Off The Record: అత్యంత కీలకమైన ఆ నియోజకవర్గంలో అధికారులు నలిగిపోతున్నారా?
- పులివెందులలో పాగా కోసం టీడీపీ ప్రయత్నాలు..
- లోకల్ లీడర్స్ ఆ రూట్లో లేరంటున్న కేడర్..
- ఎమ్మెల్సీ రామ్గోపాల్రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి..
- ఆధిపత్య పోరులో ఇరుక్కుపోతున్న అధికారులు..
- P4 కార్యక్రమం అమలుపై చర్చ కోసం తాజా మీటింగ్..
- నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి అధికారిక ఆహ్వానం..
- నన్ను ఎందుకు పిలవరంటూ ఎమ్మెల్సీ మండిపాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: పులివెందుల….పొలిటికల్గా ఈ పేరు చెప్పగానే…. ఏపీలో ఎవరికైనా ఠక్కున గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబమే. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గాన్ని తమ కంచుకోటలా మలుచుకుంది ఆ ఫ్యామిలీ. అలాంటిచోట పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది టీడీపీ. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో… వైనాట్ పులివెందుల నినాదం ఇచ్చింది. మరి అలాంటి చోట ఆ పార్టీ తీరు ఎలా ఉండాలి? ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి? కానీ… లోకల్ లీడర్స్ మాత్రం ఆ రూట్లో లేరని చెప్పుకుంటున్నారు స్థానిక కార్యకర్తలు. ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వాలకం చూస్తుంటే… వైనాట్ పులివెందుల నినాదం సంగతి తర్వాత… అసలు మేం పుంజుకుంటామా లేదా అన్న డౌట్ వస్తోందని అంటోందట నియోజకవర్గ పార్టీ కేడర్. ఆధిపత్య పోరుతో ఇద్దరూ ఇక్కడ పార్టీకి పాతరేస్తున్నారన్నది కేడర్ వాయిస్. అదంతా ఒక ఎత్తయితే… ఇక్కడ పని చేయడం మావల్ల కాదు బాబోయ్… అంటూ చేతులెస్తేస్తున్నారట అధికారులు.
Read Also: Varun Aaron: ఐపీఎల్ 2026 కోసం కొత్త బౌలింగ్ కోచ్ను ప్రకటించిన సన్రైజర్స్ హైదరాబాద్..!
Also Read
ఆధిపత్య పోరుతో నాయకులిద్దరూ వత్తిళ్ళు పెంచడంతో… ఇక్కడ ఉద్యోగం చేయడం మావల్ల కాదని దండం పెట్టేస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన P4 కార్యక్రమం కింద.. నియోజకవర్గస్థాయిలో విజన్ 2047 సాకారానికి అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చించేందుకు సమావేశం నిర్వహించారు అధికారులు. మామూలుగా అయితే… ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే చైర్మన్గా వ్యవహరిస్తారు. ఆ లెక్క ప్రకారం పులివెందుల ఎమ్మెల్యే అయిన వైసీపీ అధినేత జగన్ ఛైర్మన్గా వ్యవహరించాలి. కానీ.. ఆయన మీటింగ్కు వచ్చే అవకాశం లేకపోవడంతో… ప్రత్యేక ఆహ్వానితుడిగా….. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవికి ఇన్విటేషన్ పంపారు అధికారులు. సరిగ్గా ఇక్కడే తాజా వివాదం మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు.. నియోజకవర్గానికి చెందిన నేను ప్రజాప్రతినిధిగా ఉన్నాను కదా… ఆ ప్లేస్లో నన్నెందుకు పిలవలేదంటూ…ఫైరై పోయారట ఎమ్మెల్సీ రామ్గోపాల్రెడ్డి. పి4 కార్యక్రమంలో భాగంగా… ప్రతి నియోజకవర్గంలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై నివేదికలు తయారు చేయాల్సి ఉంటుంది. అందుకే…. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీని, పులివెందుల నివాసిని అయిన తనను ఎందుకు ఈ కార్యక్రమానికి పిలవలేదంటూ రాంగోపాల్ రెడ్డి అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
Read Also: Tragic : యాదాద్రిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య
ప్రత్యేక అధికారి అయిన రాజ్యలక్ష్మిని వాట్సప్ కాల్లో నిలదీశారట ఎమ్మెల్సీ. అధికార పార్టీ ఎమ్మెల్సీ అయిన నన్నే కార్యక్రమానికి పిలవరా ? మీరు ఉద్యోగం ఎలా చేస్తారో, నేను కూడా చూస్తానంటూ బెదిరించినట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ బెదిరించారంటూ ఆ అధికారి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారట. పులివెందుల ప్రత్యేక అధికారిగా తాను పని చేయలేనని కూడా రాజ్యలక్ష్మి కలెక్టర్కు చెప్పేసినట్టు సమాచారం. అయితే… తొందరపడవద్దని, ప్రజా ప్రతినిధులతో నేను మాట్లాడతానని ఆమెకు కలెక్టర్ భరోసా ఇచ్చినట్టు తెలిసింది. అయినా ఆమె భయం తగ్గకపోవడంతో…. ఈ అంశాన్ని తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని కూడా కలెక్టర్ ఆ అధికారికి హామీ ఇచ్చి నచ్చజెప్పినట్టు సమాచారం. మొన్న పోలీసులు, నేడు ఇతర అధికారులు… ఇలా ఒక్కో సందర్భంలో ఒక్కో విభాగానికి చెందిన వారు ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరులో నలిగిపోతున్నారట. అయ్యబాబోయ్ పులివెందులా… అక్కడ మేం పనిచేయలేమంటున్నారన్నది అధికార వర్గాల టాక్. రాను రాను సంక్లిష్టంగా మారుతున్న ఈ వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం ఎలా డీల్ చేస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
-
Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?