Rajole YCP: రాజోలు వైసీపీలో రచ్చ.. బొంతు వర్సెస్ రాపాక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోనసీమ జిల్లా రాజోలు వైసీపీలో మళ్ళీ రచ్చ మొదలైంది. రాజోలు వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. బొంతు రాజేశ్వరరావు ప్రస్తుతం వైసీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అనుచరులతో జరిగిన సమావేశంలో బొంతు రాజేశ్వరరావు మాటలు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి.
రెండు రోజుల క్రితమే బొంతు రాజేశ్వరరావు ఇంటికెళ్లి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు వైసీపీ ప్లీనరీ సమావేశానికి ఆహ్వానించారు. అయితే ఇప్పటికే పార్టీ అధిష్టానానికి రాజీనామా సమర్పించిన బొంతు ప్లీనరీకి వెళ్ళొద్దని తన అనుచరులకు బొంతు తేల్చి చెప్పారట. ఈ అంశం ఇప్పుడు రాజోలు వైసీపీ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
Read Also: OTR: దర్శి టీడీపీలో కొత్తగా దుబాయ్ గోల.. పోయేదెపుడు?
బొంతు రాజేశ్వరరావు 2014, 2019లో రాజోలు వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. జనసేన అభ్యర్ధి రాపాకపై సుమారు 700 ఓట్ల తేడాతోనే బొంతు ఓడిపోయాక కొద్దిరోజుల్లోనే రాపాక జనసేన నుంచి వైసీపీకి జంప్ అయ్యారు. ఆ తర్వాత బొంతు రాజేశ్వరరావును వైసీపీ కో ఆర్డినేటర్, నియోజకవర్గ ఇంఛార్జ్ పదవుల నుండి అధిష్టానం తొలగించి, రాజోలు వైసీపీ కో ఆర్డినేటర్గా పెద్దపాటి అమ్మాజీకి బాధ్యతలు అప్పగించింది. కానీ, ఆమెకు బొంతు సహకరించలేదనే టాక్ ఉంది. అదే సమయంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు అధిష్ఠానం రాజోలు నియోజకవర్గ వైసీపీ బాధ్యతలు అప్పగించింది. రాపాకకు బాధ్యతలు అప్పగించడం బొంతు రాజేశ్వరరావులో అసంతృప్తిని పెంచింది.
ఇరిగేషన్లో ఇంజినీర్ ఇన్ ఛీఫ్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు బొంతు రాజేశ్వరరావు. అయితే అనూహ్యంగా వరుస పరాజయాలతో పార్టీలో ఇరకాటంలో పడిన బొంతు రాజేశ్వర్రావుకు వచ్చే ఎన్నికల్లో రాజోలు వైసీపీ టికెట్ వస్తుందనే గ్యారంటీ లేదనే టాక్ ఉంది. ఈ సమయంలో పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న బొంతు రాజేశ్వర్రావు, రాజీనామా పత్రాన్ని అధిష్ఠానానికి పంపారు. కానీ లేఖ పంపి 10 రోజులు గడిచినా అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాజోలు నుండి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేదా మరో పార్టీలో చేరతారా లేక వైసీపీలోనే కొనసాగుతారా అనే అంశంలో ఆయన డైలమాలో ఉన్నారనే టాక్ నడుస్తోంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!