TRS : తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ చుట్టూ వివాదాలేంటి..?ఆయన పదవిలో కొనసాగుతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ అమినేషియా పబ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. మైనర్ రేప్ కావడంతో పొలిటికల్ గానూ రచ్చ రచ్చ అవుతోంది. మరోవైపు ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన నేతల పిల్లలు ఉండటంతో, టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాయి విపక్షాలు. రేప్ కేసులో తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు పాత్ర ఉందని పోలీసులు తేల్చారట. కేసు పూర్తి విచారణ అయితేగాని ఎవరి పాత్ర ఏమిటో తేలే అవకాశం ఉంది.
తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీఉల్లా కొడుకు పాత్ర ఉండటంతో, ఇప్పుడు విపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. బిజెపి,కాంగ్రెస్ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అధికార పార్టీ నేతల పిల్లలు ఉండడంతోనే కేసును నీరు గారుస్తున్నారన్న విమర్శలు చేస్తున్నాయి విపక్ష పార్టీలు. మరోవైపు వక్ఫ్ బోర్డు చైర్మన్ పై అధికార పార్టీ చర్యలు తీసుకోకపోవడం, ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతా జరుగుతున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ పై యాక్షన్ ఉండకపోవడాన్నీ విపక్ష పార్టీలు అస్త్రంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
Also Read
అయితే తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా మసీఉల్లా నియామకం తర్వాత, సొంత పార్టీలోని కొందరు నేతలు ఆయన తీరుపై అసంతృప్తితో ఉన్నారట. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అపాయింట్ అయిన తర్వాత, ఎంఐఎం ముఖ్యనేతను మాసిఉల్లా కలవడాన్ని, ఆ పార్టీలో కొందరు నేతలు అప్పట్లో తప్పుబట్టారట. అర్హత లేకున్నా మసిఉల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి దక్కించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నారట. తాజాగా జూబ్లీహిల్స్ మైనర్ రేపు కేసులో, మసీవుల్లా కొడుకు పేరు బయటకు రావడంతో, ప్రత్యర్థులు మరింతగా రెచ్చిపోతున్నారట..
మొత్తంగా ఇంత జరుగుతున్నా తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ పై చర్యలు లేకపోవడంపై, విపక్షాలు గట్టిగానే విమర్శలు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
-
Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
-
AP Movie Ticket Prices: టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక నిర్మాతలకే పూర్తి స్వేచ్ఛ ?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!