Off The Record: భూమా కుటుంబంలో ఏం జరుగుతుంది..?
- అఖిల, మౌనిక మధ్య ఆస్తి వివాదాలని ప్రచారం..
- అత్యంత అరుదుగా కలుస్తున్న కుటుంబాలు..
- గతంలో ఆళ్ళగడ్డ వచ్చినా అఖిలను కలవని మౌనిక దంపతులు..
- సంబంధాలు సరిగా లేవన్న ప్రచారం..
- మంచు ఫ్యామిలీ విభేదాలకు మౌనిక కారణమన్న మోహన్బాబు..
- శోభా నాగిరెడ్డి జయంతి కార్యక్రమానికి మనోజ్ దంపతులు..
- రెండు కుటుంబాలు కలిసి భోజనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: మంచు మనోజ్ , మౌనిక ఆళ్లగడ్డ ఎంట్రీ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పెళ్ళి తర్వాత వారిద్దరూ ఇక్కడికి రావడం కొత్తేమీ కాకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చర్చనీయాంశం అవుతోంది. భూమా శోభానాగిరెడ్డి జయంతి సందర్భంగా తల్లి దండ్రులకు నివాళులు అర్పించేందుకు వచ్చారు మౌనిక దంపతులు. అయితే అదొక్కటే రీజన్ కాదని, అంతకు మించిన కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు. అక్క అఖిల ప్రియ, మౌనిక మధ్య ఆస్తి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అక్కచెల్లెళ్ళ కుటుంబాలు అత్యంత అరుదుగా మాత్రమే కలుస్తుండటం అందుకు బలం చేకూరుస్తోందని అంటున్నారు పరిశీలకులు. గతంలో మనోజ్, మౌనిక ఆళ్లగడ్డకు వచ్చి భూమా ఘాట్ లో నివాళులు అర్పించి భూమా అఖిలప్రియను కలవకుండానే వెళ్లిపోయారు. దీంతో అక్క చెల్లెళ్ళ మధ్య సంబంధాలు సరిగా లేవన్న ప్రచారం ఊపందుకుంది. ఇక మనోజ్తో మౌనిక పెళ్ళి తర్వాత ఆళ్ళగడ్డకు రావడమే తక్కువైందట. అసెంబ్లీ ఎన్నికల్లో భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసినా… చెల్లిగా మౌనిక ప్రచారం కూడా చేయలేదు. తల్లిదండ్రుల వర్ధంతి, జయంతి కార్యక్రమాలకు మినహా సొంతూరికి వెళ్ళడం మానేశారట ఆమె. ఈ పరిణామాలన్నిటినీ కలగలిపి చూస్తున్న వారు మాత్రం… అఖిల, మౌనిక మధ్య సఖ్యత లేదన్న ప్రచారాన్ని మొదలుపెట్టేశారు.
Read Also: Children’s Health: చలికాలంలో పిల్లల ఆరోగ్యం పదిలం.. ఈ జాగ్రత్తలు పాటించండి
Also Read
ఇక తాజాగా నటుడు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు వీధికెక్కడం, గొడవలకు కారణం మౌనిక అంటూ మోహన్బాబు ఆడియో విడుదల చేయడం వంటి పరిణామ క్రమంలో… శోభ జయంతికి మౌనిక, మనోజ్ దంపతులు రావడంతో సర్వత్రా ఆసక్తి పెరిగింది. పిల్లలు, తమ సన్నిహితులతో కలిసి హైద్రాబాద్ నుంచి 16 వాహనాల్లో ఆళ్ళగడ్డ వచ్చారు మంచు మనోజ్, మౌనిక. భూమా ఘాట్లో నివాళులు అర్పించాక నేరుగా ఇంటికి వెళ్లారు. ఎమ్మెల్యే అఖిల అధికారిక కార్యక్రమాల్లో ఉండడంతో మౌనిక ఇంటికి వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చారామె. రెండు కుటుంబాలు కలిసే భోజనం చేశాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా అక్క చెల్లెళ్ళ కుటుంబాలు గంటల తరబడి కలిసి ఉండటం ఇటు రాజకీయంగా హాట్ సబ్జెక్ట్ అయింది. వారిమధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయనే విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అక్క చెల్లెళ్ళ ఆస్తి వివాదాల గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మౌనిక సంతకాలను ఫోర్జరీ చేశారన్నది ఆ ప్రచారంలోనే ఒక వెర్షన్.
Read Also: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఎల్లుండి నుంచి మార్చి నెల కోటా టికెట్ల విడుదల.. ఏ రోజు ఏవంటే..?
ఈ ప్రచారం, ప్రస్తుతం తామున్న పరిస్థితుల్లో మనోజ్, మౌనిక దంపతులు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకే ఇంటికి వెళ్ళి ఉండవచ్చంటున్నారు కొందరు. వాళ్ళు వెళ్ళకుండా ఉంటే రచ్చ ఓ రేంజ్లో జరిగేదని, అందుకు భిన్నంగా రెండు కుటుంబాలు కలవడంతో… ఆస్తి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోబోతున్నారన్న అంచనాలు పెరుగుతున్నాయి. అంతా కలిసి అంతసేపు ఆ మేటర్ మీదే మాట్లాడుకుని ఉంటారా అని కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు విశ్లేషించేస్తున్నారు. మరోవైపు మనోజ్, మౌనిక దంపతులు జనసేనలో చేరతారన్న ప్రచారం కూడా ఉంది. ఇవాళ మంచు మనోజ్ మీడియాతో మాట్లాడతారని , మోహన్ బాబు కుటుంబంలోని గొడవల మీద, తాము జనసేనలో చేరే అంశం మీద క్లారిటీ ఇస్తారని భావించారు. కానీ… ఇప్పుడున్న పరిస్థితుల్లో… మీడియాతో మాట్లాడకపోవడమే మంచిదన్న అఖిలప్రియ సలహాతోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద కారణాలు ఏవైనా… అక్క చెల్లెళ్ళ మధ్య సఖ్యత కుదిరితే… అదే పదివేలంటున్నారు భూమా కుటుంబ అభిమానులు.
తాజావార్తలు
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?