Off The Record: ఒక్క ఓటమితోనే ఆ మాజీ ఎమ్మెల్యేకి మైండ్ బ్లాంక్ అయ్యిందా..?
- గత ఎన్నికల్లో అచ్చంపేటలో ఓటమి..
- పవర్ ఉన్నప్పుడు నియంతలా వ్యవహరించారన్న ఆరోపణలు..
- ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నం, నో చెప్పిన కేసీఆర్..
- హర్ట్ అయి నియోజకవర్గానికి, పార్టీకి దూరం?..
- హైదరాబాద్కే పరిమితం అయిన గువ్వల బాలరాజు..
- ద్వితీయశ్రేణి నేతల ఫోన్స్ సైతం తీయని పరిస్థితి..
- గువ్వల బాలరాజు కాంగ్రెస్కు టచ్లోకి వెళ్తున్నారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: 2014 నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజును గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు అచ్చంపేట ఓటర్లు . నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న గువ్వల.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంగబలం, అర్దబలంతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా కనుసన్నల్లో పెట్టుకుని నియోజకవర్గంలో నియంతలా వ్యవహరించారన్న అభిప్రాయం ఉంది. పదేళ్లు తానాడిందే ఆట పాడిందే పాటగా సాగిన గువ్వల వ్యవహారాలతో విసిగిపోయిన ఓటర్లు టైం చూసి వాత పెట్టారని ఇప్పటికీ చెప్పుకుంటారు అచ్చంపేటలో. అధికారం శాశ్వతం అన్నట్లుగా నాడు వ్యవహరించిన తీరే…ఓటమి ప్రధాన కారణమన్న అభిప్రాయం ఉంది. అదంతా గతం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడాక…. లోక్సభ ఎలక్షన్స్లో ఎంపీ టిక్కెట్ దక్కించుకుని… ఏకంగా ఢిల్లీలో పాగా వేద్దామనుకున్నారట ఆయన. అందుకు కేసీఆర్ నో చెప్పడంతో…. డీప్గా హర్ట్ అయిన గువ్వల ఇటు తనను ఓడించిన అచ్చంపేట ప్రజలకు, అటు ఎంపీ టిక్కెట్ ఇవ్వని పార్టీ అధిష్టానానికి ముఖం చాటేశారన్నది లోకల్ టాక్.
జిల్లా అధ్యక్షుడి హోదాలో పార్టీని ముందుండి నడిపించాల్సిందిపోయి…హైదరాబాద్ కే పరిమితమైనట్టు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ముఖ్యంగా మొయినాబాద్ ఫాం హౌస్… ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ తర్వాత ఆకాశంలో విహరించిన గువ్వల బాలరాజు.. తాను కేసీఆర్ వదిలిన బాణాన్ని అంటూ చెలరేగిపోయారు. ఒకానొక దశలో గులాబీ దళంలో నేనే ప్రముఖుడిని అంటూ ఓ రేంజ్లో ప్రచారం చేసుకున్నారాయన. కానీ ఎమ్మెల్యేగా ఓటమి, ఎంపీ టిక్కెట్టు దక్కకపోవడంతో తత్వం బోధపడి వాస్తవంలోకి వచ్చారని, తీవ్ర నిరాశకు గురయ్యారని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ అజ్ఞాతంలోకి వెళ్ళి చివరికి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఫోన్లు చేస్తే కూడా పెద్దగా రెస్పాండ్ అవడంలేదన్నది అచ్చంపేట టాక్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చుట్టపుచూపుగా వచ్చిపోతున్న గువ్వల తీరు చూసి… ఆయన కాంగ్రెస్ దిశగా అడుగులేస్తున్నారని అనుకుంటున్నారట బీఆర్ఎస్ కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు. అధికార పార్టీలో ఉంటే పనులు కావడంతో పాటు, స్థానిక ఎన్నికల్లో పట్టు బిగించే అవకాశం ఎక్కువన్న ఉద్దేశ్యంతో అటు టచ్లోకి వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
Also Read
ఇక అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగా ఒక్క ఓటమితోనే అచ్చంపేటలో అడుగు పెట్టలేని దుస్థితి దాపురించిందని కూడా మాట్లాడుకుంటున్నారు నియోజకవర్గంలో. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో… క్షేత్ర స్థాయిలో గట్టిగా ఫైట్ చేయాల్సిన పరిస్థితుల్లో తమ నాయకుడు ముఖం చాటేయడం ఏంటో అర్ధం కావడం లేదంటూ నైరాశ్యంలో ఉందట అచ్చంపేట గులాబీ కేడర్. ఒకవైపు బాలరాజు పట్టింపులేని తనం, మరోవైపు ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం కలగలిసి గులాబీ కేడర్లో గందరగోళాన్ని పెంచుతున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయోనన్న చర్చ జరుగుతోంది. మొత్తం మీద మాజీ ఎమ్మెల్యే వ్యవహారశైలి మాత్రం టాక్ ఆఫ్ ది అచ్చంపేట అయింది. ఆయన తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!