Burugupalli Sesha Rao : ఆ నియోజకవర్గం టీడీపీ నేతలు అడ్రస్ లేకుండా పోయారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Burugupalli Sesha Rao : ఆ నియోజకవర్గంలో టీడీపీ హవాకు మొన్నటి ఎన్నికల్లో చెక్ పడింది. పత్తా లేకుండా పోయారు పార్టీ నేతలు. కార్యక్రమాల స్పీడ్ తగ్గి.. కేడర్ డల్ అయ్యిందట. జనాల్లోకి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే ఎందుకు జంకుతున్నారో తమ్ముళ్లకు అర్థం కావడం లేదట. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
నిడదవోలు. టీడీపీకి ఒకప్పుడు కంచుకోట లాంటి నియోజకవర్గం. 2009లో నియోజకవర్గంగా ఏర్పడిన నిడదవోలులో వరుసగా రెండుసార్లు టీడీపీదే గెలుపు. 2019లో మాత్రం ఓటమి తప్పలేదు. వైసీపీ గాలిలో ఈ సెగ్మెంట్ కూడా టీడీపీ నుంచి జారిపోయింది. ఆ ఓటమితో కుంగిపోయారో ఏమో నియోజకవర్గంలో అసలు టీడీపీ ఉందా లేదా అన్నట్టుగా తయారైందట పరిస్థితి. రెండుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయిన బూరుగుపల్లి శేషారావు ఎక్కడున్నారో కేడర్కు అంతుచిక్క లేదట. పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. దీంతో పార్టీని నడిపించేవాళ్లు లేక తమ్ముళ్లు డీల పడ్డారట.
Also Read
2019లోనే శేషారావుకు టికెట్ ఇవ్వొద్దని కొందరు టీడీపీ నేతలు గొడవ చేశారు. చంద్రబాబు దగ్గరకు చాలా పైరవీలు చేశారట. అవన్నీ బెడిసికొట్టాయి. చివరకు ఎన్నికల్లో శేషారావు ఓటమికి వాళ్లంతా కారణమయ్యారని టాక్. ఇప్పటికీ శేషారావుపై వాళ్లు అదే వైఖరితో ఉన్నట్టు సమాచారం. వర్గపోరుకు కేంద్రంగా ఉన్నవాళ్లైనా పార్టీని పట్టిచుకోవడం లేదట. ఈ గొడవ మనకెందుకు అనుకున్నారో ఏమో.. కొన్నాళ్లు శేషారావు కూడా అడ్రస్ లేరట. అయితే శేషారావే ఇక్కడ నెగ్గుకు రాగలరని పార్టీలో కొందరు కోరస్ ఇస్తున్నారట.
రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మూడేళ్లుగా చప్పుడు చేయని టీడీపీ నిరసనల పేరుతో కార్యక్రమాలు చేపడుతోంది. ఆ ప్రభావం నిడదవోలులోనూ ఉందని తెలుగు తమ్ముళ్లు పార్టీ నేతలకు చెబుతున్నారట. కొద్దిగా దృష్టిపెడితే నిడదవోలులో మళ్లీ టీడీపీ జెండా ఎగరేయొచ్చనేది కేడర్ మాట. దానిని దృష్టిలో పెట్టుకునే ఆ మధ్య చంద్రబాబు ఎదుట గట్టిగా వాదించారట స్థానిక పార్టీ నేతలు. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి జనసేన కూడా కొంత కారణమని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. జనసేనకు 30 వేల వరకు ఓట్లు వచ్చాయి. ఇప్పుడు రెండు పార్టీలు దగ్గరయ్యే సంకేతాలు ఉండటంతో ఆశలు చిగురిస్తున్నాయట.
చంద్రబాబు దృష్టి మాత్రం శేషారావుపైనే ఉందని పార్టీ వర్గాల వాదన. అయితే ఆర్థిక ఇబ్బందులకు తోడు వర్గపోరుతో ఇబ్బంది పడుతున్నట్టు శేషారావే నేరుగా చంద్రబాబుకు చెప్పేశారట. వాటిని తాను పరిష్కరిస్తానని.. నిడదవోలులో యాక్టివ్ కావాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారట. దాంతో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ.. మనసులో ఎక్కడో అనుమానాలు అలాగే ఉండిపోయినట్టు తెలుస్తోంది. నిడదవోలు పక్కన కొవ్వూరు ఉంటుంది. ఆ ప్రభావం ఇక్కడా కనిపిస్తుంది. ఒకవేళ ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే.. అందులో నిడదవోలు ఉంటుందని టాక్. మరికొద్ది రోజుల్లోనే స్పష్టత ఇస్తారని సమాచారం. ముందుగా గ్రూపు తగాదాలకు చెక్పెట్టి అందరికీ పని నిర్దేశిస్తారని అనుకుంటున్నారట. మరి.. శేషారావును అభ్యర్థిగా ప్రకటిస్తారా.. లేక కొత్తవారిని తెరపైకి తెస్తారా అనేది చూడాలి.
తాజావార్తలు
-
DJ Noise: వినాయకుడి పండుగలో ఈ భారీ శబ్దాలు ఎందుకు..? డీజే భక్తికి నేలకొరుగుతున్న ప్రాణాలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..