Off The Record: మంత్రి తానేటి వనితకు అసమ్మతి సెగ..! సొంత సామాజికవర్గం నేతలే దూరం..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తానేటి వనిత. ఏపీ హోంశాఖ మంత్రి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొవ్వూరు ఎమ్మెల్యే. సామాజిక సమీకరణాలు కలిసి రావడంతో 2019లోనే కేబినెట్లో చోటు దక్కించుకున్నారు వనిత. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో హోంశాఖను అప్పగించి పదోన్నతి కల్పించింది అధిష్ఠానం. రాజకీయ సోపానంలో అడుగులు ముందుకు పడుతున్నా.. సొంత నియోజకవర్గం కొవ్వూరులో మంత్రికి ఎదురీత తప్పడం లేదనే టాక్ వైసీపీ వర్గాల్లో ఉందట. నియోజకవర్గానికి మంత్రి వస్తే చాలు.. చాలా మంది పార్టీ నేతలు ముఖం చాటేస్తున్నారనేది వినికిడి. ముఖ్యంగా వనిత సామాజికవర్గానికి చెందిన నాయకులే మంత్రిపై అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Read Also: Off The Record: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతు ఎవరికి?
Also Read
కొవ్వూరు నియోజకవర్గం ఎన్నికల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండే సామాజికవర్గాల్లో కమ్మ, కాపు, మాదిగలు కీలకం. కమ్మ, కాపు సామాజికవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు ఇప్పటికే వనితకు దూరంగా జరిగారని.. ఇప్పుడు మాదిగ సామాజికవర్గం నేతలు అదే బాట పట్టారని చెబుతున్నారు. ఆ మధ్య ఓ సామాజికవర్గాన్ని తాడేపల్లికి పిలిచిన అధిష్ఠానం.. వచ్చే ఎన్నికల్లో కొవ్వూరులో తానేటి వనితే పోటీ చేస్తారని చెప్పిందట. ఆ సమయంలో అధిష్ఠానం నిర్ణయానికి అక్కడ తలాడించినా.. కొవ్వూరు చేరగానే సైలెంట్ అయ్యారట. ఈ విషయానికి బలం చేకూరుస్తున్నాయి కొవ్వూరు, చాగల్లు మండలాల్లో వనిత చేపట్టిన గడప గడప కార్యక్రమాలు. ఈ రెండు మండలాల్లో మంత్రి వస్తే.. అక్కడి ఎంపీపీలు, జడ్పీటీసీలు రాలేదట. అక్కడ సచివాలయ సిబ్బంది.. వాలంటీర్లు.. వివిధ ప్రభుత్వశాఖ అధికారుల సాయంతో కార్యక్రమాలు మమ అనిపిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Also: Off The Record: దుర్గగుడిలో చెల్లుబాటు కాని మంత్రి మాట..! మాజీ మంత్రిదే పెత్తనం..!
మంత్రి వనితపై సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేస్తుండటంతో సమస్య శ్రుతిమించుతోందనే వాదన అధికారపార్టీలో ఉందట. టీడీపీ నేతలతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని, ఉద్యోగుల పోస్టింగ్లు, బదిలీల్లో మంత్రి బంధువుల పాత్ర ఎక్కువగా ఉంటోందని కూడా ఆరోపిస్తున్నారు అసమ్మతి నాయకులు. కొవ్వూరు నియోజకవర్గంలో 44 గ్రామ పంచాయతీలు ఉంటే.. వాటిల్లో 33 చోట్ల వైసీపీలోని కమ్మ సామాజికవర్గం వారి చేతిల్లో ఉన్నాయి. మిగిలిన 11 చోట్ల కాపు సామాజికవర్గానిదే పైచెయ్యి. ఈ రెండు వర్గాలను మంత్రే పక్కన పెట్టారనేది అసమ్మతి నేతల ఆరోపణ. కాదూ.. వాళ్లే మంత్రికి దూరంగా జరిగేరనేది వనిత వర్గం వాదన. కొవ్వూరు మున్సిపాలిటీలో ఉన్న కొందరు వైసీపీ కౌన్సిలర్లూ మంత్రికి దూరం జరిగినట్టు టాక్. ఇక మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు సైతం వైసీపీని వీడే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాలతో కొవ్వూరులో మంత్రికి ఎదురీత తప్పదా..? సమస్యను గ్రహించి వనిత దిద్దుబాటు చర్యలు చేపడతారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!