Off The Record: తెనాలిలో ఆలపాటి వర్సెస్ నాదెండ్ల
- తెనాలిలో ఆలపాటి వర్సెస్ నాదెండ్ల..
- అప్పట్లో టిక్కెట్ కోసం ఇద్దరు పోటీ..
- పట్టు తగ్గకుండా ఇద్దరి జాగ్రత్తలు, పొలిటికల్ హీట్..
- పైకి కలిసి బిల్డప్లు, లోలోపల కత్తులు దూసుకోవడాలు..
- గతంలో టీడీపీ మహిళా నేతల ఫిర్యాదులు పట్టించుకోలేదన్న విమర్శలు..
- తాజాగా ఆలపాటి ఫ్లెక్సీల విషయంలో రెండు వర్గాల ఘర్షణ..
- వివాదం వెనక మంత్రి మనోహర్ ఉన్నారంటున్న టీడీపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విబేధాలు కాక రేపుతున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన నేత నాదెండ్ల మనోహర్ తీవ్రంగా పోటీపడ్డారు. అప్పట్లో తీవ్ర ఉత్కంఠ రేపిన ఆ వ్యవహారం చాలా రోజులు నడిచింది. ఫైనల్గా జనసేన కోటాలోకి వెళ్ళడం, నాదెండ్ల మనోహర్ గెలిచి మంత్రి అవడం వరుస పరిణామాలు. అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం ఆలపాటి రాజాను ఎమ్మెల్సీ చేసింది టీడీపీ అధిష్టానం. ఇద్దరూ రాజ్యాంగ పదవుల్లోకి వచ్చాక కూడా కీచులాటలు ఇంకా నడుస్తూనే ఉన్నాయట. రెండు పార్టీలు పొత్తులో ఉన్నా… తెనాలి మీద పట్టు కోసం ఇద్దరూ ప్రయత్నిస్తుండటం ఎప్పటికప్పుడు హీట్ పెంచుతోంది. ఎలాంటి విబేధాలు లేవన్నట్టు పైకి బిల్డప్లు ఇస్తూనే…. లోలోపల మాత్రం కత్తులు దూసుకుంటున్నారట. రెగ్యులర్గా ఎవరికి వారే తెనాలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ… కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చినప్పుడు మాత్రమే కలిసి కనిపిస్తున్నారు. గతంలో స్థానిక వాసవి కన్యకాపరమేశ్వరి ట్రస్టు బోర్డు కమిటీ వ్యవహారంలో ఇద్దరు నేతల మధ్య పోరు నడిచింది. చెరో వర్గానికి సపోర్ట్ చేయడం అప్పుడు తీవ్ర వివాదానికి కారణం అయింది.
వైసీపీ హయాంలో టీడీపీ మహిళా నేతలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు కొంతమంది. దీనిపై అప్పట్లో టీడీపీ మహిళా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా మరోసారి కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. మహిళా నేతలు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే… పోలీసులు పట్టించుకోకపోవడానికి మంత్రి నాదెండ్ల మనోహరే కారణమన్న అనుమానాలు ఉన్నాయట టీడీపీ లీడర్స్కు. తాజాగా తెనాలి వహాబ్ సెంటర్ లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఫ్లెక్సీలను డివైడర్ మధ్యలో ఏర్పాటు చేశారు. సడన్గా మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి వాటిని తొలగించేందుకు ప్రయత్నించడం వివాదానికి కారణం అయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు, మున్సిపల్ అధికారులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఫ్లెక్సీలను తొలగించాలని ప్రయత్నించడం వెనుక మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారన్నది టీడీపీ నేతల అభియోగం. ఎన్నికల్లో ఎన్నో కష్టాలు పడి కూటమి అభ్యర్దిని గెలిపించడానికి కృషి చేశామని తీరా… ఇప్పుడిలా చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు తెనాలి తమ్ముళ్ళు. టీడీపీని చులకన చేసే పనులు మానుకోవాలని అంటున్నారు.ఇలా ఇద్దరి నేతల మధ్య విబేధాలు మరోసారి ఫ్లెక్సీల తొలగింపుతో బయటపడ్డాయి. ఇద్దరూ ఆయా పార్టీల్లో కీలకమైన వాళ్ళే కావడంతో విబేధాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయోనన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది తెనాలి కూటమి కేడర్లో.
Also Read
తాజావార్తలు
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
JCB Hydrogen Car: బుల్డోజర్ల తయారీ సంస్థ JCB వరల్డ్ రికార్డు.. హైడ్రోజన్ కారుతో గంటకు 653.90KM స్పీడ్!
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
-
Shehbaz Sharif: భారత్పై షాబాజ్ షరీఫ్ ఫైర్.. ప్రతి నీటి చుక్కా రెడ్ లైన్..! ఆపరేషన్ సింధూర్ను మరిచిపోలేదా?
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
ట్రెండింగ్
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!