Off The Record: శ్రీశైలం ఆలయ పాలకమండలిలో రచ్చ రచ్చ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆంధ్రప్రదేశ్లో TTD బోర్డు బెజవాడ కనకదుర్గమ్మ గుడి పాలకమండళ్లకు ప్రాధాన్యం ఎక్కువ. ఈ రెండు ఆలయాలతోపాటు రాష్ట్రంలో పలు కీలక గుళ్లు ఉన్నప్పటికీ.. అక్కడి ట్రస్ట్ బోర్డుల గురించి పెద్దగా ప్రచారం ఉండదు. మిగతా కీలక ఆలయాల్లో పాలకమండలిని నియమించిన తర్వాత ఒకరోజో.. రెండు రోజులో చర్చ జరుగుతుంది. తర్వాత ఎవరూ పట్టించుకోరు. అలాంటి ఆలయాల్లో శ్రీశైలం కూడా ఒకటి. శ్రీశైలం ఆలయం పాలకమండలి చర్చల్లోకి వచ్చిన సందర్భాలు కూడా చాలా అరుదు. శివరాత్రికో.. కార్తీక మాసంలోనో శ్రీశైలం ఆలయం గురించి మాట్లాడుకుంటారు తప్ప అక్కడ ఛైర్మన్ ఎవరు.. బోర్డు సభ్యులు ఎవరు అనే ఆరాలు కూడా పెద్దగా ఉండవు. అలాంటి ఆలయ పాలకమండలిలో ప్రస్తుతం రచ్చ రచ్చ అవుతోంది.
Read Also: Off The Record: ఏపీలో బీఆర్ఎస్ ప్లాన్స్ ఏంటి..? ఒంటరి పోరేనా?
Also Read
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- OTR : సంగారెడ్డి బీజేపీలో పెరుగుతున్న గ్రూప్ వార్.. చినికి చినికి గాలి వానలా మారుతున్నా వివాదాలు
- OTR : అక్కడ టిడిపి గట్టిగా మైండ్ గేమ్ ఆడిందా.. వైసీపీ లీడర్స్ కూడా ఆ ట్రాప్ లో పడిపోయారా?
- Off The Record : కామారెడ్డి మున్సిపాలిటీలో రచ్చ రంబోలా.. ఎమ్మెల్యే vs చైర్ పర్సన్ వివాదం
శ్రీశైలం ఆలయ పాలకమండలి ఛైర్మన్ ఈయనే రెడ్డివారి చక్రపాణిరెడ్డి. ఇక ఈయన ఆలయ ఈవో లవన్న. స్వామి అమ్మవార్ల ప్రసాదాల సరుకుల కొనుగోలుపై స్వయానా ఛైర్మన్ చక్రపాణిరెడ్డి ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలను ఈవో లవన్న ఖండించారు. అంతేకాదు.. ట్రస్ట్బోర్డులోని మరో ఇద్దరు సభ్యులు కూడా ఛైర్మన్ వ్యాఖ్యలను ఖండించారు. దీంతో శ్రీశైలం ఆలయ బోర్డులో ఏం జరుగుతుంది అనేది చర్చగా మారింది. ఛైర్మన్ ఎందుకీ ఆరోపణలు చేశారు? వాటిని ఖండించారంటే ఈవో వెనుక ఉన్నదెవరు? సభ్యులు ఓపెన్గా ఎందుకు ఛైర్మన్ను టార్గెట్ చేశారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి బోర్డు మీటింగ్స్లో అజెండాపై ముందుగానే ఛైర్మన్, ఈవో, సభ్యులు మాట్లాడుకుంటారు. తర్వాత అజెండాను సమావేశంలో ఆమోదిస్తారు. అంతేకానీ.. ఒకరిని ఒకరు విభేదించుకోరు. ఆరోపణలు చేసుకోరు. అంతా పాలకపక్షమే కావడంతో సాఫీగా సాగిపోతుంది. కానీ.. ఇక్కడే ఏదో తేడా కొట్టిందని చెవులు కొరుక్కుంటున్నారు.
శ్రీశైలం ఆలయ సెక్యూరిటీ ఆఫీసర్ను ఈ మధ్యనే మార్చారట. ఆయనను తిరిగి కొనసాగించాలని ఛైర్మన్ చక్రపాణిరెడ్డి సిఫారసు చేసినట్టు సమాచారం. అయితే సెక్యూరిటీ ఆఫీసరుగా డీఎస్పీ స్థాయి అధికారి ఉండాలని అధికారులు ఛైర్మన్కు ముఖంమీదే చెప్పేశారట. తన మాట చెల్లుబాటు కాలేదన్న కోపమో ఏమో.. ప్రసాదాల సరుకుల కొనుగోలుపై చక్రపాణిరెడ్డి ఆరోపణలు చేశారని చెవులు కొరుక్కుంటున్నారట. ప్రసాదాల కోసం వినియోగించే 127 సరుకులను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారనేది ఛైర్మన్ ఆరోపణ. 15 ఏళ్లుగా ఒకే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇస్తున్నారని చక్రపాణిరెడ్డి వెల్లడించారు. ఛైర్మన్ ప్రస్తావించిన ఈ అంశాలనే బోర్డులోని ఇద్దరు సభ్యులు.. ఈవో లవన్న ఖండించారు. మొత్తానికి సమస్య ఎక్కడ మొదలైనా.. శ్రీశైలం ఆలయంలో ఏదో జరుగుతోందనే అభిప్రాయం భక్తుల్లో కలిగేలా బోర్డు, అధికారుల వైఖరి వుందని గుసగుసల వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Records: బేబీ బాస్ బీభత్సం.. ఒక్క తుఫాన్ ఇన్నింగ్స్ తో వైభవ్ ఖాతాలోకి చేరిన రికార్డ్స్ ఇవే.!
-
Peddi Sensor talk : పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్.. ఈ కథను ఒప్పుకోవడం ఒక పెద్ద సాహసమే
-
Riyan Parag: అమ్మో వైభవ్ను అస్సలు టచ్ చేయం.. రాజస్థాన్ కెప్టెన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
RR vs SRH: ఆ రెండే కారణం.. క్వాలిఫయర్ -2లోకి రాజస్థాన్, ఇంటికి హైదరాబాద్..
-
US-Iran War: పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ఒప్పందం ముగిసినట్లే? ఇరాన్పై అమెరికా బాంబుల వర్షం!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!