హుజురాబాద్ ఉపఎన్నికలో స్పీడ్ పెంచని కాంగ్రెస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉపఎన్నికను కాంగ్రెస్ సీరియస్గా తీసుకుంటుందా? ఇంకా గ్రౌండ్లోకి ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు? పరువుకు ప్రాధాన్యం ఇచ్చి.. ఫలితం గాలికి వదిలేసిందా?
ఇంకా మొదలు కాని కాంగ్రెస్ ప్రచారం..!
Also Read
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?
- OTR : సడన్ గా ఆగిపోయిన గాంధీభవన్ ముఖాముఖి.. కాంగ్రెస్లో మంత్రులపై అధిష్టానం సీరియస్?
- OTR : రెంటికి చెడ్డ రేవడిలా యనమల కృష్ణుడు రాజకీయ జీవితం?
హుజురాబాద్ ఉపఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ మొదటి నుంచి నాన్ సీరియస్సే. గాంధీభవన్లో ఉపఎన్నిక సందడే లేదు. అసలు రాష్ట్రంలో ఒక ఉపఎన్నిక జరుగుతుందనే సోయి పార్టీ నేతల్లో ఉందో లేదో అనే డౌట్ కేడర్ది. మాజీ మంత్రి కొండా సురేఖను బరిలో దించాలని భావించి భంగపడింది. ఆమె నో చెప్పడంతో NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను తెరమీదకు తెచ్చింది. నిరుద్యోగ సమస్యను ప్రచార అజెండాగా చేసుకోబోతోంది కాంగ్రెస్. ఇంత వరకు బాగానే ఉన్నా.. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగుస్తుంది. ఇంకా కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టలేదు.
ప్రచారానికి మిగిలింది 20 రోజులే..!
వెంకట్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పార్టీ పెద్దలు రేవంత్, భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు హుజురాబాద్ వెళ్లాలని ప్లాన్ వేశారు. మిగతా సీనియర్లు హుజురాబాద్ ఎప్పుడు చేరుకోవాలో.. ఎవరేం పనిచేయాలో ఇప్పుడిప్పుడే కొలిక్కి తెస్తున్నారట. అటు చూస్తే ఈ నెల 30నే పోలింగ్. ప్రచారానికి మిగిలింది 20 రోజులే. ఇంత తక్కువ సమయంలో హుజురాబాద్లో కాంగ్రెస్ ఏ స్థాయిలో ప్రచారం చేస్తుందన్నది ఒక ప్రశ్న.
సొంత పార్టీ నేతలను బుజ్జగించడమే పెద్ద టాస్క్..!
హుజురాబాద్లో జనంలోకి వెళ్లడం కంటే.. ముందు సొంతపార్టీ నాయకులను బుజ్జగించే పనే కాంగ్రెస్లో పెద్ద టాస్క్. అభ్యర్థిగా తెరపైకి వచ్చాక.. పీసీసీకి వ్యతిరేక బ్యాచ్ దగ్గరకు వెళ్లే పని పెట్టుకున్నారు వెంకట. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇంటికెళ్లి మాట్లాడొచ్చారు. సీనియర్ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. హుజురాబాద్లో పార్టీ టికెట్ ఆశించిన 19 మందిని గాంధీభవన్కు పిలిచి మాట్లాడారు కొందరు కాంగ్రెస్ పెద్దలు. వారిని బుజ్జగించారు కూడా. అయినప్పటికీ స్థానిక కాంగ్రెస్ నేత పత్తి కృష్ణారెడ్డి అలక వీడలేదట.
ప్రచారాన్ని ఎవరు ముందుండి నడిపిస్తారు?
ఉపఎన్నికలో ప్రచార వ్యూహం ఏంటి? ప్రచారాన్ని ఎవరు ముందుండి నడిపిస్తారు? ఉపఎన్నిక పార్టీ ఇంఛార్జ్ దామోదర రాజనర్సింహ హుజురాబాద్లో ఉంటారా? పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏం చేస్తారు? ఉపఎన్నికలో ఆయన రోల్ ఏంటి? ప్రస్తుతం వీటి చుట్టూనే పార్టీలో ఎక్కువ చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి శ్రీధర్బాబుకు అభ్యర్థి వెంకట్ సన్నిహితుడు. సో.. శ్రీధర్బాబు ప్రచారానికి వెళ్తారు. సీఎల్పీ నేత భట్టికి కూడా వెంకట్ నమ్మిన వ్యక్తి. భట్టి కూడా ప్రచారంలో కనిపిస్తారని చెబుతున్నారు. మరి.. పీసీసీ చీఫ్ రేవంత్ ప్లాన్ ఏంటో ఇంకా క్లారిటీ లేదట. మరి.. నామినేషన్ దాఖలు చేసిన తర్వాతైనా కాంగ్రెస్ ఉపఎన్నిక వ్యూహం కొలిక్కి వస్తుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!