్తీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతోందన్నది సదరు వేలు చూపించే వాళ్ళ వాదన. కొత్త వాటి సంగతి తర్వాత, ఉన్నవాళ్ల పదవీకాలం ముగిసి రెన్యువల్కు వచ్చిన సమయంలో పార్టీ చీఫ్ అందుబాటులో లేరని, దాంతో సమస్య ఇంకా తీవ్రంగా కనిపిస్తోందంటూ గాంధీభవన్లోనే గుసగుసలాడుకుంటున్నారట.
ఐతే… PCC చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం ఈ చర్చను తిప్పికొడుతున్నారు. అసలా టాక్ రావడానికి కారణాలను కూడా వివరిస్తోంది పీసీసీ టీమ్. రెన్యువల్స్ విషయంలో మహేష్గౌడ్ కాస్త సీరియస్గానే ఉన్నారట. అందరికీ రెన్యువల్ చేయడం కుదరదని బాహాటంగా చెప్పడం వల్లనే ఇలాంటి ప్రచారం మొదలైందన్నది ఆయన వర్గం వాదన. మరోవైపు కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ల భర్తీ విషయంలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, అందర్నీ గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి పీసీసీ చీఫ్ అంత సీరియస్గా ఉన్నట్టు చెబుతున్నారు. పదవి వచ్చాక కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను తప్ప… మిగిలిన వారిని కొనసాగించేది లేదని క్లారిటీ ఇస్తోంది పీసీసీ. సీఎం రేవంత్ రెడ్డి కూడా పనిచేసిన వాళ్లను మాత్రమే కంటిన్యూ చేయాలన్న ఆలోచనతో ఉన్నారట. రెన్యువల్స్ విషయంలో ప్రత్యేక విధానాన్ని పాటించబోతున్నట్టు తెలుస్తోంది. కొత్తగా ఎంపిక చేసిన నాయకులతో ముందు కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టుల్ని భర్తీ చేస్తారు.
Also Read
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
- OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
- OTR: జాగ్రత్త.. మీరు, మీ భర్త జాగ్రత్తగా మెలగండి..
- Off The Record: ఇంటి దొంగలే దుష్ప్రచారం చేస్తున్నారా?.. మంచిర్యాల కాంగ్రెస్లో కొత్త మంటలు!
ఆ తర్వాత రెండు నెలలకు రెన్యువల్స్పై చర్చించాలన్నది పీసీసీ ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో చాలా రోజులుగా పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులకు ముందస్తు ఊరట లభిస్తుందన్నది పీసీసీ ఫీలింగ్. ఈ వారంలోనే సీఎం రేవంత్ రెడ్డితో ఇన్చార్జి మీనాక్షి నటరాజన్.. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాతే భర్తీపై క్లారిటీ వస్తుంది. పార్టీకి సంబంధించిన వ్యవహారాల సంగతి ఎలా ఉన్నా…. పదవుల భర్తీ మాత్రం ఆలస్యం అవుతోందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే అన్నిటినీ ఫిల్ చేసి ఉంటే… ఇప్పుడు కొత్తగా చాలా మందికి అవకాశం దక్కేది. ఈ పరిస్థితుల్లో…. సరే…. జరిగిందేదో జరిగిపోయింది…. ఇప్పటికైనా అన్ని పదవుల్ని పూర్తి స్థాయిలో భర్తీ చేయాలంటున్నారు కాంగ్రెస్ నాయకులు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!