పసుపు పార్టీలో కొత్త పంచాయితీ మొదలైందా..?
పెద్దాపురంలో టీడీపీ తరపున వరసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు నిమ్మకాయల చినరాజప్ప. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో హోంమంత్రిగా పనిచేశారాయ. చినరాజప్ప సొంతూరు అమలాపురంలో ఉంటుంది. అయితే అది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ కావడంతో… 2014 ఎన్నికల్లో తొలిసారి పెద్దాపురం బరిలో నిలిచారు. ఇదే స్థానం నుంచి 1994,1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బొడ్డు భాస్కర రామారావు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బొడ్డు ఫామిలీ సైకిల్ దిగి ఫ్యాన్ కిందకి చేరిపోయింది. 2014 ఎన్నికల్లో బొడ్డు భాస్కర రామారావు తనయుడు బొడ్డు వెంకట రమణ రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
2014 ఎన్నికల తర్వాత బొడ్డు ఫ్యామిలీ వైసీపీకి దూరమైంది. భాస్కర రామారావు టీడీపీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో హోంమంత్రిగా ఉన్న చినరాజప్ప బొడ్డు రాకను వ్యతిరేకించారు. తన సీటుకు ఎక్కడ ఎసరొస్తుందో అని అధినేత దగ్గర ఆయన అన్ని అస్త్రాలు ఉపయోగించారు. ఇలా పార్టీని కాదని వెళ్లిన వారిని తిరిగి చేర్చుకోవడం వల్ల కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని చినరాజప్ప చెప్పినప్పటికీ బొడ్డు రీఎంట్రీకే బాబు మొగ్గు చూపారు. గత ఏడాది భాస్కర రామారావు చనిపోయారు. తండ్రి తర్వాత యాక్టివ్ రోల్ పోషించాలని చూస్తోన్న ఆయన తనయుడు వెంకట రమణ టీడీపీ కండువా కప్పుకోవడానికి ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నారట. మరోసారి చినరాజప్ప అడ్డుకున్నట్టు సమాచారం.
Also Read
వెంకట రమణ ఎంట్రీని చిన రాజప్ప వ్యతిరేకించడంతో.. ఆయన తమ కుటుంబంతో ముందు నుంచి సన్నిహితంగా ఉంటోన్న యనమల ద్వారా నరుక్కొచ్చారట. చంద్రబాబు దగ్గర ఆమోద ముద్ర వేయించారట. ఈ విషయం తెలిసి అవాక్కయ్యారట చినరాజప్ప. గత ప్రభుత్వంలో జిల్లా నుంచి యనమల, చినరాజప్పలు మంత్రులుగా ఉన్నారు. ఆ సమయంలోనూ ఎవరి వర్గం వారిదే. నోటితో నవ్వుకుంటూ నొసటితో వెక్కిరించుకునేవారు. బొడ్డు వెంకట రమణ చేరికలో యనమల పైచెయ్యి సాధించడంతో చినరాజప్ప పూర్తిగా డీలా పడ్డారట.
ఈ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ ఉంది. బొడ్డు వెంకట రమణ చౌదరిని తన దగ్గరకు తీసుకురావాలని చినరాజప్పకు చంద్రబాబుతో చెప్పించారట యనమల. ముందు ససేమిరా అన్నప్పటికీ బాస్ చెప్పడంతో తప్పలేదట. స్వయంగా ఆయన్ను వెంటబెట్టుకుని అధినేత దగ్గరకి తీసుకెళ్లారు. దగ్గరుండి పసుపు కండువా కప్పించారు. అయితే కష్టకాలంలో పార్టీని, కేడర్ను వదిలి వెళ్లిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా అని నొచ్చుకున్నారట రాజప్ప. అలాగే పెద్దాపురంలో యనమల పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారట. ఇదే విధంగా తాను తునిలో వేలు పెడితే ఉరుకుంటారా అని చినరాజప్ప ఫైర్ అవుతున్నారట. మొత్తానికి తాజా చేరికలు పెద్దపురం టీడీపీలో పెద్ద పంచాయితీనే తీసుకొచ్చాయి. రానున్న రోజుల్లో రాజకీయం ఆసక్తిగా మారుతుందని చర్చ సాగుతుంది. మరి ఎవరికి ఎవరు పెద్దాపురంలో చెక్ పెడతారో.. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
-
Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?
-
Dwcra Group: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. 22 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!