Off The Record: నెల్లూరు వైసీపీలో లుకలుకల రచ్చ.. డబుల్ గేమ్ నేతలపై హైకమాండ్ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: వైసీపీలో అసమ్మతి గళాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో లుకలుకలు ఓ రేంజ్లో రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి… ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్గా తీసుకోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఆనంను తప్పించి… నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని నియమించింది. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజవర్గం వంతు వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అసంతృప్తిలో ఉన్నారనే ప్రచారం ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు.
Read Also: RTC Bus: బెజవాడలో హోటల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..
Also Read
అయితే మంత్రి పదవి రాకపోవటమే కాకుండా తన కంటే జూనియర్ అయిన అనిల్కుమార్ యాదవ్కు క్యాబినెట్లో బెర్త్ దక్కటంతో ఆయన మరింత రగిలిపోయారట. ‘మొగుడు కొట్టినందుకు కాదు… తోడి కోడలు నవ్వినందుకు’ అన్నట్లుగా అయ్యింది కోటంరెడ్డి వ్యవహారం. అప్పటినుంచే అవసరం వచ్చినప్పుడు పార్టీ కంటే… సొంత ఇమేజ్ కోసం ఆయన ప్రయత్నించటం మొదలుపెట్టినట్లు చర్చ జరుగుతోంది. సెకెండ్ ఫేస్ క్యాబినెట్లో అయినా బుగ్గ కారు ఎక్కవచ్చునని ఆశించినా… సామాజిక సమీకరణాల కారణంగా కోటంరెడ్డికి అవకాశం దక్కలేదు. అమరావతి రైతుల యాత్ర నెల్లూరు వచ్చినప్పుడు ప్రత్యేకించి వారు ఉన్న శిబిరానికి వెళ్లి పరామర్శించి రావటం అప్పట్లో చర్చనీయాంశంగా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి పార్టీ వర్గాలు. మరోవైపు, కోటంరెడ్డి బెట్టింగ్ కేసుల్లో పూర్తిగా కూరుకుపోయి ఉన్నారని…ఆ విషయంలోనూ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సమస్య ప్రారంభంలోనే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్లు కూడా కోటంరెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేయలేదని సమాచారం. ఈలోపు కోటంరెడ్డి కూడా పార్టీ నిర్ణయానికి విలువ ఇవ్వాల్సి ఉన్నా… పార్టీ లైన్ను దాటి టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ అధికారులపై ఓపెన్గా కామెంట్లు చేయటంతో… కోటంరెడ్డిని పిలిపించారు ముఖ్యమంత్రి జగన్. జనవరి రెండో తేదీన ముఖ్యమంత్రితో కోటంరెడ్డి దాదాపు గంట సేపు వన్ టు వన్ సమావేశం అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి నుంచి రాజకీయ అంశాల వరకు మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ సమావేశం తర్వాత కోటంరెడ్డి కూడా ముఖ్యమంత్రితో సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేశారు.
అయితే అప్పటికే కోటంరెడ్డి ఒక ఎజెండా ఫిక్స్ చేసుకుని ఉన్నారనీ, హైదరాబాద్ వెళ్లి చంద్రబాబుతో కలిశారనీ పార్టీ పెద్దలకు సమాచారం చేరిందట. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్పై పోటీ చేయనున్నట్లు కోటంరెడ్డి మాట్లాడిన ఆడియో టేపు లీక్ కావటంతో మరింత స్పష్టత వచ్చినట్లు అయ్యింది. దీంతో పార్టీ పెద్దలు కూడా కోటంరెడ్డి ఎపిసోడ్కు ఫుల్స్టాప్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారట. అందరికీ అవకాశాలు ఒకేసారి ఇవ్వటం సాధ్యం కాదనీ, పార్టీకి లాయల్గా ఉండటం అన్నింటికంటే ముఖ్యం అన్న మెసేజ్ పార్టీ ఇతర నేతలకు ఇవ్వాలనుకుంటుందట. ఇతర పార్టీలతో టచ్లో ఉండి… ఇక్కడ డబుల్ గేమ్ ఆడాలనుకునే నేతల విషయంలో పార్టీ హైకమాండ్ ఉపేక్షించదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే కోటంరెడ్డి వ్యవహారానికి తెరదించేయాలన్న నిర్ణయానికి అధికార వైసీపీ వచ్చేసిందనీ, అధికారిక ప్రకటన రావడమే తరువాయనీ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
తాజావార్తలు
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!