Off The Record: ప్రధాని మోడీ చెప్పినా తెలంగాణ బీజేపీ నేతల్లో మార్పు రాలేదా..?
- స్థానిక ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్తు..
- సంస్థాగత బలోపేతానికి ప్రయత్నాలు..3 నేతలు పార్టీ లైన్లో ముందుకు పోవడంలేదన్న అభిప్రాయం..
- కొత్త-పాత చర్చ వద్దన్నా మారని పరిస్థితి..
- అంతా ఒక్క తాటి మీదికి రావాలని ఢిల్లీ పెద్దల పిలుపు..
- అప్పట్లో రాష్ట్ర బీజేపీ నేతల మీద ప్రధాని సీరియస్..
- స్వయంగా మోడీ తలంటినా మారని నేతల తీరు..
- స్థానిక ఎన్నికల్లో కలిసి పనిచేయమని తాజా వార్నింగ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తమవుతోంది బీజేపీ. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక… ఫస్ట్ టాస్క్ కాబట్టి… ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారట. అందుకే జిల్లాల పర్యటనలు మొదలుపెట్టినట్టు సమాచారం. మండల పార్టీ అధ్యక్షులకు వర్క్షాప్స్ పేరుతో పార్టీని సంస్థాగతంగా, రాజకీయంగా బలోపేతం చేసేందుకు శిక్షణ ఇస్తున్నారు. అయినా సరే…. పార్టీలో ఏదో… వెలితి కనిపిస్తూనే ఉందట. కారణం ఏంటంటే… నేతలు ఐక్యతా రాగం వినిపించడం లేదన్నది సమాధానం. ఎవరికి వాళ్ళు స్థానికంగా ఏదో… చేస్తున్నామంటే చేస్తున్నామన్నట్టుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోతున్నారు తప్ప…. పార్టీ లైన్లో మాత్రం యాక్టివ్గా ముందుకు పోవడం లేదని చెప్పుకుంటున్నారు. రాష్ర్ట పార్టీ కార్యక్రమాలకు కూడా ఉత్సాహంగా హాజరవడం లేదు. అదే సమయంలో ఇక కొత్త- పాత అన్నది లేదు, అసలా చర్చను వదిలి పెట్టాలని, అందరూ పార్టీ నాయకులు, కార్యకర్తలే అని చెప్పినా… అది మాత్రం జరగడంలేదు. దీంతో మమ్మల్ని ఇంకెప్పుడు కలుపుకుని పోతారు? మేం ఎప్పటికీ కొత్త వాళ్ళమేనా అన్నది ఓ వర్గం క్వశ్చన్. మరోవైపు ఢిల్లీ పెద్దలు మాత్రం… పార్టీ కోసం అందరూ ఒక్క తాటిపైకి రావాలని పిలుపునిస్తున్నారు.
Read Also: Digital Micro Finance: డిజిటల్ మైక్రోఫైనాన్స్.. 500 మంది రోడ్డుపాలు..!
Also Read
ప్రధాని మోడీ అయితే… ఒక దశలో రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను పిలిచి ఉతికి ఆరేశారు. అధికారంలోకి రావాలన్న కసిగా పని చేయండని చెప్పారు. 2023లో అధికారంలోకి వచ్చేవాళ్ళమని, మీరే చే జేతులా పోగొట్టారని కూడా అప్పట్లో సీరియస్ అయ్యారట ప్రధాని. అయినా సరే.. ఆ తర్వాత కూడా తెలంగాణ కమలం నేతల్లో పెద్దగా మార్పు రాలేదన్నది పార్టీ వర్గాల మాట. ఎన్నడూ కలిసి పనిచేసింది లేదు. కానీ…ఇప్పుడు లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తున్నాయి. అంతా కలిసికట్టుగా పని చేస్తే పార్టీకి మంచి ఫలితాలు వస్తాయన్న అంచనాలున్నాయి. ఆ విషయాన్నే…. పార్టీ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్లో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గట్టిగా చెప్పారట. పక్షపాతం విడనాడాలని స్పష్టం చేశారట ఆయన. కలిసి పని చేయాలని, పనిలో అందరికీ భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పినట్టు సమాచారం. తమకు సరైన అవకాశం ఇవ్వడం లేదని, పనులు అప్పగించడం లేదన్న అభిప్రాయం చాలా మంది ప్రజాప్రతినిధుల్లో ఉందట. ఇంత చెబుతున్నారు కాబట్టి… ఇప్పటికైనా…అందర్నీ ఇన్వాల్వ్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది బీజేపీ వర్గాల్లో. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా కార్యకర్తలు కదలాలంటే… ముందు నాయకులు అడుగేయాలని, కలిసి కట్టుగా పని చేయాలని అంటున్నారు. అంతవరకు బాగానే ఉందిగానీ… ఇప్పుడు అందరిదీ ఒకటే డౌట్ అట. మోడీ చెప్పినా… మారని నాయకులు…. ఇప్పుడు బన్సల్ మాటవిని ఒక్కటవుతారా… తలోవైపు విరిసి ఉన్న కమలం రెక్కలు మళ్లీ సెట్ అవుతాయా అన్న అనుమానాలు ఉన్నాయి పార్టీ వర్గాల్లో. కొత్త అధ్యక్షుడు ఎవరెవర్ని, ఎంత మేరకు కలుపుతాడో చూడాలి మరి.
తాజావార్తలు
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్బై.. సీఎస్కే భవిష్యత్పై బెంగ!
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!