Off The Record: కాళేశ్వరం కేసులో వారే బలిపశువులు కాబోతున్నారా..?
- ఇప్పటికి 113 మందిని ప్రశ్నించిన కాళేశ్వరం కమిషన్..
- ప్రస్తుతం రాజకీయ నాయకుల పాత్రపై విచారణ..
- వాంగ్మూలాలు ఇచ్చిన ఈటల, హరీష్రావు..
- బుధవారం హాజరవబోతున్న మాజీ సీఎం కేసీఆర్..
- టెక్నికల్ విషయాలతో మాకు సంబంధంలేదని ఇద్దరూ చెప్పారా?..
- అంతా ఇంజినీరింగ్ అధికారులే చేసినట్టు క్లారిటీ ఇచ్చేశారా?..
- కేసీఆర్ కూడా టెక్నికల్గా తెలియదని చెప్పేస్తారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ తాజా రాజకీయం మొత్తం… కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూనే తిరుగుతోంది. కుంగుబాటుపై కమిషన్ విచారణ చివరి దశకు వచ్చిన క్రమంలో… ఇప్పుడు పొలిటికల్ హాట్గా మారిపోయింది. ప్రాజెక్ట్ అనుమతులు, నిర్మాణం, సాంకేతిక వివరాలకు సంబంధించి ఇప్పటికే 113 మందిని విచారించి వివరాలు రాబట్టింది కమిషన్. అందులో అన్ని విభాగాలకు చెందిన వారు ఉన్నారు. ఐతే..ఇప్పుడు విచారణ దాదాపుగా పూర్తవుతున్న టైంలో… రాజకీయ నాయకుల పాత్ర మీద దృష్టి పెట్టింది విచారణ కమిషన్. అందులో భాగంగానే… నిర్మాణ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్రావు ఇప్పటికే విచారణకు హాజరై తమ వాంగ్మూలాలు ఇచ్చారు. ఇక ఫైనల్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంతు వచ్చింది. బుధవారం కమిషన్ ముందు హాజరవబోతున్నారాయన. ముందు అధికారుల్ని ప్రశ్నించినప్పుడు వాళ్ళంతా…అప్పుడున్న మంత్రులు, ముఖ్యమంత్రి పేరు చెప్పారట. అందుకే ఆ వాంగ్మూలాలను ఆధారం చేసుకుని రాజకీయ నాయకులకు నోటీసులు పంపి ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also: Minister Nara Lokesh: అర్థమైందా రాజా..? మంత్రి లోకేష్ కౌంటర్ ట్వీట్..
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
విచారణలో ప్రధానంగా ప్రాజెక్ట్ డిజైన్ మార్పు, నీటి నిల్వ, బిల్లుల మంజూరు లాంటి అంశాలపై ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. బ్యారేజ్లలో నీటిని ఎవరు నిల్వ చేయమన్నారని అంటే…దాంతో మాకేం సంబంధం.. అది ఇంజనీరింగ్ అధికారుల పని అని చెప్పేశారట హరీష్ రావు. అంతకు ముందు ఈటల రాజేందర్ కూడా టెక్నికల్ విషయాల్లో మాకు అవగాహన ఉండదు. ఆ వ్యవహారాలన్నిటిని అధికారులు చూసుకుంటారు కదా అని క్లారిటీగా చెప్పేసినట్టు తెలిసింది. దీంతో ఇక చివరిగా కేసీఆర్ కూడా ఇలాంటి సమాధానాలనే చెబుతుండవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఆయన కూడా పరిపాలనా వ్యవహారాలు తప్ప… సాంకేతిక విషయాలతో మాకేం సంబంధం అని అంటే మాత్రం… ఫైనల్గా అధికారులే ఇరుక్కుపోవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి తెలంగాణ రాజకీయవర్గాల్లో. ఇప్పటివరకు జరిగిన విచారణను నిశితంగా పరిశీలిస్తే… రాజకీయ నాయకులు సేఫ్గా తప్పించుకునే పనిలో ఉన్నట్టు అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. సాంకేతిక కారణాల పేరుతో వాళ్ళు అలా తప్పించుకోగలిగితే… చివరికి బలయ్యేది ఇంజినీర్లు, అధికారులే కదా… అన్న చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. అదే సమయంలో మరోరకమైన మాటలుకూడా వినిపిస్తున్నాయి.
Read Also: Health Tips: అవసరానికి మించి నడుస్తున్నారా?.. ఈ సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే!
ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణంలో… అసలు అధికారులు స్వేచ్ఛగా పని చేసుకునే వెసులుబాటు ఉందా..? మంత్రులు…ముఖ్యమంత్రులు ఆదేశిస్తే…. వాళ్ళకు నో అని చెప్పే సాహసం ఆఫీసర్స్ చేయగలుగుతారా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. అదే సమయంలో కొందరు అధికారులు కూడా… చట్టం అంటే వెరపు లేకుండా…రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేయడానికి ఎక్కువ అలవాటు పడ్డారని, తమకున్న పరిజ్ఞానం, వాస్తవాలతో సంబంధం లేకుండా జీ.. హుజూర్ అనడానికి అలవాటుపడటం వల్లే… వాళ్ళు ఎక్కువగా ఇరుక్కుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. కాళేశ్వరం కమిషన్లాంటి విచారణలు వచ్చినప్పుడు అధికారులు చిక్కుకుపోవడాని ఇదే ప్రధాన కారణమని అంటున్నారు. ఆఫీసర్స్ కూడా రూల్స్ను ప్రస్తావించి ఆ పేరుతో నాయకులు చెప్పిన పని చేయకుండా ఉంటే… మంచి పోస్టింగ్స్ రావని, లూప్లైన్ నుంచి తప్పించుకుని మెయిన్ స్ట్రీమ్కు రావాలంటే… పవర్లో ఉన్నవాళ్ళు చెప్పినట్టు వినాలని డిసైడ్ అవుతున్నారట. ఇలా… రకరకాల కారణాలతో అధికారులు, పాలకుల మధ్య బంధం బలపడి… చివరికి తేడా జరిగితే… ఆఫీసర్సే బలిపశువులు అవుతున్నారన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. అలాగే… మంత్రుల్లో కూడా మౌఖిక ఆదేశాలిచ్చేవాళ్ళే ఎక్కువ. లిఖిత పూర్వక ఆదేశాలిచ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని, అలాంటి విషయాల్లో తేడా జరిగితే… ఫైనల్గా సంతకాలు చేసిన అధికారులే ఇరుక్కుంటారని, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విచారణను చూస్తుంటే… అధికారులు బలయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. రాజకీయ నాయకులు మాత్రం సేఫ్జోన్లోనే ఉండవచ్చని అంటున్నారు. ఫైనల్గా ఎవరు ఇరుక్కుంటారో, ఎవరి మీద వేటు పడుతుందో చూడాలి మరి.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?