వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్లో వర్గపోరులో కొత్త పోకడలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక ఎమ్మెల్సీ.. ఇద్దరు ఎమ్మెల్యేలు. అంతా ఒకే పార్టీ. సంస్థాగత కమిటీల కూర్పులో కలిసి సాగుతున్నారా అంటే.. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్..! అనుచరులను అందలం ఎక్కించేందుకు ఏకంగా బలప్రదర్శన మొదలెట్టేసి.. గులాబీ శిబిరంలో గుబులు రేపుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏంటా కథా?
వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్లో వర్గపోరులో కొత్త పోకడలు..!
Also Read
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- OTR : సంగారెడ్డి బీజేపీలో పెరుగుతున్న గ్రూప్ వార్.. చినికి చినికి గాలి వానలా మారుతున్నా వివాదాలు
- OTR : అక్కడ టిడిపి గట్టిగా మైండ్ గేమ్ ఆడిందా.. వైసీపీ లీడర్స్ కూడా ఆ ట్రాప్ లో పడిపోయారా?
- Off The Record : కామారెడ్డి మున్సిపాలిటీలో రచ్చ రంబోలా.. ఎమ్మెల్యే vs చైర్ పర్సన్ వివాదం
ఏదైనా పదవొచ్చినా.. పెద్ద నాయకుడు పార్టీలో చేరినా.. ఈ స్థాయిలో టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర సందడి కామన్. కానీ.. ఒక జిల్లా అధ్యక్ష పదవి కోసం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ శ్రేణుల బలప్రదర్శన ఇది. ఈ శక్తి ప్రదర్శన మూలాలు సిటీకి ఆనుకుని ఉండే వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ఒకరికి.. ఎమ్మెల్యేలు రోహిత్రెడ్డి, మెతుకు ఆనంద్లు మరొకరికి మద్దతుగా నిలవడంతో ఆ ప్రకంపనలు ఇలా హైదరాబాద్లోని పార్టీ ఆఫీస్ వరకు వచ్చాయి.
నరసింహారెడ్డికి తాండూరు, వికారాబాద్ ఎమ్మెల్యేల మద్దతు?
కొండల్రెడ్డికి మాజీమంత్రి పట్నం మహేందర్రెడ్డి అండ?
టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్ష పదవికి పార్టీ నేతలు నరసింహారెడ్డి, కొండల్ రెడ్డిలు పోటీపడుతున్నారు. వీరిద్దరూ తమకున్న పరిచయాల ద్వారా లాబీయింగ్ చేసుకుంటే స్థానికంగానే చర్చ జరిగేది. కానీ.. నరసింహారెడ్డి, కొండల్రెడ్డిల వెనక పెద్ద నాయకులే ఉండటంతో రచ్చ రచ్చ అవుతోంది. నరసింహారెడ్డికి వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మద్దతుగా ఉన్నారట. ఇక కొండల్రెడ్డికి మాజీ మంత్రి పట్నం మహేందర్రెడ్డి సాయం పడుతున్నట్టు సమాచారం. అనుచరుడిని టీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిని చేసేందుకు ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. అస్సలు వెనక్కి తగ్గకుండా.. అవకాశం చిక్కితే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని.. మందీమార్బలంతో శక్తిని చాటుతున్నారు నాయకులు.
తెలంగాణ భవన్లో నేతల బలప్రదర్శన..!
తన బలం వికారాబాద్కే పరిమితమైతే బాగోదని అనుకున్నారో ఏమో.. నరసింహారెడ్డి ప్రెజర్ పాలిటిక్స్ను హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు. ఇతర పార్టీ కార్యకర్తలను టీఆర్ఎస్లో చేర్పించే నెపంతో తెలంగాణ భవన్ దగ్గర ఓ రేంజ్లో హడావిడి చేశారు. తెలంగాణ భవన్కు దారితీసే ప్రధాన రహదారికి ఇరువైపులా భారీగా కటౌట్లు.. ఫ్లెక్సీలు నింపేశారు నరసింహారెడ్డి. ఇంకెవరినో టీఆర్ఎస్లో చేరుస్తూ ఈ స్థాయిలో కలరింగ్ ఇవ్వొచ్చా అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కునే పరిస్థితి. నరసింహారెడ్డిని బలపరుస్తున్న నాయకులు తెలంగాణ భవన్కు వచ్చారు కానీ.. పట్నం మహేందర్రెడ్డి కనిపించలేదు. దాంతో పార్టీలో కాసేపు చర్చ అటు కూడా మళ్లింది. నేతల బలప్రదర్శనతోపాటు వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్లోని వర్గపోరును కూడా పరిచయం చేశారని గుసగుసలు వినిపించాయి. మొత్తానికి ఒక జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎమ్మెల్యేలు.. నాయకులు ఈస్థాయిలో లాబీయింగ్ చేయడం గులాబీ శిబిరంలో పెద్ద చర్చే జరుగుతోంది.
- Tags
- off the record
- telangana
- TRS
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!