Off The Record: ఏపీ బీజేపీ నేతల్లో ఉన్నట్టుండి నైరాశ్యం..?
- ఏపీ బీజేపీ నేతల్లో ఉన్నట్టుండి నైరాశ్యం..
- పదవుల పంపకం విషయంలో అసంతృప్తులు?..
- నోరు మెదపడం లేదు, నో ఢిల్లీ టూర్స్..
- రాష్ట్ర అధ్యక్ష రేస్లో ఉన్నవాళ్ళు సైతం సైలెంట్..
- ఇక నోరెత్తకూడదని కొందరు ఫిక్స్ అయ్యారా?..
- సైలెంట్గా ఉంటేనే పదవులు వస్తాయని అనుకుంటున్నారా?..
- ప్రభుత్వంలో మైనర్ భాగస్వామ్యం అన్న సంగతి గుర్తొచ్చిందా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: రాష్ట్రంలో తాము భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక…. ఏపీ బీజేపీ నాయకుల్లో ఆశలు మోసులెత్తాయి. ఇక పదవుల జాతరేననుకుంటూ చాలా మంది మురిసిపోయారట. కానీ… టైం గడిచేకొద్దీ… తత్వం బోధపడుతూ… ఆ ఏముందిలే అనే స్థాయికి వస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. తమ కోటాలో పదవులు దక్కడం సంగతి అలా ఉంచితే… వచ్చిన వాటిని ఇస్తున్న తీరు చూసి కూడా కొందరు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది నోరు మెదపడం లేదని చెప్పుకుంటున్నారు. మాకో ఛాన్స్ అంటూ ఇన్నాళ్ళు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన వాళ్ళు కూడా… ఇప్పుడు ఎందుకు… ఫ్లైట్ టిక్కెట్ డబ్బులు దండగ అనుకుంటున్నట్టు సమాచారం.
Read Also: Veeraiah Chowdary Incident: టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసును ఛేదించిన పోలీసులు.
Also Read
గతంలో పదవులు అనుభవించిన జీవీఎల్, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారు, రాష్ట్ర అధ్యక్ష పదవి రేస్లో మేము సైతం అంటూ ప్లకార్డులు పట్టుకుని తిరిగిన వాళ్ళంతా ఒక్కసారిగా మూగనోము పట్టడంతో… అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్లో. ఎందుకలా అంటే…. ఏ పదవి ఎప్పుడు, ఎవర్ని వరిస్తుందో అర్ధంకాని పరిస్థితే అందుకు కారణం అన్నది మరో విశ్లేషణ. సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ, పాకా సత్యనారాయణకు రాజ్యసభ సీటు ఇవ్వడం చూశాక ఇక ఎవ్వరూ నోరెత్తకూడదని డిసైడైనట్టు చెప్పుకుంటున్నారు. మనక్కూడా ఒక ఛాన్స్ రావాలంటే నోరు మూసుకుని కూర్చోవడమే ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ బీజేపీ సీనియర్స్…. అదే మెయిన్టెయిన్ చేస్తున్నట్టు సమాచారం. అలాగే… ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ…, ఆ షేర్ లెక్కలో లేనిది కావడమే ఈ సైలెన్స్కు మరో కారణం అన్న చర్చ కూడా ఉంది. మొత్తం మీద ఎప్పుడూ ఏదో ఒక స్టేట్మెంట్తో పొలిటికల్ హీట్ పెంచే నేతలు సైతం ఉన్నట్టుండి మౌన వ్రతం పాటించడం మాత్రం ఏపీ బీజేపీలో చర్చనీయాంశంగా ఉంది. ఈ సైలెన్స్కు తగిన ప్రతిఫలం దక్కుతుందో, లేక మనోళ్ళు కామ్గానే ఉన్నారు కదా… లెట్ దెమ్ ఎంజాయ్ అని పార్టీ పెద్దలు అనుకుంటారో చూడాలి మరి.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!