Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Off The Record About Adilabad Congress Leaders Complain To Meenakshi Natarajan

Off The Record: కొత్త ఇంఛార్జ్‌కి ఆ కాంగ్రెస్‌ నేతపై మూకుమ్మడిగా ఫిర్యాదులు..?

Published Date :March 6, 2025 , 10:15 pm
By Sudhakar Ravula
  • మీనాక్షి నటరాజన్‌ ముందు ఓపెనైపోయిన ఆదిలాబాద్‌ నేతలు..
  • గ్రూప్‌ వార్‌కు ఒక నాయకుడు కారణం అని ఫిర్యాదులు..
  • గట్టిగా అడిగాక సత్తు మల్లేష్‌ పేరు ప్రస్తావన..
  • కులాల వారీగా విభజిస్తున్నాడని ఫిర్యాదులు..
Off The Record: కొత్త ఇంఛార్జ్‌కి ఆ కాంగ్రెస్‌ నేతపై మూకుమ్మడిగా ఫిర్యాదులు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో కయ్యం ముదురుతోందట. తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ సమక్షంలో మీటింగ్‌ గరగరంగా సాగినట్టు తెలిసింది.నేతల వ్యవహార శైలిపై ఫిర్యాదుల వెల్లువలా వచ్చినట్టు తెలిసింది.ఆమె ముందే పరస్పరం కౌంటర్స్‌ వేసుకున్నారట నాయకులు. పక్క జిల్లాకు చెందిన నేత ఒకరు పార్టీని కులాల వారిగా విభజిస్తున్నారని, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చీలిపోవడం ,గ్రూప్ లుగా మారడానికి సదరు నేతే కారణమని ముందు పేరు చెప్పకుండా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అందుకు స్పందించిన నటరాజన్ ఆ నేత ఎవరో పేరు చెప్పమని గట్టిగా అడగడంతో.. కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకుడు సత్తు మల్లేష్ పేరును ప్రస్తావించినట్టు తెలిసింది. అందుకు పీసీసీ చీఫ్ స్పందించి అలాంటి నేతలపై విచారణ జరిపి జిల్లాలో అడుగుపెట్టనీయకుండా చేస్తామని హామీ ఇచ్చారట.

కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి ఆదిలాబాద్ ,నిర్మల్ ,కొమురం భీం జిల్లాల్లో పెత్తనం చేలాయించడమే కాకుండా పార్టీ ఫండ్ పంపకాలు,అధికారుల బదిలీల్లో సైతం కీరోల్ పోషిస్తున్నారని ఇన్ఛార్జ్‌ దృష్టికి తెచ్చారట ఆదిలాబాద్‌ నేతలు. దాంతో పాటు ఒక్కొక్కరు ఒక్కో రకమైన ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. పాత వారికి ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించడంలేదు. ఒక్కరిద్దరు వ్యక్తుల వల్ల ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని మీనాక్షి దృష్టికి తీసుకెళ్ళారట. జిల్లాకు సంబంధం లేని నాయకుడు ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని విభజిస్తున్నారని, ఫలానా కులం ఉండకుండా చేయాలని వ్యాఖ్యానించమే కాకుండా ఇంచార్జ్‌ మంత్రిని సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారట.పైగా పార్టీని అడ్డం పెట్టుకుని సొంత వ్యాపారాలు చేసుకుంటున్నాడంటూ సదరు నేత మీద ఫిర్యాదు చేశారట ఆదిలాబాద్‌ నాయకులు. పార్టీ ఎందుకు మారామా అని ఇప్పుడు బాధగా ఉందని ఓ మాజీ ఎమ్మెల్యే అన్నట్టు సమాచారం. కార్యక్రమాలకు సంబంధించి ఎవ్వరు సమాచారం ఇవ్వడంలేదు. సమన్వయ లోపం ఎక్కువగా ఉందని మరి కొంతమంది చెప్పుకొచ్చారట. ప్రస్తుతం పార్టీ పరిస్థితి సరిగాలేదు.. ప్రజల్లో అసంతృప్తి ఉందని, స్థానిక సంస్థల్లో గెలవాలంటే రుణమాఫీ, రైతు భరోసాను పూర్తిగా చేయాలని ఓ సీనియర్ నేత రాష్ట్ర ముఖ్యనేతలతో చెప్పారట.

అంతా శ్రద్ధగా విన్న మీనాక్షి నటరాజన్‌.. గ్రూప్స్‌ వద్దు, కో ఆర్డినేషన్‌ కోసం ఓ కమిటీ వేస్తాం, పార్టీ అంతర్గత విషయాలు బయటకెళ్ళవద్దని హెచ్చరించినట్టు సమాచారం. ఇదంతా గమనించిన జిల్లా ఇన్ఛార్జ్‌ మంత్రి సీతక్క సైతం నియోజకవర్గ ఇన్ఛార్జ్‌ల పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇలా చేస్తే తాను ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్‌ మంత్రి హోదానుంచి తప్పుకుంటానని, సీఎం తో చెప్పి ఓ నిర్ణయానికొస్తాని చెప్పినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందునుంచే జిల్లాలో పాగా వేసిన నాయకుడు పార్లమెంట్ ఎన్నికలు, ఆతర్వాత ఏ కార్యక్రమం లేదా పెద్ద సభలు సమావేశాలు నిర్వహించినా పెత్తనం చెలాయిస్తున్నారట. స్థఆనిక నాయకులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో పెద్దనేతల అండ ఉందని ఇన్నాళ్ళు చెప్పుకోవడంతో ఎవరూ ప్రశ్నించలేకపోయారని, ఇప్పుడు స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ జోక్యం చేసుకునేసరికి అంతా ఓపెన్‌ అయిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలంటున్నారు పరిశీలకులు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adilabad
  • congress
  • Meenakshi Natarajan
  • off the record
  • telangana

తాజావార్తలు

  • Israel: ట్రంప్ మాటల్ని లెక్కచేయని నెతన్యాహూ..

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • Kitchen Tips : బెండకాయ కోస్తున్నప్పుడు జిగురు అంటకుండా ఈ స్మార్ట్ టిప్స్ మీ కోసమే.!

  • Municipal Elections: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మున్సిపల్ ఎన్నికలకు అంతా సిద్ధం.. ముహూర్తం అప్పుడే.

  • Sunil Narine-IPL: అల్లాటప్పా బ్యాటర్లను కాదు, టాప్ దిగ్గజాలనే సుస్సు పోయించాడు.. నరైన్‌తో మాములుగా ఉండదు!

ట్రెండింగ్‌

  • Egg 65 Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘ఎగ్ 65’.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా.!

  • కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Nothing నుంచి సర్ప్రైజ్.. ట్రిపుల్ కెమెరా, మెటల్ ఫ్రేమ్ తో రాబోతున్న CMF Phone 3 Pro..!

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions